INDIA alliance: వర్షాకాల పార్లమెంట్ సమావేశాలకు ముందు ఇండియా కూటమి భేటీకి సిద్ధమైంది. రేపు ( జూన్ 08)న ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో జరగనుంది. గత రెండు సమావేశాలు కాంగ్రెస్ నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ నివాసాల్లో జరినప్పటికీ, రేపటి సమావేశానికి తటస్థ వేదికను ఎంచుకున్నారు. బెంగాల్లో మమతా బెనర్జీ నేతృత్వంలో టీఎంసీ, తమిళనాడులో స్టాలిన్ నేతృత్వంలో డీఎంకే ఓడిపోయిన తర్వాత ఈ భేటీ జరుగుతుండటంతో దీనికి ప్రాధాన్యత ఏర్పడింది.
టీఎంసీ సంక్షోభం నేపథ్యంలో మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీలు ఈ సమావేశానికి హాజరుకాబోతునున్నారు. మరోవైపు, తమిళనాడులో విజయ్ ప్రభుత్వంలో కాంగ్రెస్ చేరడంతో, కాంగ్రెస్-డీఎంకే మధ్య విభేదాలు స్పష్టంగా బయటపడ్డాయి. దీంతో ఈ సమావేశానికి తాము రావడం లేదని డీఎంకే ఇప్పటికే ప్రకటించింది. ఈ సమావేశానికి 23 పార్టీలు హాజరవుతాయని కాంగ్రెస్ తెలిపింది. కాంగ్రెస్ తీరుపై అసంతృప్తితో ఉన్నప్పటికీ సీపీఎం మాత్రం ఈ సమావేశానికి హాజరుకానుంది. పినరయి విజయన్, బీజేపీలు కుమ్మక్కు అయ్యాయంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ రెండు రోజుల క్రితం ఖర్గేకు లేఖ రాశారు.
ఈ సమావేశాని ఫరూఖ్ అబ్దుల్లా నేతృత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్ కూడా సమావేశానికి వస్తున్నట్లు చెప్పింది. సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్లు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ఇతర చిన్నాచితక పార్టీలు సమావేశానికి వస్తున్నట్లు చెప్పాయి. ఓటమి తర్వాత, కాంగ్రెస్ స్నేహాన్ని మమతా బెనర్జీ పార్టీ కోరుకుంటోంది. తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) చీలికగా మారడంతో ఆమె కాంగ్రెస్ సాయాన్ని కోరుతోంది. ఇక ఉద్ధవ్ ఠాక్రేకు చెందిన శివసేన యూబీటీ వర్చువల్గా సమావేశంలో పాల్గొంటామని చెప్పింది.

