PM Modi: ఇండియా కూటమి ముస్లిం ఓట్ల కోసం ‘బానిసత్వం’ చేస్తుంది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: కాంగ్రెస్, ఆర్జేడీ, ఇండియా కూటమిలోని పలు పార్టీలను టార్గెట్ చేస్తూ ప్రధాని నరేంద్రమోడీ మరోసారి ఫైర్ అయ్యారు. ఈ రోజు బీహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ఇండియా కూటమిపై విరుచుకుపడ్డారు. ముస్లిం ఓట్ల కోసం ఇండియా కూటమి బానిసత్వం చేస్తుందని ఆరోపించారు. ఎస్సీ/ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను దోచుకునే ప్రయత్నాలను అడ్డుకుంటానని ఆయన అన్నారు. పాటలీపుత్ర లోక్ సభ స్థానంలో ఆయన బీజేపీ అభ్యర్థి తరుపున ప్రచారం చేశారు. బీహార్లోని మైనారిటీ సంస్థల్లో ఎస్సీ/ఎస్టీ, ఓబీసీ వర్గాలు కోటాలను కోల్పోవడానికి ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలను నిందించారు.
Read Also: Baby Leaks: సాయి రాజేష్ ‘బేబి’ కాపీ.. సాక్ష్యాలతో ‘బేబీ లీక్స్’ బుక్.. దర్శకుడు సంచలనం!
Also Read
- Heart Attack: షాకింగ్.. 13 ఏళ్లకే గుండెపోటు.. స్కూల్ వాష్రూమ్లో ఏడో తరగతి బాలుడి మృతి..
- Ketan Agarwal Murder: పూణే కేతన్ అగర్వాల్ హత్యలో కీలక పరిణామం.. ఏం జరిగిందంటే.?
- Saharanpur Mosque: కూల్చివేసిన మసీదు కింద పురాతన బావి.. ASI ఎంట్రీ..
- Bypolls: తమిళనాడు సహా 5 రాష్ట్రాల్లో బైపోల్స్ షెడ్యూల్ విడుదల.. పోలింగ్ ఎప్పుడంటే..!
‘‘సామాజిక న్యాయం కోసం దిశానిర్దేశం చేసే భూమి బీహార్. ఎస్సీ/ఎస్టీ, ఓబీసీ హక్కులను దోచుకోవడానికి, వాటిని ముస్లింలకు మళ్లించడానికి ఇండియా కూటమి ప్లాన్ చేస్తోంది. వారు బానిసలుగా ఉండీ తమ ఓటు బ్యాంకును ప్రసన్నం చేసుకుంటున్నారు. నేను దానిని భగ్నం చేస్తాను’’ అని ప్రధాని అన్నారు. ప్రతిపక్ష కూటమి ‘‘ఓట్ జిహాద్’’ మునిగితేలుతుందని విమర్శించారు. ముస్లింలను ఓబీసీలో చేర్చలనే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ నిర్ణయాన్ని కలకత్తా హైకోర్టు కొట్టేసిన ఉత్తర్వులను ప్రధాని ప్రస్తావించారు. చాలా మందికి రాముడితో గొడవ ఉందని, వారు రామ్ కృపాల్ పేరు కూడా విస్మరించవచ్చు అని బీజేపీ ఎంపీ పేరును ప్రస్తావిస్తూ విమర్శలు చేశారు.
జూన్ 4 తర్వాత లడ్డూలు సిద్ధం చేసుకోవాలని, ఇది మీ ఎంపీని ఎన్నుకన్నందుకు మాత్రమే కాదని మీ పీఎం కోసమని ఆయన అన్నారు. ఎల్ఈడీ బల్బుల యుగంలో బీహార్ మొత్తాన్ని చీకట్లో ఉంచి తమ ఇంటిని మాత్రమే వెలిగించే లాంతరుతో తిరుగుతున్నారని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ను పేరు ప్రస్తావించకుండా ప్రధాని మోదీ ఎగతాళి చేశారు.లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కూతురు మిసా భారతి పాటలీపుత్ర నుంచి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్, ఆర్జేడీ, ఎన్సీపీ, సమాజ్ వాదీ పార్టీలు కుటుంబ పార్టీలని విమర్శించారు. మెరుగైన విద్యుత్ సరఫరాతో పాటు మరిన్ని పక్కా గృహాలతో బీహార్లో వేగంగా అభివృద్ధి చెందుతుందని, రాబోయే ఐదేళ్లపాటు తాను అధికారంలో ఉంటానని ప్రధాని ప్రజలకు హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
ఎలాన్ మస్క్ పై ‘Musk’ డాక్యుమెంటరీ.. ట్రైలర్లో సంచలన వ్యాఖ్యలు..!
-
Postpone Trend : పెద్ద సినిమా అంటే పోస్ట్పోన్ వార్త వైరల్ కావాల్సిందే
-
Theatrical Releases: ఈ వారం థియేటర్లలో అదరగొట్టబోతున్న సరికొత్త సినిమాలు..
-
Heart Attack: షాకింగ్.. 13 ఏళ్లకే గుండెపోటు.. స్కూల్ వాష్రూమ్లో ఏడో తరగతి బాలుడి మృతి..
-
India vs Pakistan: ఆసియా కప్లో మరోసారి భారత్-పాక్ పోరు సాధ్యమే.. కానీ, ఓ ట్విస్ట్!
ట్రెండింగ్
-
Huawei FreeBuds 7, Watch 6 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
1,705 కి.మీ రేంజ్, 4,890W ఆడియోతో అదిరిపోయే SUVలతో Xiaomi SkyNomad సిరీస్ లాంచ్..!
-
India Head Coach: టీమిండియా హెడ్ కోచ్ పదవా?.. నాకు విడాకులు పక్కా.. ఆశిష్ నెహ్రా సంచలన వ్యాఖ్యలు!
-
13.3 అంగుళాల 3.4K 144Hz డిస్ప్లే, 12,000mAh బ్యాటరీతో Xiaomi Pad 9 Pro Max లాంచ్..!
-
7.58 అంగుళాల ఫోల్డబుల్ డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 200MP లైకా కెమెరాతో Xiaomi 18 Fold లాంచ్.!