IAS officer’s wife’s rape: “ఐఏఎస్ అధికారి భార్యపై అత్యాచారం”.. పోలీసులపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశం..
- ఐఏఎస్ అధికారి భార్యపై అత్యాచారం..
- కేసు విచారణలో పోలీసుల నిర్లక్ష్యంపై హైకోర్ట్ ఫైర్..
- ముగ్గురు అధికారులపై చర్యలకు ఆదేశం..
- నేర తీవ్రతను తగ్గించేలా ఎఫ్ఐఆర్ నమోదు..
IAS officer’s wife’s rape: ఐఏఎస్ అధికారి భార్యపై అత్యాచారంలో కేసులో పోలీసులు తీరుపై కలకత్తా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక ఐఏఎస్ అధికారి భార్యపై జరిగిన ఈ ఘటనపై ప్రాథమిక విచారణ తప్పుగా నిర్వహించినందుకు ముగ్గురు పోలీస్ ఉన్నతాధికారులపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని కోరింది. డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారికి కేసుని బదిలీ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.
జస్టిస్ రాజర్షి భరద్వాజ్ ఈ కేసుని ప్రస్తావిస్తూ.. ఈ కేసులో నిర్లక్ష్యాన్ని గుర్తించినట్లు పేర్కొన్నారు. చట్టానికి విరుద్ధంగా మగ అధికారికి కేసును కేటాయించడం, తీవ్రమైన ఆరోపణలను తేలికపాటి నిబంధనలతో భర్తీ చేశారని, ఇవే దిగువ స్థాయి కోర్టు నిందితుడికి ప్రైమరీ బెయిల్ ఇవ్వడానికి మార్గం సుగమం చేసిందని హైకోర్టు వ్యాఖ్యానించింది. అయితే, కింది కోర్టు నిందితుడికి ఇచ్చిన బెయిల్ని రద్దు చేసింది.
Also Read
- Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
- FTA: ఇరాన్ యుద్ధం గొడవలో ప్రపంచం.. సైలెంట్గా కీలక ఒప్పందాన్ని పూర్తి చేసిన భారత్..
- PM Modi: మే 4 తర్వాత బెంగాల్లో మాఫియా, గుండాల అంతం ఖాయం..
- Love Marriage: నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం.. ఇంతలోనే ఘోరం
Read Also: Israel: ఇజ్రాయిల్ అంతటా “హై అలర్ట్”.. హిజ్బుల్లా చీఫ్ మరణంతో మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తత..
ఈ అత్యాచారం కేసు జూలై 14-15 తేదీల్లో జరిగింది. నిందితుడు రాత్రి 11.30 గంటల ప్రాంతంలో తన ఇంట్లోకి ప్రవేశించి, తుపాకీ చూపించి అత్యాచారం చేసినట్లు బాధితురాలు పేర్కొంది. నిందితుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి కూడా చాలా సమయం తీసుకున్నారని, తీవ్రమైన నేరం అయినప్పటికీ చిన్న అభియోగాలను మోపారాని పోలీసులపై ఆరోపించారు.
తన ఫిర్యాదుని విత్ డ్రా చేసుకోవాలని నిందితుడి భార్య, కొడుకు ఒత్తిడి చేసినట్లు బాధిత మహిళ పేర్కొంది. నిందితుడు తన ఇంట్లోకి ప్రవేశించిన సీసీటీవీ ఫుటేజీని తీసుకోవడానికి పోలీసులు నిరాకరించినట్లు చెప్పింది. నిందితులపై దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ లైంగిక వేధింపుల తీవ్రతను తగ్గించిందని కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భరద్వాజ్ గుర్తించారు. దీనిపై విచారణకు ఆదేశించి, ముగ్గురు పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. మూడు రోజుల్లోగా అన్ని పత్రాలు, కేసు డైరీని డిప్యూటీ కమిషనర్కు అందజేయాలని ప్రస్తుత దర్యాప్తు అధికారిని హైకోర్టు ఆదేశించింది. విచారణని మహిళా పోలీస్ స్టేషన్ బదీలీ చేశారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఐఏఎస్ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ
-
House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
-
Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
-
Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
-
Angkrish Raghuvanshi: రేర్ డిస్మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!