Bangladesh: బంగ్లాదేశ్ ఏదైనా సాహసం చేస్తే, “చిట్టగాంగ్” భారత్ వశమవుతుంది..
- ఈశాన్యాన్ని తాకితే బంగ్లాదేశ్ ముక్కలవుతుంది..
- చిట్టగాంగ్ని భారత్ స్వాధీనం చేసుకుంటుంది..
- తిప్రా మోత చీఫ్ ప్రద్యోత్ కిషోర్ దేబ్బర్మాన్ హెచ్చరిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్ ఇటీవల చైనా పర్యటనలో చేసిన వ్యాఖ్యలు భారత్ ఆగ్రహానికి కారణమయ్యాయి. భారత్లోని ఈశాన్య రాష్ట్రాలకు సముద్ర మార్గం లేదని, బంగ్లాదేశ్ బంగాళాఖాతానికి సంరక్షకుడని, మా ద్వారా ఈశాన్య రాష్ట్రాల్లోకి విస్తరించవచ్చని ఆయన వ్యాఖ్యలు చేశారు. అయితే, ఈ వ్యాఖ్యలపై భారత్ తీవ్ర అభ్యంతరం తెలిపింది.
Read Also: Chirutha Back Story: సాయి రామ్ శంకర్ మిస్సైన ‘చిరుత’ చరణ్ చేతికి.. అసలు కథ ఇదా!
Also Read
- Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్పై ఓవైసీ ఆగ్రహం..
- Success Story: వయసు 23 ఏళ్లు.. ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆమె విజయ రహస్యం ఇదే..
- PM Modi: అది ‘‘హిందూ గ్రోత్ రేట్’’ కాదు, ‘‘కాంగ్రెస్ గ్రోత్ రేట్’’
- Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
ఇదిలా ఉంటే, త్రిపుర రాజవంశీకుడు, తిప్రా మోత పార్టీ చీఫ్ ప్రద్యోత్ కిషోర్ దేబ్బర్మాన్ బంగ్లాదేశ్కి హెచ్చరికలు పంపారు. బీజేపీకి మిత్ర పక్షంగా ఉన్న దేబ్బర్మన్ యూనస్ని హెచ్చరించారు. గురువారం గోమతి జిల్లాలో జరిగిన ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ.. యూనస్ భారతదేశ ఈశాన్య రాష్ట్రాలకు వ్యతిరేకంగా చైనాకు అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పారు.
తిప్రాహా ఇండిజీనస్ ప్రోగ్రెసివ్ రీజినల్ అలయన్స్ (టిప్రా) చీఫ్ దేబ్బర్మాన్ చాలా కాలంగా స్వదేశీ తిప్రాసా కమ్యూనిటీలను, బంగ్లాదేశ్లోని చిట్టగాంగ్ హిల్ ట్రాక్ట్స్(సీహెచ్టీ)ను ఏకం చేసి గ్రేటర్ టిప్రాలాండ్ని ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాడు. ‘‘యూనస్ చైనాతో స్నేహం చేస్తున్నాడు. ఈ ప్రాంతాన్ని(ఈశాన్య రాష్ట్రాలు) బెదిరిస్తున్నాడు. ఈశాన్య భారతదేశాన్ని తాకే ధైర్యం చేస్తే, బంగ్లాదేశ్ రెండు నిమిషాల్లో చిన్న భాగాలుగా అవుతుంది, గ్రేటర్ టిప్రాలాండ్గా మారుతుంది’’అని దేబ్బర్మాన్ అన్నారు. రాజయుగంలో కూడా, నవాబులు మన ఐక్యత కారణంగా త్రిపుర సైన్యాన్ని ఓడించలేదని గుర్తు చేశారు.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!