Asaduddin Owaisi: ఓవైసీ ఇంటిపై దాడి.. ‘‘జై శ్రీరాం, భారత్ మాతా కీ జై’’ నినాదాలు..
- ఢిల్లీలో ఓవైసీ ఇంటిపై దాడి..
- ఇజ్రాయిల్ అనుకూల పోస్టర్లు..
- జై శ్రీరాం
- భారత్ మాతాకీ జై నినాదాలు..
- పోలీసుల నిస్సాహయతను ప్రశ్నించిన ఓవైసీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asaduddin Owaisi: ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఢిల్లీ నివాసంపై దుండగులు దాడి చేశారు. గురువారం తన ఇంటిపై దాడి దాడి జరిగినట్లు ఓవైసీ ఆరోపించారు. గుర్తుతెలియని దుండగులు నల్ల ఇంకుతో ధ్వంసం చేశారని చెప్పాడు. ఎక్స్ వేదికగా ఆయన ఢిల్లీ పోలీసులు నిస్సాహయతను గురించి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలోని 34 అశోకా రోడ్లోని తన నివాసం ప్రధాన గేటుపై ఉన్న నేమ్ ప్లేట్పై నల్ల ఇంక్ విసిరిన విజువల్స్ పంచుకున్నారు. నా ఇంటిని ఎన్నిసార్లు టార్గెట్ చేశారో నేను ఇప్పుడు లెక్కిస్తున్నాను అని ఓవైసీ ట్వీట్ చేశారు.
Read Also: Upcoming CNG Cars: త్వరలో ఇండియా మార్కెట్లో విడుదల కానున్న సీఎన్జీ కార్లు ఇవే..!
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
ఓవైసీ ఇంటి ముందు నేమ్ప్లేట్పై ఐదుగురు వ్యక్తలు ఇజ్రాయిల్ అనుకూల పోస్టర్లు అంటించడం కనిపించింది. ‘‘భారత్ మాతా కీ జై’’, ‘‘జై శ్రీరాం’’ నినాదాలు రాశారు. భారత్ మాతాకీ జై చెప్పకుండా ఉండే ఎంపీలు, ఎమ్మెల్యేలపై కఠిన చర్యలు తీసుకోవానలి దుండగులు రాశారు. దేశంలో 140 కోట్ల మంది కూడా ఇదే పనిచేయాలని వారు రాశారు. ఇలాంటి సంఘటనలను నిరోధించలేకపోయినందుకు ఢిల్లీ పోలీసులపై ఓవైసీ నిరాశ వ్యక్తం చేశారు. అతను తన X పోస్ట్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షాను ట్యాగ్ చేసాడు. ‘‘ అమిత్ షా ఇది మీ పర్యవేక్షణలోనే జరుగుతోంది. దయచేసి ఎంపీల భద్రతకు హామీ ఇస్తారో లేదో చెప్పంది’’ అని ప్రశ్నించారు. ఇది పిరికి చర్యల అని, దుండగులు నేరుగా నన్ను ఎదుర్కోవాలని సవాల్ విసిరారు.
‘‘ నా ఇంటిని టార్గెట్ చేస్తు్న్న గుండాలు నన్ను భయపెట్టలేరు. ఈ సావార్కర్ తరహా పిరికి ప్రవర్తను ఆపండి. నన్ను ఎదుర్కోనే వారిగా ఉండండి, సిర విసిరి, కొన్ని రాళ్లు విసిరిన తర్వాత పారిపోకండి’’ అని ట్వీట్ చేశాడు. ఇటీవల పార్లమెంట్లో ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఓవైసీ ‘జై పాలస్తీనా’ అని నినాదాలు చేయడం వివాదాస్పదమైంది. ఈ వ్యాఖ్యల్ని స్పీకర్ రికార్డులను తొలగించాలని ఆదేశించారు.
తాజావార్తలు
-
Shakib Al Hasan: బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ఇంటిపై.. పెట్రోల్ బాంబు దాడి!
-
Dhanush-Kareena Kapoor: భన్సాలీ కొత్త ప్రాజెక్ట్లో ధనుష్ కి జోడీగా కరీనా? పౌరాణిక అడ్వెంచర్కు రంగం సిద్ధం!
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!