India-Bangladesh: ‘‘ఇది షేక్ హసీనా ప్రభుత్వం కాదు’’.. భారత్కు బంగ్లా ప్రధాని సలహాదారు ఘాటు సందేశం
- భారత్, బంగ్లాదేశ్ మధ్య దౌత్య వివాదం..
- బంగ్లా ప్రధాని సలహాదారు భారత పర్యటనపై రచ్చ..
- కావాలనే సీన్ క్రియేట్ చేసిన జాహెద్ ఉర్ రెహమాన్..
- ఇది హసీనా ప్రభుత్వం కాదంటూ భారత్కు సందేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India-Bangladesh: పచ్చి భారత వ్యతిరేకి, బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ ఉర్ రెహ్మన్ సలహాదరులు జాహెద్ ఉర్ రెహమాన్ వ్యవహారం రెండు దేశాల మధ్య దౌత్య ఉద్రిక్తతకు కారణమైంది. ఇటీవల, భారత్లో జరిగిన ఒక అంతర్జాతీయ సమావేశంలో కోసం వచ్చిన జాహెద్ను ఢిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయంలో 2.5 గంటల పాటు నిలిపేశారు. భారత బ్లాక్లిస్టులో ఇతడి పేరు ఉంది. దీంతో అధికారులు విచారణ చేశారు. అయితే, దౌత్య కార్యక్రమంలో కోసం వచ్చిన జాహెద్ తన దౌత్య పాస్పోర్టు ఉపయోగించకుండా, సాధారణ పాస్పోర్టు ఉపయోగించారు. కావాలనే ఇలాంటి చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతను పెంచింది. ఢిల్లీ ఘటన తర్వాత అతను కొలంబో మీదుగా ఢాకాకు వెంటనే వెళ్లిపోయాడు.
ఈ సంఘటనపై జాహెద్ ఉర్ రెహ్మాన్ భారత్ను హెచ్చరించే విధంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇది షేక్ హసీనా ప్రభుత్వం కాదనే సందేశాన్ని దేశం లోపల, బయట పంపాల్సిన అవసరం ఉందని భావించా’’ అని అన్నాడు. భారత అధికారులు తనను వేధించినట్లు బంగ్లాదేశ్ మీడియాతో చెప్పాడు. తన నిర్ణయం వల్ల రెండు దేశాల మధ్య శత్రుత్వం, ప్రతికూల పరిస్థితిని కోరుకోవడం లేదని చెబుతూనే భారత్పై ఉన్న అక్కసును వెళ్లగక్కాడు.
Also Read
- Price Hike from August 1: ఆగస్టు 1 నుంచి ధరల మోత.. నూనె, సబ్బు, టీవీ, ఫ్రిజ్ నుంచి కార్ల వరకు పెరగనున్న ధరలు..!
- Lok sabha: ఎయిరిండియా ప్రమాద దర్యాప్తుపై కేంద్రం కీలక ప్రకటన
- Kiren Rijiju: ‘‘రాహుల్ గాంధీ హత్య చేశారని నేను కూడా చెప్పొచ్చు’’.. కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు..
- Lok Sabha: లోక్సభలో పాసైన యాంటీ పేపర్ లీక్ బిల్లు
జాహెద్ తరుచుగా భారత్ను విమర్శిస్తాడు. ఒకానొక సమయంలో భారత్ను ‘‘మూర్ఖపు పొరుగుదేశం’’ అని విమర్శించాడు. ప్రధాని నరేంద్రమోడీ, అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్ సహా బీజేపీపై పలు వ్యాఖ్యలు చేశాడు. ఢిల్లీ ఘటనపై మాట్లాడుతూ.. తాను అక్కడికి బంగ్లా ప్రతినిధిగా వెళ్లానని, తనకు జరిగిన అవమానానికి నిరసన తెలిపినట్లు చెప్పాడు. ఇది షేక్ హసీనా ప్రభుత్వం కాదని, ప్రజల ఆమోదం పొందిన ప్రభుత్వం అని, ఈ సందేశాన్ని పంపాలనే భారత పర్యటనను రద్దు చేసుకున్నట్లు చెప్పుకొచ్చాడు.
తాజావార్తలు
-
Sandhya Theatre Stampede Case: తొక్కిసలాట కేసు: నాంపల్లి కోర్టు కీలక ఆదేశాలు
-
Price Hike from August 1: ఆగస్టు 1 నుంచి ధరల మోత.. నూనె, సబ్బు, టీవీ, ఫ్రిజ్ నుంచి కార్ల వరకు పెరగనున్న ధరలు..!
-
Ajay Bhupathi: టైటిల్ కోసం జపాన్ వరకు వెళ్లడం ఏంది సామి.. ‘RX100’ టైటిల్ గురించి అజయ్ భూపతి షాకింగ్ రివీల్!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
Lok sabha: ఎయిరిండియా ప్రమాద దర్యాప్తుపై కేంద్రం కీలక ప్రకటన
ట్రెండింగ్
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్టాప్లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!
-
Womens Shave Heads: విక్రమార్కుడు మూవీ సీన్ రిపీట్.. డబ్బు కోసం గుండు కొట్టించుకున్న మహిళలు.. చివరలో ఊహించని ట్విస్ట్!
-
200MP డ్యూయల్ కెమెరాలు, ARRI సినిమా టెక్నాలజీతో రానున్న HONOR Robot Phone..!