India-Bangladesh: ‘‘ఇది షేక్ హసీనా ప్రభుత్వం కాదు’’.. భారత్కు బంగ్లా ప్రధాని సలహాదారు ఘాటు సందేశం
- భారత్, బంగ్లాదేశ్ మధ్య దౌత్య వివాదం..
- బంగ్లా ప్రధాని సలహాదారు భారత పర్యటనపై రచ్చ..
- కావాలనే సీన్ క్రియేట్ చేసిన జాహెద్ ఉర్ రెహమాన్..
- ఇది హసీనా ప్రభుత్వం కాదంటూ భారత్కు సందేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India-Bangladesh: పచ్చి భారత వ్యతిరేకి, బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ ఉర్ రెహ్మన్ సలహాదరులు జాహెద్ ఉర్ రెహమాన్ వ్యవహారం రెండు దేశాల మధ్య దౌత్య ఉద్రిక్తతకు కారణమైంది. ఇటీవల, భారత్లో జరిగిన ఒక అంతర్జాతీయ సమావేశంలో కోసం వచ్చిన జాహెద్ను ఢిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయంలో 2.5 గంటల పాటు నిలిపేశారు. భారత బ్లాక్లిస్టులో ఇతడి పేరు ఉంది. దీంతో అధికారులు విచారణ చేశారు. అయితే, దౌత్య కార్యక్రమంలో కోసం వచ్చిన జాహెద్ తన దౌత్య పాస్పోర్టు ఉపయోగించకుండా, సాధారణ పాస్పోర్టు ఉపయోగించారు. కావాలనే ఇలాంటి చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతను పెంచింది. ఢిల్లీ ఘటన తర్వాత అతను కొలంబో మీదుగా ఢాకాకు వెంటనే వెళ్లిపోయాడు.
ఈ సంఘటనపై జాహెద్ ఉర్ రెహ్మాన్ భారత్ను హెచ్చరించే విధంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇది షేక్ హసీనా ప్రభుత్వం కాదనే సందేశాన్ని దేశం లోపల, బయట పంపాల్సిన అవసరం ఉందని భావించా’’ అని అన్నాడు. భారత అధికారులు తనను వేధించినట్లు బంగ్లాదేశ్ మీడియాతో చెప్పాడు. తన నిర్ణయం వల్ల రెండు దేశాల మధ్య శత్రుత్వం, ప్రతికూల పరిస్థితిని కోరుకోవడం లేదని చెబుతూనే భారత్పై ఉన్న అక్కసును వెళ్లగక్కాడు.
Also Read
- Asaduddin Owaisi: RSS అనుబంధ సంస్థ సమావేశానికి అస్సాం రైఫిల్స్.. ఓవైసీ ఆగ్రహం.
- Digital Train Ticket: వాట్సాప్ టిక్కెట్లకు చెల్లుచీటి.. రైల్వే శాఖ తెచ్చిన సరికొత్త రూల్స్..
- IND-UK FTA: చౌకగా డిఫెండర్ కారు, సగం ధరకే విస్కీ.. జూలై 15 నుంచి అమలు..
- Maharashtra: షిండే-పవార్ భేటీ.. సుప్రియా సూలే కీలక వ్యాఖ్యలు..
జాహెద్ తరుచుగా భారత్ను విమర్శిస్తాడు. ఒకానొక సమయంలో భారత్ను ‘‘మూర్ఖపు పొరుగుదేశం’’ అని విమర్శించాడు. ప్రధాని నరేంద్రమోడీ, అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్ సహా బీజేపీపై పలు వ్యాఖ్యలు చేశాడు. ఢిల్లీ ఘటనపై మాట్లాడుతూ.. తాను అక్కడికి బంగ్లా ప్రతినిధిగా వెళ్లానని, తనకు జరిగిన అవమానానికి నిరసన తెలిపినట్లు చెప్పాడు. ఇది షేక్ హసీనా ప్రభుత్వం కాదని, ప్రజల ఆమోదం పొందిన ప్రభుత్వం అని, ఈ సందేశాన్ని పంపాలనే భారత పర్యటనను రద్దు చేసుకున్నట్లు చెప్పుకొచ్చాడు.
తాజావార్తలు
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
-
Gautam Gambhir: టీమ్ ఇండియా వైఫల్యాలపై ఐదు ప్రశ్నలు.. కోచ్ సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చిందా..?
-
Volkswagen Tayron: వోక్స్వ్యాగన్ టేరాన్ లైఫ్ లాంచ్.. 9 ఎయిర్బ్యాగ్స్, లెవెల్-2 ADASతో ప్రీమియం SUV.. ధర, ఫీచర్లు ఇవే
-
Prabhas : ఫౌజీ బడ్జెట్ రూ. 500 -600 కోట్లు.. బెంచ్మార్క్ సెట్ చేయబోతుందా?
-
Nithiin : నాని బ్యానర్లో నితిన్ హీరోగా సినిమా ఫిక్స్
ట్రెండింగ్
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!