POK Protest: పీఓకేలో రక్తపాతం.. పాకిస్తాన్ దుర్మార్గాలపై భారత్ ఆగ్రహం..
- పీఓకే రక్తపాతంపై స్పందించిన భారత్..
- పాక్ అకృత్యాలకు జవాబుదారీగా ఉంచాలని డిమాండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
POK Protest: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)లో జరుగుతున్న హింసాత్మక ఘటనలపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పాకిస్తాన్ భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో పలువురు మరణించినట్లు వచ్చిన వార్తల నేపథ్యంలో, పాకిస్తాన్ను తాను చేస్తున్న దుర్మార్గాలకు అంతర్జాతీయ సమాజం ముందు జవాబుదారీగా నిలబెట్టాలని భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. పాకిస్తాన్ నుంచి తప్పుడు వార్తలు, ఫేక్ వీడియోలు వ్యాప్తి చెందుతున్నాయని ఆరోపించారు. పీఓకేలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనల నుంచి ప్రపంచ దృష్టిని మళ్లించేందుకు పాకిస్తాన్ ఇలాంటి ప్రచారానికి పాల్పడుతోందని ఆయన విమర్శించారు. పాక్ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఈ ప్రయత్నాలు చేస్తోందని ఆయన అన్నారు.
ఇటీవల పీఓకేలోని రావల్కోట్లో అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున పాక్ ప్రభుత్వం, ఆర్మీకి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. అయితే, వీటిని పాక్ ఆర్మీ అణిచివేసే ప్రయత్నాలు చేసింది. నిరసనకారులు, భద్రతా బలగాలకు మధ్య హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. పాక్ ఆర్మీ జరిపిన కాల్పుల్లో 30 మంది మరణించగా, 200కి పైగా గాయపడ్డారు. సోషల్ మీడియాలో వస్తున్న వీడియోలను బట్టి చూస్తే మృతుల సంఖ్య వందల్లో ఉన్నట్లు భావిస్తున్నారు. పీఓకే ప్రజలు తుపాకులు, పెట్రోల్ బాంబులతో తమపై దాడులు చేస్తున్నారని పాక్ భద్రతా బలగాలు ఆరోపిస్తున్నాయి.
Also Read
- Siya Goyal: ప్రియుడి కోసం కాబోయే భర్త హ*త్య.. పూణే కోటలో నిందితులతో క్రైమ్ సీన్ రీక్రియేట్.. కుటుంబ సభ్యుల్లో ఆవేదన
- Woman Litters In Train: రైలు కోచ్లో చెత్త విసిరి, సీటు పక్కనే చేతులు కడిగిన మహిళ.. సివిక్ సెన్స్పై దేశవ్యాప్తంగా చర్చ
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
పీఓకే ప్రజల్ని పాక్ ద్వితీయ శ్రేణి పౌరులుగా చూడటం, పీఓకే వనరుల్ని పంజాబ్ తరలించడం, పీఓకే ప్రజలపై అధిక విద్యుత్ ఛార్జీలు మోపడం వంటివి చేస్తోంది. దీంతో ఈ అణిచివేత, అక్రమాలపై పీఓకే ప్రజలు తిరగబడుతున్నారు. తమకు స్వాతంత్య్రం కావాలని నినదిస్తున్నారు. మరోవైపు, ఈ అల్లర్లు పీఓకేలోని మీర్పూర్, ముజఫరాబాద్, గిల్గిట్ బాల్టిస్తాన్, దద్యాల్, రావల్కోట్, సుధ్నోటి, తట్టాపాని ప్రాంతాలకు విస్తరించాయి. మొబైల్ ఇంటర్నెట్ను పాక్ ప్రభుత్వం నిలిపేసింది. ఈ దమణకాండపై బ్రిటిష్ ఎంపీలు కూడా ఆందోళన వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
SUV Safety: ఎస్యూవీలతో పాదచారులకు ముప్పు.. 8 ఏళ్లలో 3,000కు పైగా మరణాలు!
-
Red Magic Tablet 5 Pro: రెడ్ మ్యాజిక్ టాబ్లెట్ 5 ప్రో వచ్చేస్తోంది.. 8300mAh బ్యాటరీ, 185Hz OLED డిస్ప్లే
-
Animation Universe: టాలీవుడ్లో కొత్త ట్రెండ్.. ‘ఆర్య’ కోసం యానిమేటెడ్ యూనివర్స్ సిద్ధం!
-
Back To Back Releases : మూడు నెలల్లో మూడు సినిమాలు రిలీజ్ చేస్తున్న స్టార్ హీరో
-
Siya Goyal: ప్రియుడి కోసం కాబోయే భర్త హ*త్య.. పూణే కోటలో నిందితులతో క్రైమ్ సీన్ రీక్రియేట్.. కుటుంబ సభ్యుల్లో ఆవేదన
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!