India Pakistan: భారత్ క్షిపణులతో దాడి చేసింది.. రాత్రి 2.30కి పాక్ ప్రధానికి ఆసిమ్ మునీర్ ఫోన్..
- ఎట్టకేలకు నిజాలు ఒప్పుకుంటున్న పాకిస్తాన్..
- భారత్ మాపై క్షిపణులతో దాడి చేసిందని చెప్పి పీఎం షహబాజ్ షరీఫ్..
- ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఈ విషయాన్ని ఫోన్ ద్వారా వెల్లడించారని ప్రకటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Pakistan: ఎట్టకేలకు పాకిస్తాన్ క్రమంగా నిజాలను ఒప్పుకుంటోంది. తమపై భారత్ దాడి చేయలేదని, దాడి జరిగినా, పాకిస్తాన్ ఆర్మీ తిప్పికొట్టింది అంటూ విజయోత్సవాలు చేసుకున్న ఆ దేశ నేతలు, ఇప్పుడు నిజాలను వెల్లడిస్తున్నారు. తాజాగా, తమపై భారత్ క్షిపణులతో దాడులు చేసిందని, పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ అన్నారు. మే 10 తెల్లవారుజామున భారత్ బాలిస్టిక్ క్షిపణులతో నూర్ ఖాన్ ఎయిర్బేస్తో పాటు ఇతర ఎయిర్ బేస్లపై దాడులు చేసిందిన ఆయన బహిరంగంగా ప్రకటించారు.
Read Also: Team India New Captain: టీమిండియా టెస్టు కెప్టెన్సీపై కొనసాగుతున్న ఉత్కంఠ.. గిల్- గంభీర్ కీలక భేటీ..
Also Read
- IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
- Shocking Incident: రూ. 60 లక్షల ప్యాకేజ్ అల్లుడు.. చిన్న గొడవకే చంపేసిన అత్తింటివారు..
- PM Modi: బీజేపీ కొత్త టీమ్తో మోడీ భేటీ.. జెన్-జీపై ప్రత్యేక ఫోకస్
- Abhijeet Dipke: స్కూల్లోకి ఎంట్రీ.. టీచర్లకు బెదిరింపు! అభిజీత్ దీప్కేపై కేసు
ఇస్లామాబాద్లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, భారత్ తమ వైమానిక స్థావరాలపై దాడి చేసిందని పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ తనకు తెల్లవారుజామున 2.30 గంటలకు కాల్ చేసి చెప్పినట్లు షరీఫ్ వెల్లడించారు. “మే 9-10 తేదీల మధ్య రాత్రి, తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో, జనరల్ ఆసిఫ్ మునీర్ నాకు ఫోన్ ద్వారా కాల్ చేసి, భారతదేశం తన బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిందని నాకు చెప్పారు. ఒకటి నూర్ ఖాన్ వైమానిక స్థావరంలో, మరికొన్ని ఇతర ప్రాంతాలపై దాడి జరిగినట్లు చెప్పారు’’ అని అన్నారు.
రావల్పిండిలోని అత్యంత కీలకమైన నూర్ ఖాన్ ఎయిర్ బేస్తో పాటు పాకిస్తాన్ని ప్రధాన ఎయిర్ బేస్లైన సర్గోదా, జకోబాబాద్, స్కర్దు, రఫికీ మొదలైన 11 ఎయిర్ బేస్లపై భారత్ క్షిపణులతో విరుచుకుపడింది. ఆపరేషన్ సిందూర్లో భాగంగా పాకిస్తాన్ డ్రోన్ దాడికి ప్రతీకారంగా ఈ దాడులు చేసింది. ఈ దాడుల్లో పాక్ వైమానిక స్థావరాలు ధ్వంసమైనట్లు భారత్ ఆర్మీ శాటిలైట్ ఫోటోలతో చూపించింది. దీనికి ముందు, పాక్, పీఓకేలోని 09 ఉగ్రవాద స్థావరాలను భారత్ ధ్వంసం చేసి, 100 మంది టెర్రరిస్టుల్ని హతమార్చింది. పాక్ వైమానిక దళం నిర్వీర్యం అయ్యేలా పాక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని భారత్ నాశనం చేసి సత్తా చాటింది.
తాజావార్తలు
-
KVN : ‘టాక్సిక్’ మీ పల్స్ రేట్ను కూడా మారుస్తుంది!
-
Yash: తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన బలం, సపోర్ట్కు నేను రెండింతలు తిరిగి ఇస్తాను
-
Hockey World Cup 2026: భారత్కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!