India Receives Good News Amid Conflict: యుద్ధం మధ్యలో భారత్కు శుభవార్త..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Receives Good News Amid Conflict: మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల మధ్య భారత్కు శుభవార్త అందింది.. హార్మూజ్ జలసంధి ద్వారా రెండు కీలకమైన వాణిజ్య నౌకలు, పెట్రోలియం ఉత్పత్తులను తీసుకువెళ్తూ, త్వరలో భారత్కు చేరనున్నాయి. ఈ నౌకల భద్రతను నిర్ధారించడానికి భారత నౌకాదళం పూర్తి అప్రమత్తతతో పని చేస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య దాడులు, ప్రతిదాడుల కొనసాగుతోన్న వేళ ఈ సముద్ర మార్గంలో నౌకలు సురక్షితంగా ప్రయాణించటం భారతదేశానికి ముఖ్యమైన విజయంగా పేర్కొనవచ్చు.
Also Read
- Nitesh Rane: అమీర్ ఖాన్ మూడో పెళ్లిపై బీజేపీ మంత్రి నితేష్ రాణే విమర్శలు.. 'లవ్ జిహాద్ బ్రాండ్ అంబాసిడర్' అంటూ ఫైర్!
- Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
- Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
- Bankra mosque: కోల్కతా ఎయిర్పోర్టు పక్కన 136 ఏళ్ల మసీదు తరలింపు..
జాతీయ మీడియా కథనం ప్రకారం.. ఈ విషయాన్ని ఓడరేవులు, నౌకాయానం, జలమార్గాల మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ కుమార్ సిన్హా తెలిపారు, గల్ఫ్ ప్రాంతంలో గత 24 గంటల్లో భారతీయ నౌకలకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదని. ప్రస్తుతం పర్షియన్ గల్ఫ్లో సుమారు 20 భారత జెండా నౌకలు పనిచేస్తున్నాయి, వీటిలో దాదాపు 540 మంది భారతీయులు ఉన్నారు.. వీరందరూ సురక్షితంగా ఉన్నారని స్పష్టం చేశారు. కేంద్రం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ 24×7 కమ్యూనికేషన్ సెంటర్ ద్వారా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోంది. గత 24 గంటల్లో ఈ కేంద్రానికి 98 కాల్స్ మరియు 335 ఇమెయిల్స్ వచ్చాయి.. వాటికి వెంటనే రిప్లే ఇచ్చాం.. దీనిపై ప్రభుత్వం, సంబంధిత ఏజెన్సీలు సక్రమంగా, ముందుచూపుతో వ్యవహరిస్తున్నాయని తెలిపారు..
విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా పశ్చిమ ఆసియాలో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది. సముద్ర మార్గంలో సురక్షితమైన నౌకాయానం కోసం భారత్ అంతర్జాతీయ భాగస్వాములతో నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తున్నది. ఇటీవల LPG సరఫరా కోసం ప్రయాణించిన నాలుగు భారతీయ నౌకలు విజయవంతంగా జలసంధి గుండా చేరిన విధానం కూడా ఇదే వ్యూహానికి అద్భుతమైన ఉదాహరణగా చెప్పవచ్చు.. ఈ పరిణామం భారతదేశానికి కీలకమైనది.. ఎందుకంటే, ఇంధన సరఫరాలను సురక్షితంగా ఉంచడం ద్వారా దేశంలో ఇంధన సంక్షోభం తలెత్తే అవకాశం తక్కువవుతుంది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య, భారత్ చురుకైన వ్యూహంతో తన ఇంధన అవసరాలను పూర్తి చేయగలుగుతోంది.
తాజావార్తలు
-
Muzammil Ibrahim: ప్రేమను మొదలుపెట్టింది ఆమెనే, కానీ బ్రేకప్ చేసింది నేనే!.. దీపికా మాజీ ప్రియుడి సంచలన వ్యాఖ్యలు..
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Aamir Khan: పెళ్లి తర్వాత ఆమిర్ ఖాన్ భారీ నిర్ణయం..100 కోట్లకు పైగా ఖర్చుతో కలల ఇంటి నిర్మాణం!
-
Revolt RVX vs Oben Rorr Evo: రివోల్ట్ RVX Vs ఓబెన్ రోర్ ఈవో.. ధర, రేంజ్, స్పీడ్లో ఏ ఎలక్ట్రిక్ బైక్ బెస్ట్?
-
Shreyas Iyer Captaincy: 7 మ్యాచ్ల్లో 6 ఓటములు.. శ్రేయస్ కెప్టెన్సీకి పీడకల లాంటి ఆరంభం!
ట్రెండింగ్
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!