అమెరికాకు చెందిన పాక్స్ సెలికాలో భారత్ చేరింది. ఈ మేరకు ఢిల్లీలో జరుగుతున్న ఏఐ సమ్మిట్లో ప్రకటించింది. అంతేకాకుండా కూటమిలో చేరుతున్నట్లు భారత్ సంకతం కూడా చేసింది. అమెరికా రాయబారి సెర్గియో గోర్, కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ సమక్షంలో సంతకాలు జరిగాయి. భారత్ చేసిన సంతకంతో కీలక ఖనిజాల ఉత్పత్తి, కృత్రిమ మేధ వంటి రంగాల్లో రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి. అశ్వినీ వైష్ణవ్ మాట్లాడుతూ.. ప్రపంచం భారత్ను విశ్వసిస్తోందన్నారు. భారత్లో నిపుణుల…