POK Protest: పీఓకేలో రక్తపాతం.. పాకిస్తాన్ దుర్మార్గాలపై భారత్ ఆగ్రహం..
- పీఓకే రక్తపాతంపై స్పందించిన భారత్..
- పాక్ అకృత్యాలకు జవాబుదారీగా ఉంచాలని డిమాండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
POK Protest: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)లో జరుగుతున్న హింసాత్మక ఘటనలపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పాకిస్తాన్ భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో పలువురు మరణించినట్లు వచ్చిన వార్తల నేపథ్యంలో, పాకిస్తాన్ను తాను చేస్తున్న దుర్మార్గాలకు అంతర్జాతీయ సమాజం ముందు జవాబుదారీగా నిలబెట్టాలని భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. పాకిస్తాన్ నుంచి తప్పుడు వార్తలు, ఫేక్ వీడియోలు వ్యాప్తి చెందుతున్నాయని ఆరోపించారు. పీఓకేలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనల నుంచి ప్రపంచ దృష్టిని మళ్లించేందుకు పాకిస్తాన్ ఇలాంటి ప్రచారానికి పాల్పడుతోందని ఆయన విమర్శించారు. పాక్ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఈ ప్రయత్నాలు చేస్తోందని ఆయన అన్నారు.
ఇటీవల పీఓకేలోని రావల్కోట్లో అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున పాక్ ప్రభుత్వం, ఆర్మీకి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. అయితే, వీటిని పాక్ ఆర్మీ అణిచివేసే ప్రయత్నాలు చేసింది. నిరసనకారులు, భద్రతా బలగాలకు మధ్య హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. పాక్ ఆర్మీ జరిపిన కాల్పుల్లో 30 మంది మరణించగా, 200కి పైగా గాయపడ్డారు. సోషల్ మీడియాలో వస్తున్న వీడియోలను బట్టి చూస్తే మృతుల సంఖ్య వందల్లో ఉన్నట్లు భావిస్తున్నారు. పీఓకే ప్రజలు తుపాకులు, పెట్రోల్ బాంబులతో తమపై దాడులు చేస్తున్నారని పాక్ భద్రతా బలగాలు ఆరోపిస్తున్నాయి.
Also Read
- India: చరిత్రలో తొలిసారి, 12 అణు వార్హెడ్లను మోహరించిన భారత్..
- Tamil Nadu: విజయ్ ప్రభుత్వానికి మద్దతిచ్చిన 21 మంది ఎమ్మెల్యేలకు బిగ్ రిలీఫ్.. ఏం జరిగిందంటే?
- India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
- Explained: లౌకికవాదం నుంచి హిందుత్వ వైపు.. బెంగాలీ మేధావుల మనసు ఎందుకు మారింది?
పీఓకే ప్రజల్ని పాక్ ద్వితీయ శ్రేణి పౌరులుగా చూడటం, పీఓకే వనరుల్ని పంజాబ్ తరలించడం, పీఓకే ప్రజలపై అధిక విద్యుత్ ఛార్జీలు మోపడం వంటివి చేస్తోంది. దీంతో ఈ అణిచివేత, అక్రమాలపై పీఓకే ప్రజలు తిరగబడుతున్నారు. తమకు స్వాతంత్య్రం కావాలని నినదిస్తున్నారు. మరోవైపు, ఈ అల్లర్లు పీఓకేలోని మీర్పూర్, ముజఫరాబాద్, గిల్గిట్ బాల్టిస్తాన్, దద్యాల్, రావల్కోట్, సుధ్నోటి, తట్టాపాని ప్రాంతాలకు విస్తరించాయి. మొబైల్ ఇంటర్నెట్ను పాక్ ప్రభుత్వం నిలిపేసింది. ఈ దమణకాండపై బ్రిటిష్ ఎంపీలు కూడా ఆందోళన వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
POK Protest: పీఓకేలో రక్తపాతం.. పాకిస్తాన్ దుర్మార్గాలపై భారత్ ఆగ్రహం..
-
Rajinikanth : ‘జైలర్ 2’తో బాకీ తీర్చేందుకు వస్తున్న రజినీకాంత్
-
Budhaditya Rajyog 2026: మిథునంలో సూర్యుడు.. 5 రాశుల వారికి రాజయోగాల జాక్పాట్.!
-
Dhanush – Siruthai Siva: “ఆ కథ మరెవరికీ ఇవ్వొద్దు”.. ఆ తెలుగు డైరెక్టర్కు హీరో ధనుష్ రిక్వెస్ట్! అసలు మ్యాటర్ ఇదే..
-
POK Protest: అసిమ్ మునీర్ ఒక టెర్రరిస్ట్.. పీఓకేలో తిరుగుబాటు..
ట్రెండింగ్
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!