President Murmu: “భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి”.. రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము రిపబ్లిక్ డే సందేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
President Murmu: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 75వ గణతంత్ర వేడుకల సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి అని కొనియాడారు. భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ వ్యవస్థ పాశ్చాత్య ప్రజాస్వామ్య భావన కంటే చాలా పురాతనమైనది. అందుకే భారతదేశాన్ని “ప్రజాస్వామ్యానికి తల్లి” అని పిలువడానికి కారణం అని ఆమె అన్నారు. భారతదేశం ప్రస్తుతం అమృత్కాత్ ప్రారంభ దశలో ఉందని, భారతదేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లే సువర్ణావకాశం దేశ ప్రజలకు ఉందని రాష్ట్రపతి పేర్కొన్నారు. ఇది పరివర్తన సమయమని, మన లక్ష్యాలను సాధించడంలో ప్రతీ పౌరుడి సహకారం చాలా కీలమని చెప్పారు.
Read Also: Pakistan: పాకిస్తానీలను చంపింది ఇండియన్ ఏజెంట్లే.. భారత్పై పాక్ సంచలన ఆరోపణలు..
Also Read
- Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో కోర్టులో లొంగిపోయిన భర్త సమర్థ్ సింగ్
- Supreme Court: తల్లిదండ్రులు ఐఏఎస్లు అయితే మళ్లీ పిల్లలకు రిజర్వేషన్లు ఎందుకు? సుప్రీంకోర్టు సూటి ప్రశ్నలు
- RBI Dividend: ప్రభుత్వానికి ఆర్బీఐ రికార్డు స్థాయి నిధుల బదిలీ.. దాదాపు రూ.2.87 లక్షల కోట్ల వరకు..
రాష్ట్రపతి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ గురించి రాష్ట్రపతి మాట్లాడారు. అమృతకాలం అపూర్వమైన సాంకేతిక మార్పుల కాలం అవుతుందని, సాంకేతిక పురోగతి మన దైనందిక జీవితంలో భాగమవుతున్నాయని అన్నారు. భవిష్యత్తులో ఆందోళన కలిగించే అనేక రంగాలు ఉన్నాయని, కానీ ఉత్తేజకరమైన అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పారు. ముఖ్యంగా యువత కోసం అవకాశాలు ఎదురుచూస్తున్నాయని అన్నారు.
వీటితో పాటు జీ20 సమావేశాలు, అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం, మహిళా సాధికారత గురించి మాట్లాడారు. అయోధ్య రామ మందిర వేడుకను భారతదేశం మొత్తం చూసిందని, మన నాగరికత వారసత్వాతన్ని తిరిగి కనుగొనడంలో ఇది మైలురాయిగా నిలుస్తుందని అన్నారు.
చారిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లను పార్లమెంట్ ఆమోదించిందని, దేశం లింగ సమానత్వ ఆదర్శం వైపు మరింతగా పురోగమించిందని ముర్ము అన్నారు. నారీ శక్తివందన్ అధినియం మహిళా సాధికాతరకు విప్లవాత్మక సాధనంగా మారుతుందని చెప్పారు.
ఇటీవల సంవత్సరాల్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో మన జీడీపీ వృద్ధి అత్యధికంగా ఉందని, ఈ పనితీరు 2024లో అంతకుమించి కొనసాగతుందని అన్నారు.
మూన్ మిషన్, సోలార్ ఎక్స్ప్లోరర్ ఆదిత్య ఎల్1, ఎక్స్పోశాట్ అనే డీప్ స్పేస్ ప్రోబ్ ఎక్స్-రే పొలారిమీటర్ శాటిలైట్, తయారీ మ్యాన్-మిషన్ గగన్యాన్, ఇతర సాంకేతిక మైలురాళ్ల ద్వారా అంతరిక్షంలో భారతదేశం యొక్క అన్వేషణను రాష్ట్రపతి ప్రశంసించారు.
జీ 20 సమ్మిట్ గ్లోబల్ సౌత్ వాయిస్గా భారతదేశం మారిందని అన్నారు. పారిస్ ఒలింపిక్స్లో మన క్రీడాకారులు మెరుగైన ప్రదర్శన కనబరుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. నూతన విద్యావిధానం డిజిటల్ విభజనను తగ్గించడానికి శక్తినిస్తుందని అన్నారు.
తాజావార్తలు
-
SRH vs RCB: 300+ లోడింగ్.. మొదట బ్యాటింగ్ చేయనున్న కాటేరమ్మ కొడుకులు.!
-
CM Chandrababu : ఏపీలో ఎండల బీభత్సం.. లోకల్ సెలవులపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
-
KTR : అసెంబ్లీ రద్దు చెయ్.. ప్రజల తీర్పు ఏంటో చూద్దాం
-
Machilipatnam: కామర్స్ లెక్చరర్ ‘కామ లీలలు’.. ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపిన వైనం.. సడెన్గా భార్య ఎంట్రీ..!
-
Education Commission Chairman: విద్యా కమిషన్ చైర్మన్ పదవికి ఆకునూరి మురళి రాజీనామా.. సీఎస్కు లేఖ..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!