India-Pakistan: “పాకిస్తాన్తో ఆడేది లేదు”.. కేంద్రం సంచలన నిర్ణయం..
- పాకిస్తాన్తో ద్వైపాక్షిక సిరీస్లో ఆడేది లేదని స్పష్టం చేసిన కేంద్రం..
- అంతర్జాతీయ టోర్నీలకు మాత్రం అనుమతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India-Pakistan: పాకిస్తాన్తో క్రీడా సంబంధాలపై కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ విడుదల చేసిన తాజా సర్క్యులర్ ప్రకారం.. భారత్, పాకిస్తాన్ల మధ్య ద్వైపాక్షిక క్రీడా సంబంధాలపై నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేసింది. దీని ప్రకారం.. భారత జట్లు పాకిస్తాన్లో జరిగే ద్వైపాక్షిక టోర్నమెంట్లలో పాల్గొనదు. ఇదే విధంగా పాకిస్తాన్ జట్లు కూడా భారత్లో ఇలాంటి మ్యాచ్లు ఆడే అవకాశం ఉండదు.
అయితే, ఇది అంతర్జాతీయ, మల్టీ-నేషన్ ఈవెంట్లకు వర్తించదని చెప్పింది. దీని ప్రకారం, ఒక టోర్నమెంట్లో రెండు లేదా అంతకన్నా ఎక్కువ దేశాలు భాగమైతే ఈ టోర్నీలో భారత్ పాల్గొనవచ్చు. అలాగే భారత్లో జరిగే ఇంటర్నేషనల్ టోర్నీల్లో పాకిస్తాన్ క్రీడాకారులు పాల్గొనే అవకాశం ఉంటుంది.
Also Read
- Jantar Mantar Protest: జంతర్ మంతర్ వద్ద మరో నిరసన.. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వేలాది మంది..
- Drugs Control Department: “UP TO 60%/70%/80% DISCOUNT” బోర్డులు.. ఫార్మసీలకు డ్రగ్స్ కంట్రోల్ సీరియస్ వార్నింగ్
- Rahul Gandhi: పెల్లెట్ గన్ ఘటనపై రాహుల్ గాంధీ ధర్నా.. ఎట్టకేలకు ఎఫ్ఐఆర్ నమోదు
- Maharashtra: కొడుకును కాపాడే ప్రయత్నం విషాదాంతం.. తల్లిదండ్రులు సహా ముగ్గురూ మృతి
Read Also: Jana Nayagan: ‘జననాయగన్’ టైటిల్ కార్డ్తో సోషల్ మీడియా షేక్! దళపతి విజయ్ కాదు.. ఇకపై ‘తమిళనాడు సీఎం’
ఆసియా కప్లో భారత్ పాల్గొనడంపై తలెత్తిన వివాదం నేపథ్యంలో, ఈ విధానాన్ని తొలిసారిగా 2025 ఆగస్టులో తీసుకువచ్చారు. 26 మంది మరణాలకు కారణమైన పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ ఈవెంట్లలో పాల్గొనే విషయంలో సంబంధిత ప్రపంచ క్రీడా సంస్థల మార్గదర్శకాలకు, తమ అథ్లేట్ల ప్రయోజనాలకు భారత్ ప్రాధాన్యత ఇస్తుందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. 2030 కామన్వెల్త్ గేమ్స్, 2036 ఒలింపిక్ గేమ్స్కు ఆతిథ్యం ఇచ్చేందుకు భారత్ పోటీలో ఉన్న సమయంలో ఈ మార్గదర్శకాలు వెలువడ్డాయి.
ఇదే సమయంలో భారతదేశాన్ని క్రీడలకు గమ్యస్థానంగా మార్చేందుకు అంతర్జాతీయ క్రీడా సంస్థల ఆటగాళ్లు, కోచ్లు, సాంకేతిక సిబ్బంది, అధికారుల వీసా ప్రక్రియ సులభతరం చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అంతర్జాతీయ క్రీడా సంస్థల అధికారులకు 5 ఏళ్ల వరకు మల్టిపుల్ ఎంట్రీ వీసాలను ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
తాజావార్తలు
-
Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
-
CM Revanth Reddy : ఆక్స్ఫర్డ్కు రేవంత్ ఆహ్వానం.. హైదరాబాద్లో కొత్త క్యాంపస్.?
-
Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
-
YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
-
OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!