Mumbai: ఐఐటీ బాంబేలో విద్యార్థి ఆత్మహత్య.. కలవరపెడుతున్న వరుస ఘటనలు
- ఐఐటీ బాంబేలో విద్యార్థి ఆత్మహత్య
- హాస్టల్ భవనం పైనుంచి దూకి సూసైడ్
- కలవరపెడుతున్న వరుస ఘటనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా వరుస విద్యార్థుల ఆత్మహత్యలు కలవరం పెడుతున్నాయి. ప్రొఫెసర్ వేధింపులు కారణంగా ఒడిశాలో ఒక విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అనంతరం ఆయా రాష్ట్రాల్లో అధ్యాపకుల వేధింపులు కారణంగా వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఇలాంటి సంఘటలు రోజురోజుకు పెరిగిపోవడంతో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
ఇది కూడా చదవండి: BJP New President: బీజేపీ నూతన అధ్యక్ష ఎన్నికపై ఉత్కంఠ.. ఎంపిక ఎప్పుడంటే..!
Also Read
- Meenakshi Natarajan: ఇది బీజేపీ రాజనీతి.. నామినేషన్ రద్దుపై మీనాక్షి నటరాజన్ ఆగ్రహం
- DK Shiva Kumar: సగం తిన్న ఆపిల్ విసరడం అహంకారమే.. డీకేపై బీజేపీ ఫైర్..
- Meenakshi Natarajan Nomination Rejected: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్కు బిగ్ షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
- Driving License: ఇక లైసెన్స్ టెన్షన్ తీరినట్లే.. ఏకంగా 50 ఏళ్లపాటు చెల్లుబాటు అయ్యేలా సరికొత్త ప్లాన్!
తాజాగా ఐఐటీ-బాంబేలో 22 ఏళ్ల విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యార్థి… ఢిల్లీకి చెందిన రోహిత్ సిన్హాగా గుర్తించారు. ఐఐటీ-బాంబేలో సైన్స్ విభాగంలో చదువుతున్నాడు. పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని మీపంలోని ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. శనివారం తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
ఇది కూడా చదవండి: Gold Rates: గోల్డ్ లవర్స్ షాక్.. భారీగా పెరిగిన బంగారం ధర
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) బాంబేకు చెందిన పోవై క్యాంపస్లోని హాస్టల్ భవనంపై నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నట్లు ముంబై పోలీసులు తెలిపారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. హాస్టల్ టెర్రస్పై ఉన్న తోటి విద్యార్థి ఈ సంఘటనను ప్రత్యక్షంగా చూశాడని తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Golden Shawl: ఆపరేషన్ సింధూర్ విజయానికి అంకితం చేసిన సిరిసిల్ల చేనేత బంగారు శాలువా..
విద్యాపరమైన ఒత్తిడి కారణంగానే ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు అంచనా వేస్తు్నారు. పోవై పోలీస్ స్టేషన్లో యాక్సిడెంటల్ డెత్ రిపోర్ట్ (ADR) కింద కేసు నమోదు చేశారు. ఆత్మహత్య వెనుక గల కారణాన్ని తెలుసుకోవడానికి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఈ మధ్య ప్రముఖ విద్యా సంస్థల్లో వరుస విద్యార్థుల ఆత్మహత్యలపై ఆందోళనలు కలిగిస్తోంది. ఈ నెల ప్రారంభంలో ఐఐటీ ఖరగ్పూర్లోని తన హాస్టల్ గదిలో నాల్గవ సంవత్సరం చదువువుతున్న బీటెక్ విద్యార్థి శవమై కనిపించాడు. ఇలా ఎక్కడో చోట విద్యార్థులు ప్రాణాలు తీసుకుంటున్నారు. కన్నవారికి కడుపు కోత మిగులుస్తున్నారు.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!