Farming: ఎకరం పొలంలో నెలకు రూ.2 లక్షలు సంపాదన.. ఆ పంటతో సిరుల పంట!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Farming: తన ఎకరం పొలంలో నెలకు రూ.2 లక్షల వరకు సంపాదిస్తున్నాడు ఓ రైతు. బీహార్లోని సమస్తిపూర్ జిల్లా వ్యవసాయానికి దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. అక్కడ మామిడి, లిచ్చి, అరటితో పాటు కూరగాయలను రైతులు పెద్దఎత్తున సాగు చేస్తారు. అంతేకాకుండా రైతులు పండించిన పంటలను రాజధాని పాట్నాకు సరఫరా చేస్తారు. అయితే కూరగాయల సాగుతో కొందరు రైతులు లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నారు. దీంతో వారి ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగ్గా మారింది.
Read Also: Vyooham: వర్మ ‘వ్యూహం’లో చిరు, పవన్.. ‘అల్లు’ వారిని కూడా వదలలేదుగా!
Also Read
- Maharashtra: ఘోర విషాదం.. జీపు బోల్తా.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
- Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
- Supreme Court: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్.. అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
- Supreme Court: కల్నల్ సోఫియా ఖురేషీపై అనుచిత వ్యాఖ్యలు.. మంత్రి క్షమాపణను తిరస్కరించిన సుప్రీంకోర్టు
కూరగాయల సాగు చేస్తూ ప్రజల ముందు ఆదర్శంగా నిలిచాడు ఓ రైతు. సమస్తిపూర్లోని మధురాపూర్ తారా గ్రామానికి చెందిన రైతు దీనదయాళ్ రాయ్.. కూరగాయల సాగుతో నెలకు రూ.2 లక్షలు సంపాదిస్తున్నాడు. అయితే ఏ పంటను సాగుచేస్తున్నాడంటే.. ఒకటిన్నర ఎకరాల్లో గుమ్మడి వేశాడు. దీనితో సంప్రదాయ పంటలతో పోలిస్తే కొంత ఎక్కువనే లాభం పొందుతున్నట్లు తెలిపాడు. ఇతని పొలాల్లో పండే కూరగాయలకు గిరాకీ ఉండడంతో ఇతర జిల్లాల నుంచి కూడా గుమ్మడికాయలను కొనుగోలు చేసేందుకు వ్యాపారులు వస్తుంటారు.
Read Also: Price Hike: టమోటాలతో పాటు వాటి ధరలు కూడా పెరిగాయి.. ఎంత పెరిగాయో తెలుసా..!
అయితే సేంద్రియ పద్ధతిలో గుమ్మడికాయ సాగు చేస్తున్నట్లు రైతు దీనదయాళ్ రాయ్ తెలిపాడు. తమ పొలాల్లో ఎప్పుడూ రసాయనిక ఎరువులు వాడనన్నాడు. దీంతో వారి కూరగాయలకు డిమాండ్ పెరుగుతోంది. ఇప్పుడు జార్ఖండ్ మరియు పశ్చిమ బెంగాల్ నుండి వ్యాపారులు కూడా గుమ్మడికాయ కొనుగోలు కోసం మధురాపూర్ తారా గ్రామాన్ని వచ్చి తీసుకెళ్తున్నారు. సేంద్రియ పద్ధతిలో తయారుచేసిన తాజా కూరగాయలను వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు.
Read Also: PM Modi: రేపు 5 వందేభారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించనున్న ప్రధాని
పంట సాగు కోసం రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడడం లేదని రైతు అంటున్నాడు. అతనికి చాలా ఆవులు ఉన్నాయని.. వాటి పేడను పొలంలో ఎరువుగా వేస్తున్నట్లు తెలిపాడు. దానివల్లే మంచి దిగుబడి పొందుతున్నట్లు దీనదయాళ్ తెలిపాడు. సుమారు ఒకటిన్నర ఎకరాల్లో గుమ్మడికాయ సాగుచేశామని.. వారానికి 1500 నుంచి 1600 గుమ్మడికాయలు సాగు వస్తేుందని తెలిపాడు. ఒక్కో గుమ్మడికాయను రూ.30-40కి విక్రయిస్తున్నారు. ఈ విధంగా నెలలో దాదాపు 6400 గుమ్మడికాయలను విక్రయించి రూ.2 లక్షలకు పైగా సంపాదిస్తున్నాడు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: ఈ 1000 రోజుల్లో కేసీఆర్ ఒక్కసారైనా జనం కోసం బయటకు వచ్చారా..?: సీఎం రేవంత్రెడ్డి
-
Maharashtra: ఘోర విషాదం.. జీపు బోల్తా.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
-
Tilak Varma Century: ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలక్ వర్మ.. సెంచరీతో చారిత్రాత్మక రికార్డు..
-
Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
-
Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!