INDIA Bloc: రేపు ఇండియా కూటమి కీలక భేటీ.. పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ
- రేపు ఇండియా కూటమి కీలక భేటీ
- పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియా కూటమి మంగళవారం సమావేశం కానుంది. ఉదయం 10 గంటలకు నేతలంతా కీలక సమావేశం నిర్వహించనున్నారు. సోమవారం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలి రోజే ఆయా అంశాలపై ప్రతిపక్ష పార్టీలు లేవనెత్తాయి. దీంతో గందరగోళం నెలకొనడంతో ఉభయ సభలు పలుమార్లు వాయిదా పడ్డాయి.
ఇది కూడా చదవండి: Jagdeep Dhankhar: ఉప రాష్ట్రపతి పదవికి ధన్ఖడ్ రాజీనామా
Also Read
- Muskan Pradhan: తాగొచ్చిన వరుడికి చెంపదెబ్బ.. ఇప్పుడు మహిళలకు మార్గదర్శి! కౌన్సెలర్గా నియమితురాలైన ముస్కాన్
- Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ అమరవీరుల పేర్లు ఇవే.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆరుగురు వీరులు!
- BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
- Animal Ambulance: జంతువుల ప్రాణాలు కాపాడేందుకు తొలి EV బైక్ అంబులెన్స్ షురూ.!
ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పహల్గామ్ ఉగ్ర దాడి, ఆపరేషన్ సిందూర్ ఆంశాలు లేవనెత్తుతోంది. అలాగే బీహార్లో ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక డ్రైవ్ను విపక్షాలు తీవ్రంగా తప్పుపడుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఇండియా కూటమి నేతలంతా చర్చించనున్నారు. అధికార పార్టీని ఎలా ఎదుర్కోవాలన్న దానిపై వ్యూహాలు రచించనున్నారు. ఇక ఈ కూటమి నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ వైదొలిగింది. మిగతా పక్షాలు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ఇక సమావేశం తర్వాత ప్రతిపక్ష ఎంపీలంతా బీహార్ ఎన్నికల ప్రక్రియపై, పహల్గామ్ ఉగ్రదాడి, జమ్మూకాశ్మీర్కు రాష్ట్ర హోదా కల్పించాలంటూ నిరసన చేపట్టనున్నారు.
ఇది కూడా చదవండి: Modi-Trump: వాణిజ్యంపై కొలిక్కిరాని 5వ రౌండ్ చర్చలు.. దగ్గరపడుతున్న డెడ్లైన్!
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 21 వరకు జరగనున్నాయి. మొత్తం 32 రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల కోసం పార్లమెంటు ఉభయ సభలు ఆగస్టు 12 నుంచి ఆగస్టు 17 వరకు వాయిదా పడతాయి. తిరిగి ఆగస్టు 18న సమావేశమవుతాయి.
ఇక పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సమయంలో కీలక పరిణామం జరిగింది. ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్ఖడ్ రాజీనామా చేశారు. అనారోగ్య కారాణాలతో ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసినట్లు వెల్లడించారు. 2022, జులై 16న ఉపరాష్ట్రపతిగా ధన్ఖడ్ ఎన్నికయ్యారు. రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు. ఇక రాజీనామా లేఖలో ప్రధాని మోడీకి, రాష్ట్రపతికి ధన్ఖడ్ కృతజ్ఞతలు తెలిపారు.
అయితే ధన్ ఖడ్ రాజీనామాపై అనేకమైన వదంతులు వినిపిస్తున్నాయి. మోడీ ప్రభుత్వానికి మేలు చేసేందుకే రాజీనామా చేశారంటూ పుకార్లు వినిపిస్తున్నాయి. త్వరలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన రాజీనామా చేశారని అంటున్నారు. బీహార్ వ్యక్తికి ఉప రాష్ట్రపతి పదవి కట్టబెట్టే అవకాశాలు ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తు్న్నాయి.
తాజావార్తలు
-
Muskan Pradhan: తాగొచ్చిన వరుడికి చెంపదెబ్బ.. ఇప్పుడు మహిళలకు మార్గదర్శి! కౌన్సెలర్గా నియమితురాలైన ముస్కాన్
-
Asha Bhosle : ఆశా భోస్లేకు బ్రిటిష్ బ్యాండ్ గొరిల్లాజ్ ఘన నివాళి.. లండన్ స్టేడియంలో భావోద్వేగ క్షణాలు
-
NRI: అంతిమ శ్వాస భారత్లోనే… అమెరికా పౌరసత్వం ఉన్న బాపట్ల వృద్ధురాలి కన్నీటి విజ్ఞప్తి!
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ అమరవీరుల పేర్లు ఇవే.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆరుగురు వీరులు!
ట్రెండింగ్
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!