India-China: భారతీయులకు గుడ్న్యూస్.. భారత్-చైనా విమాన సర్వీసులు ప్రారంభం ఎప్పుడంటే..!
- భారతీయులకు గుడ్న్యూస్
- ఈనెలలోనే భారత్-చైనా విమాన సర్వీసులు ప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయులకు గుడ్న్యూస్ అందింది. భారత్-చైనా మధ్య విమాన సర్వీసులు ప్రారంభం కాబోతున్నాయి. ఈ మేరకు రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ప్రత్యక్ష విమాన సర్వీసులు తిరిగి ప్రారంభించేందుకు రెండు దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ నెలాఖరు నాటికి రెండు దేశాల మధ్య విమాన సర్వీసులు ప్రారంభమయ్యే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి.
ఇది కూడా చదవండి: UP: బరేలీలో హై అలర్ట్.. 48 గంటలు ఇంటర్నెట్ సేవలు బంద్
Also Read
- Tamilanadu CM Vijay: తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్.. దశాబ్దాల నాటి డీఎంకే-ఏఐఏడీఎంకే శకానికి తెర
- Trisha: నీలిరంగు పట్టుచీరలో మెరిసిపోయిన త్రిష.. విజయ్ ప్రమాణ స్వీకార వేడుకలో స్పెషల్ అట్రాక్షన్!
- TVK MLAs: తొలిసారి ఎమ్మేల్యేలుగా 93 మంది టీవీకే నాయకులు.. 40 మందిపై క్రిమినల్ ఆరోపణలు!
- Thalapathy Vijay Cabinet Ministers and Portfolios: విజయ్ కేబినెట్ ఖరారు.. కాసేపట్లో సీఎంగా ప్రమాణస్వీకారం.. ఇలా శాఖల కేటాయింపు
గల్వాన్ ఘర్షణల కారణంగా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య సంబంధాలు బలపడ్డాయి. ద్వైపాక్షిక సంబంధాలు జరిగాయి. అంతేకాకుండా గత నెలలో ప్రధాని మోడీ చైనాలో కూడా పర్యటించి వచ్చారు. అంతకు ముందు విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా చైనాలో పర్యటించి ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. దీంతో తిరిగి రెండు దేశాల మధ్య సంబంధాలు బలపడడంతో విమాన సర్వీసులపై తాజాగా ఒప్పందం జరిగింది. దీంతో అక్టోబర్ చివరి నాటికి విమాన సర్వీసులు పునఃప్రారంభం కానున్నాయి.
ఇది కూడా చదవండి: UP: వరకట్నం హత్య కేసులో షాకింగ్ ఘటన.. రెండేళ్ల తర్వాత బిగ్ ట్విస్ట్
పౌర విమానయాన అధికారుల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం.. భారతదేశం-చైనా మధ్య ప్రజల మధ్య సంబంధాన్ని మరింత సులభతరం చేయనుంది. ద్వైపాక్షిక మార్పిడులు క్రమంగా సాధారణ స్థితికి తీసుకొస్తున్నాయని విదేశాంగ తెలిపింది. సంబంధాలు సాధారణ స్థితికి చేరుకున్నందున అక్టోబర్ చివరి నుంచి ప్రత్యక్ష విమానాలను తిరిగి ప్రారంభించడానికి భారతదేశం, చైనా అంగీకరించాయి. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ గురువారం ఒక అధికారిక ప్రకటనలో ప్రకటించింది.
దౌత్యపరమైన చొరవను అనుసరించి.. ఇండిగో విమానం 2025 అక్టోబర్ 26 నుంచి కోల్కతా నుంచి గ్వాంగ్జౌకు రోజువారీ నాన్-స్టాప్ విమానాలను నడపనుంది. చైనా భూభాగానికి తన సేవలను తిరిగి ప్రారంభించనున్నట్లు ఇండిగో ప్రకటించింది.
తాజావార్తలు
-
Vijay-Trisha: విజయ్-త్రిష పెళ్లి చేసుకుంటే ఆ ఫంక్షన్లో నేనే డాన్స్ చేస్తా.. రాఖీ సావంత్ షాకింగ్ కామెంట్స్!
-
Beetroot Buttermilk Recipe: నిమిషాల్లో బీట్రూట్ మజ్జిగ రెడీ.. ప్రతిరోజూ తాగితే ముఖం మెరిసిపోతుంది..!
-
Tamilanadu CM Vijay: తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్.. దశాబ్దాల నాటి డీఎంకే-ఏఐఏడీఎంకే శకానికి తెర
-
Shubman Gill: ఏబీ డి విలియర్స్ను వెనక్కి నెట్టి.. కోహ్లీ, రోహిత్ సైతం సాధించలేని రికార్డ్ క్రియేట్ చేసిన శుభ్మన్ గిల్
-
Trisha: నీలిరంగు పట్టుచీరలో మెరిసిపోయిన త్రిష.. విజయ్ ప్రమాణ స్వీకార వేడుకలో స్పెషల్ అట్రాక్షన్!