భారత్లో రోజురోజుకు కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 2,568 కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఇదే సమయంలో 4,722 మంది కరోనా నుంచి కోలుకోగా 97 మంది మృతి చెందారు. ఒకవైపు కరోనా కేసులు తగ్గుతున్నా మరణాల సంఖ్య మాత్రం పెరగడం గమనార్హం. ముందురోజు 27గా ఉన్న మరణాల సంఖ్య… 24 గంటల వ్యవధిలోనే 97కి పెరిగింది.
కొన్నిరోజులుగా ఇండియాలో కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతున్నా మరణాల విషయంలో మాత్రం హెచ్చుతగ్గులు వస్తున్నాయి. తాజాగా నమోదైన మరణాల్లో ఒక్క కేరళలోనే 78 మరణాలు నమోదయ్యాయి. కాగా దేశంలో ప్రస్తుతం రోజువారీ పాజిటివిటీ రేటు 0.37 శాతానికి తగ్గింది. ఇప్పటి వరకు మన దేశంలో 4,24,46,171 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం 5,15,974 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 33,917 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
మరోవైపు ఇప్పటి వరకు 180 కోట్లకు పైగా కరోనా వ్యాక్సిన్ డోసులు వేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
