Airlines Crisis: ఇలాగైతే విమానాలు నిలిచిపోతాయి.. కేంద్రానికి ఎయిల్లైన్స్ హెచ్చరిక..
- ఇలాగైతే విమానాలు నిలిచిపోతాయి..
- ఇంధన ధరల పెరుగుదలతో సంక్షోభంలో దేశ విమానయాన పరిశ్రమ..
- భారీగా నష్టాలు వస్తాయని విమాన సంస్థల ఆందోళన..
- కేంద్రానికి ఎయిర్ ఇండియా లేఖ..
Airlines Crisis: ఇరాన్ యుద్ధం, మిడిల్ ఈస్ట్ సంక్షోభం భారత విమానయాన రంగాన్ని సంక్షోభానికి గురిచేస్తోంది. పెరుగుతున్న ఇంధన ధరల మూలంగా ఎయిర్లైన్స్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యలో ఇంధన ధరల కారణంగా విమాన కార్యకలాపాలు నిలిచిపోయే పరిస్థితి వస్తుందని కేంద్ర ప్రభుత్వాన్ని విమాన సంస్థలు హెచ్చరిస్తున్నాయి.
టాటా గ్రూప్కు చెందిన ఎయిర్ ఇండియా సహా కనీసం మూడు ఎయిర్లైన్స్ ప్రభుత్వం వద్ద మొరపెట్టుకున్నాయి. విమాన ఇంధనం ‘‘ఏవియేషణ్ టర్బైన్ ఫ్యూయల్(ATF) ధరలను సవరించాలని కోరాయి. విమాన కార్యకలాపాల ఖర్చులో 40 శాతం ఖర్చు ఇంధనానిదే ఉంటుంది. ఇప్పుడు నిర్వహణ ఖర్చులలో ఇది 55–60% వరకు పెరిగిందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఇంధన ధరలు ప్రస్తుతం ప్రతీ కిలోలీటర్ కు రూ. 2 లక్షలకు పైగా చేరాయి.
Also Read
- Ajay Pal Sharma: బెంగాల్ ఎన్నికల్లో హాట్ టాపిక్గా ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ‘‘అజయ్ పాల్ శర్మ’’
- Pakistan train speed: రైళ్ల వేగంలో భారత్ దూసుకెళ్తుంటే… పాకిస్తాన్ పరిస్థితి ఏంటి.?
- Gujarat Election Results: గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. అన్ని కార్పొరేషన్లు కైవసం
- UIDAI Important Update: యూఐడీఏఐ కీలక నిర్ణయం.. ఇక వీటికి ఆధార్ చెల్లదు..
ఈమేరకు విమాన సంస్థలు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు లేఖ రాశాయి. ఇంధన ధరలు పెరిగితే ఎయిర్లైన్స్ భారీగా నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందని, ఫ్లైట్లను రద్దు చేయాల్సి వస్తుందని హెచ్చరించాయి. ఎయిర్ ఇండియాతో పాటు ఇండిగో, స్పైస్ జెట్ కేంద్రానికి లేఖ రాశాయి. ముఖ్యంగా అంతర్జాతీయ రూట్లపై ప్రభావం ఎక్కువగా ఉందని, ఇలాగే కొనసాగితే రూట్లలో ఫ్లైట్లను నిలిపేయడం లేదా తగ్గించడం చేయాల్సి వస్తుందని ఎయిర్లైన్స్ చెబుతున్నాయి.
దేశీయ, అంతర్జాతీయ ఏటీఎఫ్ ధరలు సమానంగా ఉండాలని, తాత్కాలికంగా 11 శాతం ఎక్సైజ్ డ్యూటీని వాయిదా వేయాలని, కొన్ని ప్రాంతాల్లో 25 శాతం వరకు ఉండే రాష్ట్ర స్థాయి వ్యాట్ను తగ్గించాలని, ఇంధన ధరల పెరుగుదలపై నియంత్రణ ఉండాలని కొన్ని కీలక డిమాండ్లు చేశాయి. ఇరాన్ యుద్ధం వల్లే ఈ ఇంధన ధరల పెరుగుదల నమోదవుతోంది. ఇరాన్ ‘‘హార్ముజ్ జలసంధి’’ని అడ్డుకోవడంతో గల్ఫ్ ప్రాంతాల నుంచి వచ్చే చమురుపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ మార్గం గుండానే ప్రపంచంలో చమురు, గ్యాస్ రవాణా 20 శాతం జరుగుతోంది.
తాజావార్తలు
-
Airlines Crisis: ఇలాగైతే విమానాలు నిలిచిపోతాయి.. కేంద్రానికి ఎయిల్లైన్స్ హెచ్చరిక..
-
Bellamkonda Srinivas: రేపు పెళ్లి.. ఆ రోజు గ్రాండ్ రిసెప్షన్
-
Telangana Government: లొంగిపోయిన మావోయిస్టులకు సర్కార్ బంపర్ ఆఫర్.. ‘గిరిదర్శక్’గా ఉద్యోగాలు!
-
Ajay Pal Sharma: బెంగాల్ ఎన్నికల్లో హాట్ టాపిక్గా ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ‘‘అజయ్ పాల్ శర్మ’’
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
ట్రెండింగ్
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!