Rajeev Chandrasekhar: “భారత్తో యుద్ధానికి దిగితే మీ పిల్లల్ని వేరే వాళ్లు పెంచుతారు”.. కేంద్రమంత్రి మాస్ వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajeev Chandrasekhar: జమ్మూకాశ్మీర్లో అనంత్నాగ్ ఎన్కౌంటర్ ఐదు రోజులుగా కొనసాగుతోంది. ఇప్పటికే ఈ ఎన్కౌంటర్ లో నలుగురు ఆర్మీ అధికారులు వీర మరణం పొందారు. దట్టమైన అటవీ ప్రాంతం, కొండల్లో దాగున్న ఉగ్రవాదులను మట్టుపెట్టేందుకు భద్రతాబలగాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ను ఉద్దేశించి కేంద్రమంత్రి రాజీవ్ చంద్ర శేఖర్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. భారత్ తో యుద్ధం చేయాల్సి వస్తే మీ పిల్లల్ని వేరేవాళ్లు పెంచుతారని ఎక్స్(ట్విట్టర్) పోస్ట్ చేశారు.
కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ భారతదేశ శతృవులను ఉద్దేశించి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎవరైనా భారత్ పై యుద్ధానికి వస్తే వారి పిల్లల్ని వేరే వాళ్లు పెంచుతారంటూ హెచ్చరించారు. ‘భారత్ చాలా యుద్ధాలు చూసిందని, భారత్ ఎప్పుడూ యుద్ధం కోరుకోదని, కానీ భారత్ తో యుద్ధం చేయాల్సి వస్తే మాత్రం మీ పిల్లల్ని మరొకరు పెంచుతారు’ అంటూ ట్వీట్ చేశారు. ఇది న్యూ ఇండియా అని వెనక్కి తగ్గి, బెదిరిపోదని కేంద్రమంత్రి అన్నారు.
Also Read
- Mamata Banerjee: మమతా దీదీకి మరో షాక్.. ముస్లిం ఎమ్మెల్యేల తిరుగుబాటు..
- Mohan Bhagwat: ప్రపంచం మన మాట వినాలంటే శక్తి కూడా అవసరం.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- DMK: లోక్సభలో కాంగ్రెస్తో కలిసి కూర్చోం.. డీఎంకే నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్..!
- IndiGo Flights Suspended: విదేశీ ప్రయాణికులకు అలర్ట్.. కీలక రూట్లలో ఇండిగో సర్వీసులు రద్దు
Read Also: Kamal Haasan: నన్ను రజినీకాంత్ ని మించిన ఫ్రెండ్స్ ఈ జనరేషన్ లోనే లేరు…
భారతదేశానికి శతృవులు ఉన్నారు. ఈ శతృవులు భారత దేశాన్ని ఎదగనివ్వద్దని కోరుకుంటలారు. అయితే వారు భారత మిలిటీర ఇప్పుడు చాలా స్ట్రాంగ్గా, హైటెక్ గా ఉందని, ప్రాణాలు తీసే యంత్రమని, దానితో తప్పు చేయవద్దని, దాన్ని తప్పించుకోవడమే తెలివైందని ఆయన అన్నారు. సైన్యం అత్యాధునిక సాంకేతిక టెక్నాలజీని వాడటాన్ని ఆయన ట్వీట్ చేశారు.
మరోవైపు అనంత్నాగ్ ఎన్కౌంటర్ లో ఉగ్రవేట కొనసాగుతోంది. ఉగ్రవాదులను ఎలాగైనా హతం చేయాలని భద్రతా బలగాలు కసితో వేట సాగిస్తున్నాయి. అయితే దట్టమైన అడవులు, కొండలు గుహలు ఉగ్రవాదులకు ఆసరాగా మారుతున్నాయి. మంగళవారం ప్రారంభమైన అనంతనాగ్ ఆపరేషన్లో 19 రాష్ట్రీయ రైఫిల్స్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ మన్ప్రీత్ సింగ్, మేజర్ ఆశిష్ ధోంచక్, జమ్మూ కాశ్మీర్ పోలీస్ డిప్యూటీ సూపరింటెండెంట్ హుమాయూన్ భట్, రైఫిల్మెన్ రవికుమార్ రాణా సహా నలుగురు భద్రతా సిబ్బంది వీరమరణం పొందారు. ఇదిలా ఉంటే శనివారం బారాముల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో భద్రతా బలగాలు ముగ్గురు ఉగ్రవాదుల్ని మట్టుపెట్టారు.
India has enemies – These enemies want to stop Indias rise. But they should know this.
Indian Military is now a modernized high tech and lethal machine – make no mistake about it. You will be wise to avoid it.
This is NewIndia – India will not be intimidated , India will not… https://t.co/dapF7JV3qC
— Rajeev Chandrasekhar 🇮🇳 (@RajeevRC_X) September 17, 2023
తాజావార్తలు
-
AP TET 2026: ఏపీ టెట్ షెడ్యూల్ వచ్చేసింది.. జూన్ 5న నోటిఫికేషన్.. పరీక్షలు ఎప్పుడంటే..
-
Devji : లాసెట్లో మెరిసిన మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్జీ..
-
Mamata Banerjee: మమతా దీదీకి మరో షాక్.. ముస్లిం ఎమ్మెల్యేల తిరుగుబాటు..
-
Hyderabad: దంపతుల మధ్య గొడవ.. తెల్లవారుజామున భార్యను భర్త ఏం చేశాడంటే..!
-
Malayalam: మలయాళం అంటే చిన్నచూపా?
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!