India-Bangladesh: ‘‘ఇది షేక్ హసీనా ప్రభుత్వం కాదు’’.. భారత్కు బంగ్లా ప్రధాని సలహాదారు ఘాటు సందేశం
- భారత్, బంగ్లాదేశ్ మధ్య దౌత్య వివాదం..
- బంగ్లా ప్రధాని సలహాదారు భారత పర్యటనపై రచ్చ..
- కావాలనే సీన్ క్రియేట్ చేసిన జాహెద్ ఉర్ రెహమాన్..
- ఇది హసీనా ప్రభుత్వం కాదంటూ భారత్కు సందేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India-Bangladesh: పచ్చి భారత వ్యతిరేకి, బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ ఉర్ రెహ్మన్ సలహాదరులు జాహెద్ ఉర్ రెహమాన్ వ్యవహారం రెండు దేశాల మధ్య దౌత్య ఉద్రిక్తతకు కారణమైంది. ఇటీవల, భారత్లో జరిగిన ఒక అంతర్జాతీయ సమావేశంలో కోసం వచ్చిన జాహెద్ను ఢిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయంలో 2.5 గంటల పాటు నిలిపేశారు. భారత బ్లాక్లిస్టులో ఇతడి పేరు ఉంది. దీంతో అధికారులు విచారణ చేశారు. అయితే, దౌత్య కార్యక్రమంలో కోసం వచ్చిన జాహెద్ తన దౌత్య పాస్పోర్టు ఉపయోగించకుండా, సాధారణ పాస్పోర్టు ఉపయోగించారు. కావాలనే ఇలాంటి చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతను పెంచింది. ఢిల్లీ ఘటన తర్వాత అతను కొలంబో మీదుగా ఢాకాకు వెంటనే వెళ్లిపోయాడు.
ఈ సంఘటనపై జాహెద్ ఉర్ రెహ్మాన్ భారత్ను హెచ్చరించే విధంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇది షేక్ హసీనా ప్రభుత్వం కాదనే సందేశాన్ని దేశం లోపల, బయట పంపాల్సిన అవసరం ఉందని భావించా’’ అని అన్నాడు. భారత అధికారులు తనను వేధించినట్లు బంగ్లాదేశ్ మీడియాతో చెప్పాడు. తన నిర్ణయం వల్ల రెండు దేశాల మధ్య శత్రుత్వం, ప్రతికూల పరిస్థితిని కోరుకోవడం లేదని చెబుతూనే భారత్పై ఉన్న అక్కసును వెళ్లగక్కాడు.
Also Read
- Tamil Nadu Politics: వరుస ఎదురుదెబ్బలు.. అన్నాడీఎంకే నుంచి మరో ఎమ్మెల్యే ఔట్
- LRLACM: భారత స్వదేశీ ‘‘తోమహాక్’’.. పాక్, చైనాలకు ముచ్చెమటలు గ్యారెంటీ..
- Mansukh Kaka: శభాష్ తాతా అనాలా? లేక విధి రాతను నిందించాలా?.. 82 ఏళ్ల వయసులో రోడ్డుపై కన్నీటి కష్టం!
- Uddhav Thackeray: మరోసారి ముక్కలు కాబోతున్న శివసేన పార్టీ? కుప్పకూలుతున్న ఉద్ధవ్ సామ్రాజ్యం!
జాహెద్ తరుచుగా భారత్ను విమర్శిస్తాడు. ఒకానొక సమయంలో భారత్ను ‘‘మూర్ఖపు పొరుగుదేశం’’ అని విమర్శించాడు. ప్రధాని నరేంద్రమోడీ, అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్ సహా బీజేపీపై పలు వ్యాఖ్యలు చేశాడు. ఢిల్లీ ఘటనపై మాట్లాడుతూ.. తాను అక్కడికి బంగ్లా ప్రతినిధిగా వెళ్లానని, తనకు జరిగిన అవమానానికి నిరసన తెలిపినట్లు చెప్పాడు. ఇది షేక్ హసీనా ప్రభుత్వం కాదని, ప్రజల ఆమోదం పొందిన ప్రభుత్వం అని, ఈ సందేశాన్ని పంపాలనే భారత పర్యటనను రద్దు చేసుకున్నట్లు చెప్పుకొచ్చాడు.
తాజావార్తలు
-
India-Bangladesh: ‘‘ఇది షేక్ హసీనా ప్రభుత్వం కాదు’’.. భారత్కు బంగ్లా ప్రధాని సలహాదారు ఘాటు సందేశం
-
Natti Kumar: పర్సంటేజ్ సబ్ కమిటీ నుంచి సురేష్ బాబు, దిల్ రాజు తప్పుకోవాలి
-
Tamil Nadu Politics: వరుస ఎదురుదెబ్బలు.. అన్నాడీఎంకే నుంచి మరో ఎమ్మెల్యే ఔట్
-
Modi – Trump: ప్రపంచ దేశాల కళ్లు ఫ్రాన్స్పైనే.. జీ7 సదస్సులో చేతులు కలిపిన మోడీ – ట్రంప్! వాషింగ్టన్ టు ఢిల్లీ నయా జోష్..
-
Thalliki Vandanam Scheme: ‘తల్లికి వందనం’పై గుడ్న్యూస్.. అధికారులకు మంత్రి లోకేష్ కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?