Exports Of Hair: కురులతో కోట్ల ఆదాయం.. ఐదేళ్లల్లో 370 మిలియన్ డాలర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Exports Of Hair: గ్రామాల్లో చిక్కువెంట్రుకలను మహిళలు భద్రంగా దాచిపెడతారు.. ఎందుకంటే వాటిని సవరాల వారికి ఇస్తే.. వారు సవరాలను ఇస్తారు. ఒకవేళ ఎవరైనా తమకు సవరాలు వద్దు అనుకుంటే వారికి డబ్బులను ఇస్తారు. ఇప్పటికీ చాలా గ్రామాల్లో ఇలా చేస్తున్నారు. కొన్ని పట్టణాల్లో కూడా ఇలా సవరాలు అమ్మే వారు అడుగుతున్నారు. ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే.. మనుషుల వెంట్రుకలు కూడా ఆదాయ వనరే అని చెప్పడానికి. ఇండియాలోని మనుషుల కురులను ఇతర దేశాలకు ఎగుమతి చేసి కోట్ల ఆదాయం సంపాదిస్తోందట.. గత ఐదేళ్లల్లో 370 మిలియన్ డాలర్లు ఆదాయం పొందిన పార్లమెంటులో ప్రకటించారు.
Read also: Sathyaraj: బ్రేకింగ్.. బాహుబలి కట్టప్ప ఇంట తీవ్ర విషాదం
Also Read
గడచిన 5 సంవత్సరాల్లో భారతదేశ జట్టు ఉత్పత్తుల ఎగుమతులు నాలుగు రెట్లు పెరిగాయని.. ఈ కాలంలో భారతదేశం నుంచి 370.11 మిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన మానవ జుట్టు ఎగుమతి చేసినట్లు కేంద్రం వెల్లడించింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా రాజ్యసభలో శుక్రవారం వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ ఈ సమాధానమిచ్చారు. 2018-19లో 34.46 మిలియన్ డాలర్లు, 2019-20లో 5.70 మిలియన్ డాలర్లు, 2020-21లో 11.65 మిలియన్ డాలర్లు, 2021-22లో 149.07 డాలర్లు, 2022-23లో 169.23 మిలియన్ డాలర్లు విలువచేసే జుట్టు ఎగుమతి చేసినట్లు మంత్రి సభకు తెలిపారు. గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో జట్టు ఎగుమతులు నాలుగు రెట్లు పెరిగాయని తెలిపారు. హ్యూమన్ హెయిర్ అండ్ హెయిర్ ప్రొడక్ట్స్ అసోసియేషన్, ప్లెక్స్కాన్సిల్ అందించిన సమాచారం ప్రకారం.. ప్రపంచంలోనే హ్యూమన్ హెయిర్ ప్రొడక్ట్స్ కు(ముడి పదార్థం) భారత్ కేంద్రంగా మారిందని చెప్పారు. భారత్ నుంచి లభించే జుట్టు ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైనదనీ, ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిందని కేంద్ర మంత్రి తెలిపారు. జుట్టు ఎగుమతులలో ఈ ఆధిపత్యాన్ని ప్రభుత్వం ఎలా ఉపయోగించుకుంటుందనే దానిపై, ప్రపంచవ్యాప్తంగా వివిధ వాణిజ్య ప్రదర్శనలకు హాజరు కావడానికి పరిశ్రమతో కలిసి ప్లెక్స్కాన్సిల్ చురుకుగా పనిచేస్తోందని కేంద్రమంత్రి చెప్పారు. అలాగే విగ్ల వంటి అధిక విలువైన వస్తువులను ఉత్పత్తి చేయడం ప్రారంభించడానికి భారతీయ ఎగుమతిదారులకు శిక్షణను అందించడానికి ప్లెక్స్కాన్సిల్ తో ప్రభుత్వం కలిసి పనిచేస్తోందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!