IT Raids: కరోనా తెచ్చిన తంట.. ‘డోలో’ తయారీ సంస్థపై ఐటీ దాడులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోన్న సమయంలో అనూహ్యంగా డోలో 650 టాబెట్ల అమ్మకాలు పెరిగిపోయాయి.. ప్రపంచ వ్యాప్తంగా డోలో పేరు మార్మోగిపోయింది.. డోలో 650 వేసుకుంటే చాలు.. కరోనా నుంచి తప్పించుకోవచ్చన ప్రచారంలో ప్రజలు పెద్ద ఎత్తున ఆ మాత్రలను కొనుగోలు చేశారు.. భారత్లోనే కాదు.. విదేశాల్లోనూ డోలోకు డిమాండ్ పెరిగింది.. మైక్రో ల్యాబ్స్ నుంచి పెద్ద ఎత్తున విదేశాలకు సైతం తరలివెళ్లాయి డోలో 650 టాబెట్లు.. అయితే, డోలోను తయారు చేసిన మైక్రో ల్యాబ్స్ పై ఇప్పుడు ఐటీ దాడులు చర్చగా మారాయి.. ఆదాయపన్ను ఎగగెట్టారని ఆరోపణలపై బెంగళూరులోని మైక్రో ల్యాబ్స్ కార్యాలయంతో పాటు దేశంలోని ఆ కంపెనీకి చెందిన 40 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు ఐటీ అధికారులు..
Read Also: ICC Test Rankings: ఐసీసీ టాప్-10 నుంచి కోహ్లీ అవుట్.. ఆరేళ్ల తర్వాత తొలిసారి
Also Read
- Brahmaputra: వాటర్ బాంబ్ కంటే డేంజర్.. పెను ముప్పు రానుందా?
- Gargi story Explained: నరమేధపు నేలపై పూసిన గులాబీ! 200 ఏళ్ల తర్వాత ఆ గ్రామంలో పుట్టిన తొలి ఆడపిల్ల!
- UNEP: భారత్కు బిగ్ అలర్ట్! విపత్తులు ముంచుకొస్తున్నాయా?
- IndiGo Plane Hits Pole: ఎయిర్పోర్టులో ఇండిగో విమానానికి ప్రమాదం.. పోల్ను ఢీకొన్న ఫ్లైట్!
కరోనా పుణ్యమా అంటూ మైక్రో ల్యాబ్స్కు డోలో మంచి ఆదాయాన్ని తెచ్చిపెట్టింది.. ఒకప్పుడు ఉండటానికి బెంగళూరులో సొంత ఇల్లు కూడా లేని మైక్రో ల్యాబ్స్ అదినేతలు దిలీప్ సురానా, ఆనంద్ సురానా.. ఇప్పుడు దేశంలోని 100 మంది శ్రీమంతుల జాబితాలో చేరారంటే.. దాని వెనుక డోలో మాత్ర ఉందని చెప్పాలి.. కరోనా కల్లోలం సృష్టిస్తోన్న సమయంలో ఏకంగా 350 కోట్ల డోలో 650 మాత్రలు విక్రయాలు జరిగినట్టు వెలుగులోకి వచ్చింది.. దీంతో.. ఒకే ఏడాదిలో దాదాపు రూ.450 కోట్లకు పైగా వ్యాపారం జరిగిందట.. దీనిపై అప్పట్లో పెద్ద చర్చే సాగింది.. అయితే, ఇప్పుడు మైక్రో ల్యాబ్స్ లిమిటెడ్పై ఐటీ శాఖ దాడులు జరిపింది. ఢిల్లీ, సిక్కిం, పంజాబ్, తమిళనాడు, గోవాతో పాటు దేశవ్యాప్తంగా 40 చోట్ల ఏకకాలంలో సోదాలు జరిపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఒకేసారి జరిగిన ఈ దాడుల్లో 200 మందికి పైగా అధికారులు పాల్గొన్నారు. బెంగళూరులోని రేస్ కోర్స్ రోడ్డులోని కంపెనీ కార్యాలయంలో జరిగిన సోదాల్లో కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. కరోనా సమయంలో భారీగా వెనుకేసుకున్న ఆ సంస్థ.. పన్ను ఎగవేతకు సంబంధించిన ఆరోపణలు ఎదుర్కొంటోంది.. దీంతో, ఈ దాడులు నిర్వహించినట్టుగా సమాచారం..
తాజావార్తలు
-
SBI ATM Rules 2026: SBI ఖాతాదారులకు భారీ షాక్.. ATM రూల్స్ మారుతున్నాయ్! కొత్త రూల్స్ తెలుసుకోండి
-
Brahmaputra: వాటర్ బాంబ్ కంటే డేంజర్.. పెను ముప్పు రానుందా?
-
Baljit Singh: ఇంట్లో కుళ్లిన స్థితిలో పంజాబీ గాయకుడి మృతదేహం.. రక్తపు మరకలు, చివరికి షాకింగ్ ట్విస్ట్!
-
Konda Surekha: ఇక నిరీక్షణ ముగిసింది.. అతి త్వరలోనే బిగ్ అప్డేట్.. వేచి చూడండి!
-
Kaaka : వచ్చే సంక్రాంతికి మెగాస్టార్ ‘కాకా’ లేనట్టేనా..?
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!