Site icon NTV Telugu

Pax Silica: పాక్స్ సిలికాలో చేరిన భారత్.. అమెరికాతో ఒప్పందం

Paxsilica1

Paxsilica1

అమెరికాకు చెందిన పాక్స్ సెలికాలో భారత్ చేరింది. ఈ మేరకు ఢిల్లీలో జరుగుతున్న ఏఐ సమ్మిట్‌లో ప్రకటించింది. అంతేకాకుండా కూటమిలో చేరుతున్నట్లు భారత్ సంకతం కూడా చేసింది. అమెరికా రాయబారి సెర్గియో గోర్, కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ సమక్షంలో సంతకాలు జరిగాయి.

భారత్ చేసిన సంతకంతో కీలక ఖనిజాల ఉత్పత్తి, కృత్రిమ మేధ వంటి రంగాల్లో రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి. అశ్వినీ వైష్ణవ్‌ మాట్లాడుతూ.. ప్రపంచం భారత్‌ను విశ్వసిస్తోందన్నారు. భారత్‌లో నిపుణుల కొరత లేదని చెప్పారు. కూటమిలో చేరడంతో భారత ఎలక్ట్రానిక్స్‌, సెమీకండక్టర్‌ పరిశ్రమకు లబ్ధి చేకూరనుందని వెల్లడించారు.

గత సంవత్సరం డిసెంబర్‌లో వాషింగ్టన్‌లో జరిగిన పాక్స్ సిలికా సమ్మిట్‌లో కూటమి ప్రారంభించబడింది. ఇందులో ఆస్ట్రేలియా, గ్రీస్, ఇజ్రాయెల్, జపాన్, ఖతార్, దక్షిణ కొరియా, సింగపూర్, యూఏఈ, యూకే వంటి దేశాలు ఉన్నాయి. ఇప్పుడు తాజాగా భారత్ చేరింది.

ఇండియా-పాక్స్ సిలికాలో భారత్ చేరడాన్ని అమెరికా రాయబారి ప్రశంసించారు. భారతదేశం- అమెరికా మధ్య వ్యూహాత్మక కూటమిగా అమెరికా రాయబారి సెర్గియో గోర్ అభివర్ణించారు. 21వ శతాబ్దపు ఆర్థిక, సాంకేతికను రూపొందించడానికి చాలా అవసరం అన్నారు. భారతదేశ ఇంజనీరింగ్ ప్రతిభను.. అమెరికా -భారత్ టెక్ భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ఇదొక మంచి పాత్రగా అభివర్ణించారు. ప్రపంచవ్యాప్తంగా విశ్వసనీయమైన AIని ప్రోత్సహించడం ఈ భాగస్వామ్యం లక్ష్యమని అన్నారు.

Exit mobile version