Delimitation: డీలిమిటేషన్ వల్ల దక్షిణాదికి లాభమా..నష్టమా..? లెక్కలు ఏం చెబుతున్నాయి..?
- డీలిమిటేషన్ వల్ల దక్షిణాదికి నష్టమా..?
- ఎలాంటి నష్టం లేదని బీజేపీ వాదన..
- దక్షిణాదిలో పెరిగే ఎంపీ స్థానాలు, వాటి వాటా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delimitation: కేంద్ర ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజన కోసం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే పార్లమెంట్లో కీలక బిల్లును తీసుకువచ్చింది. మూడు రోజుల పాటు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లుపై చర్చించనున్నారు. అయితే, డీలిమిటేషన్స్ వల్ల అన్ని ప్రాంతాలకు న్యాయం జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం చెబుతుంటే, విపక్షాలు మాత్రం దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ఆరోపిస్తున్నాయి. డీలిమిటేషన్స్ వల్ల లోక్సభలో ఇప్పుడున్న 543 ఎంపీ సీట్ల సంక్య 850కు పెరుగుతుంది. ఇందులో 815 రాష్ట్రాలకు, 35 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉండనున్నాయి. మొత్తం 50 శాతం సీట్ల సంఖ్య పెరగుతున్నాయి. ఇందులో మహిళా రిజర్వేషన్ ద్వారా 273 స్థానాలు కేటాయిస్తారు.
జనాభా ఆధారిత పునర్విభజన వల్ల, అధిక జనాభా పెరుగుదల ఉన్న ఉత్తరాదికి ఎక్కువగా ప్రయోజనం చేకూరుతుంందని దక్షిణాది రాష్ట్రాల వాదన. మెరుగైన జనాభా నియంత్రణ చేసినందకు మేం ఎందుకు బాధపడాలని ప్రశ్నిస్తున్నాయి. బీజేపీ పట్టు ఉన్న ఉత్తరాది రాష్ట్రాల్లో ఎంపీ సంఖ్య పెరిగితే ఆ పార్టీకి ప్రయోజనం చూకూరుతుంది విపక్షాలు ఆరోపిస్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాల వాదనను పట్టించుకోరని ఆరోపిస్తున్నారు.
Also Read
అయితే, దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఇప్పుడున్న ఎంపీ స్థానాల శాతం ప్రకారమే, పెరిగిన తర్వాత ఎంపీ సీట్ల శాతం ఉంటుందని లెక్కలేస్తున్నారు. 50 శాతం పెరుగుదలతో దక్షిణాది రాష్ట్రాల సీట్ల సంఖ్య ఎంత ఉంటుందో ఇప్పుడు చూద్దాం.

1) తమిళనాడులో ప్రస్తుతం 39 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. మొత్తం ఎంపీ స్థానాలు(ఇప్పుడున్న 543)లో ఇది 7.2 శాతం. లోక్సభ స్థానాలు 850కి పెరిగితే, తమిళనాడులో 59 ఎంపీ స్థానాలు అవుతాయి. అప్పుడు మొత్తం ఎంపీ సీట్లలో తమిళనాడు వాటా 7.2గానే ఉంటుంది.
2) కర్ణాటకలో ప్రస్తుతం 28 ఎంపీ సీట్లు ఉంటే, పెరిగిన తర్వాత దీని సంఖ్య 42కు చేరుతాయి. ముందుగా 543లో 5.15 శాతం ఉంటే, 850లో 5.14 శాతం ఉంటుంది.
3) ఆంధ్రప్రదేశ్లో 25 స్థానాల నుంచి 38 స్థానాలకు పెరుగాయి. ఇప్పుడు ఎంపీల వాటా 4.6 శాతం ఉంటే, పెరిగిన తర్వాత 4.65 శాతం ఉంటుంది.
4) తెలంగాణలో 17 ఎంపీ సీట్లు 26కు పెరుగుతాయి. వాటా 3.13 శాతం ఉంటే పెరిగిన తర్వాత 3.18 శాతం ఉంటుంది.
5) కేరళలో 20 నుంచి 30కి ఎంపీ సీట్లు పెరుగుతాయి. కేరళ వాటా 3.68 శాతం నుంచి 3.67 శాతం ఉంటుంది.
ఈ లెక్కల్ని చూస్తే పెద్దగా సీట్ల శాతంలో మార్పు లేదు. ప్రస్తుతం 129 ఎంపీ స్థానాలు దక్షిణాది రాష్ట్రాల్లో ఉంటే, పెంపు తర్వాత 195 సీట్లకు పెరుగుతుంది. దక్షిణాది ఎంపీ వాటా 24 శాతంగానే ఉంటుంది. మొత్తంగా వాటాలో పెద్ద మార్పు రాదు. దక్షిణాదిలో సీట్లు పెరిగినప్పటికీ దాని ప్రభావం అలాగే ఉంటుంది.
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!