Amit Shah: కాంగ్రెస్ ప్రభుత్వం ఛత్తీస్గఢ్లో మతమార్పిడులకు పాల్పడుతోంది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah: 5 రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా శుక్రవారం రోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బీజేపీ తరుపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పండరియా అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ర్యాలీలో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో పేద గిరిజనులను కాంగ్రెస్ ప్రభుత్వం మతమార్పిడి చేస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అవినీతికి పాల్పడుతోందని, రాష్ట్రంలో అధికారంలోకి వస్తే కాంగ్రెస్ స్కాములను వెలికితీసి, అవినీతికి పాల్పడిన వ్యక్తుల్ని జైలుకు పంపుతామని అమిత్ షా అన్నారు.
ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ని ‘ప్రీపెయిడ్ సీఎం’గా అభివర్ణించిన అమిత్ షా.. రాష్ట్ర ఖజానాను కాంగ్రెస్ పార్టీకి ఏటీఎంగా మార్చారని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో మతమార్పిడి పెరుగుతోందని, రాజ్యాంగంలో ప్రతీ పౌరుడు కూడా తన ఇష్టానుసారం మతాన్ని అనుసరించే స్వేచ్ఛ ఇచ్చింది.. కానీ కాంగ్రెస్ పేద గిరిజనులను మతమార్పిడి చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగిస్తున్నారంటూ ఆరోపించారు. దీని ఫలితంగా రాష్ట్రంలోని ప్రతీ ఇంటిలో, గ్రామంలో ఘర్షణలు చెలరేగాయని, శాంతిభద్రతలు క్షీణించాయని అన్నారు.
Also Read
- NEET Exam: అబుదాబి సెంటర్ ఇవ్వడంపై రాహుల్గాంధీ ఫైర్.. ఎన్టీఏ క్లారిటీ
- NEET Exam: రేపే నీట్ ఎగ్జామ్.. ఈసారైనా పగడ్బందీగా జరిగేనా?
- Ex-Terrorist: ఉగ్రవాదుల జేబుల్లో కండోమ్, ప్రేమ లేఖలు..ధురంధర్లో చూపింది నిజమే: మాజీ ఉగ్రవాది..
- Cockroach Janta Party: జంతర్ మంతర్ వద్ద హైటెన్షన్.. అరెస్ట్కు సిద్ధమన్న అభిజిత్ దీప్కే.
Read Also: BJP MP Laxman: కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి..
బీజేపీ ప్రభుత్వం ఎవరి మతపరమైన అంశాల్లో జోక్యం చేసుకోదని, అయితే ఏ ప్రభుత్వమైన మతమార్పిడులు చేస్తే దాన్ని నిరోధించేందుకు కఠిన చర్యలు తీసుకుంటుందని ఆయన అన్నారు. సీఎం భూపేష్ బఘేల్ రాష్ట్రం డబ్బును ఢిల్లీకి తీసుకెళ్తున్నారని, రాష్ట్రాన్ని ఏటీఎంగా వాడుకుంటున్నారని కాంగ్రెస్ని నిందించారు. బఘేర్ బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు.
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా ఈ నెలలో రెండు విడుతలుగా ఛత్తీస్గఢ్ అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గద్దె దించి, అధికారంలోకి రావాలని బీజేపీ పోరాడుతోంది. ఛత్తీస్గఢ్ తో పాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ నెలలో ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడుతాయి.
తాజావార్తలు
-
kitchen tips: చపాతీ కర్రకు బూజు పడుతోందా? ఈ చిన్న ట్రిక్తో ఫంగస్కు చెక్ పెట్టండి!
-
Eating Rice: అన్నం తిన్నాక వెంటనే నిద్ర వస్తుందా? అసలు కారణం ఇదే!
-
Deputy CM Pawan Kalyan: నేను హోం మినిస్టర్ కాదు.. అది క్రిమినల్స్ అదృష్టం.. లా అండ్ ఆర్డర్పై పవన్ ఘాటు వ్యాఖ్యలు..
-
NEET Exam: అబుదాబి సెంటర్ ఇవ్వడంపై రాహుల్గాంధీ ఫైర్.. ఎన్టీఏ క్లారిటీ
-
Washing Machine: మీ వాషింగ్ మెషీన్ బ్యాడ్ స్మెల్ వస్తోందా? కేవలం ఇంట్లోనే ఇలా ఈజీగా క్లీన్ చేసుకోండి!
ట్రెండింగ్
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!
-
Health Tips : షుగర్ కంట్రోల్కు నేరేడు గింజల చిట్కా..! ఇలా సింపుల్గా చేసుకోండి..!
-
Vaibhav Sooryavanshi: ఫైనల్లో వైభవ్ను టార్గెట్ చేస్తారా?.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర సమాధానం!