Maharastra: అధికార శివసేనకు బీజేపీ షాక్.. మూడు రాజ్యసభ స్థానాలు కైవసం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలో అధికార పక్షానికి భారీ ఎదురుదెబ్బ తీగిలింది. రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. హర్యానా, మహరాష్ట్ర, కర్ణాటక, రాజస్తాన్ రాష్ట్రాల్లో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మొత్తం 16 స్థానాలకు ఎన్నికలు జరగగా.. 8 స్థానాలను బీజేపీ దక్కించుకుంది. దీంతో రాష్ట్రపతి ఎన్నికల ముందు బీజేపీ పెద్దల సభలో తన బలాన్ని మరింతగా పెంచుకుంది.
ఇదిలా ఉంటే మహారాష్ట్రలోని రాజ్యసభ సభ్యుల ఎన్నిక అందర్ని ఆకర్షించింది. మహారాష్ట్రలో మొత్తం 6 స్థానాలకు ఎన్నికలు జరిగితే 3 స్థానాలను బీజేపీ గెలుచుకుంటే.. ఒక్కో స్థానాన్ని శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు గెలుచుకున్నాయి. కాగా ఇక్కడ బీజేపీ మూడో సీటు గెలుచుకోవడానికి తగినంత బలం లేకున్నా.. అనూహ్యంగా మూడో సీటును కూడా గెలుచుకుని అధికార మహావికాస్ అఘాడీ కూటిమికి షాక్ ఇచ్చింది. బీజేపీతో విభేదించి కాంగ్రెస్, ఎన్సీపీతో జట్టు కట్టిన శివసేనకు బీజేపీ తన సత్తా చూపింది. అధికారంలో ఉన్నా కూడా శివసేన తన అభ్యర్థిని గెలిపించుకోలేక చతికిల పడింది.
Also Read
- Kolkata Airport Mosque: ముగ్గురు సీఎంలు టచ్ చేయలేకపోయారు.. సువేందు రాకతో ఎయిర్పోర్టు మసీదు తరలింపు.!
- iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
- Raghav Chadha: రాఘవ్ చద్దాకు కీలక పదవి.. ప్రత్యేక బాధ్యతలు అప్పగించిన రాజ్యసభ ఛైర్మన్
- Sonam Wangchuk: "నేపాల్లో జరిగినట్లే భారత్లో కూడా".. ‘కాక్రోచ్’ ఉద్యమంపై సోనం వాంగ్చుక్ హెచ్చరిక
మహారాష్ట్రలోె బీజేపీ తరుపున కేంద్ర మంత్రి పియూష్ గోయల్, అనిల్ బోండే, ధనంజయ్ మహాదిక్ పోటీ చేశారు. అయితే ధనంజయ్ మహాదిక్ గెలుపు పైనే అంతా ఫోకస్ పెట్టారు. బీజేపీ నుంచి ధనుంజయ్ మహాదిక్, శివసేన అభ్యర్థి సంజయ్ పవార్ పై విజయం సాధించారు. మొత్తం 284 ఓట్లలో పియూష్ గోయల్, అనిల్ బోండే కు 48 ఓట్లు రాగా.. మరో అభ్యర్థి విజయానికి 41 ఓట్లు అవసరం అయ్యాయి. అయితే ధనుంజయ్ మహాదిక్ 41.56 ఓట్లు వచ్చాయి. దీంతో ఆయన గెలుపొందారు. బీజేపీకి అనూహ్యంగా 10 ఓట్లు వచ్చాయి.
చాలా వరకు ఇండిపెండెంట్లు, కొన్ని పార్టీల ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ వేయడంతో పాటు జైల్లో ఉన్న నవాబ్ మాలిక్ ఓటేయడానికి కోర్టు అనుమతించకపోవడం శివసేన ఫలితాలను దెబ్బతీసినట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ నుండి ఇమ్రాన్ ప్రతాప్గర్హి, ఎన్సిపి నుండి ప్రఫుల్ పటేల్ మరియు సేన నుండి సంజయ్ రౌత్ ఎన్నికల్లో గెలుపొందారు. ఇక్కడ విశేషం ఏమిటంటే అధికార శివసేన అభ్యర్థి సంజయ్ రౌత్ కన్నా మహాదిక్ ఎక్కువ ఓట్లు పొందారు. సంజయ్ రౌత్ కు 41 ఓట్లు వస్తే, మహాదిక్ కు 41.5 ఓట్లు వచ్చాయి.
తాజావార్తలు
-
Rahman : ‘పెద్ది’ ఆ కోరిక తీర్చింది!
-
Ram Charan: నా కెరీర్లోనే ‘పెద్ది’ నంబర్ వన్ చిత్రం
-
AP Film Corporation: ఏపీ ఫిల్మ్ కార్పొరేషన్ నూతన బోర్డు ఏర్పాటు
-
OTR : పాలమూరు కాంగ్రెస్లో రచ్చ రచ్చ.. సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం కుమ్ములాట!
-
Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?