Site icon NTV Telugu

Corona Updates: దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు

భారత్‌లో కరోనా పాజిటివ్ గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. 20 రోజులుగా కరోనా కేసులు విపరీతంగా పడిపోయాయి. తాజాగగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 16,051 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,28,38,524కి చేరింది. తాజాగా 206 మంది కరోనాతో మరణించగా.. ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 5,12,109కి చేరింది.

డిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 37,901 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో రికవరీల సంఖ్య 4,21,24,284గా నమోదైంది. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 2,02,131కి చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,75,46,25,710 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 7,00,706 మందికి కరోనా వ్యాక్సిన్లు వేశామంది.

Exit mobile version