India Slams China: పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై భారత్ క్షిపణి దాడుల నేపథ్యంలో, చైనా స్టేట్ మీడియా చేస్తున్న తప్పుడు ప్రచారంపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పహల్గామ్ దాడికి ప్రతీకారంగా భారత్ ఈ రోజు తెల్లవారుజామున ‘‘ఆపరేషన్ సిందూర్’’ పేరుతో ఉగ్రస్థావరాలపై దాడులు నిర్వహించింది. పీఓకేతో పాటు పాకిస్తాన్లోని ఉగ్ర కేంద్రాలను ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో లష్కరే తోయిబా, జైషే మహ్మద్కి చెందిన 100 మంది వరకు ఉగ్రవాదులు హతమయ్యారు.