IAS officer’s wife’s rape: “ఐఏఎస్ అధికారి భార్యపై అత్యాచారం”.. పోలీసులపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశం..
- ఐఏఎస్ అధికారి భార్యపై అత్యాచారం..
- కేసు విచారణలో పోలీసుల నిర్లక్ష్యంపై హైకోర్ట్ ఫైర్..
- ముగ్గురు అధికారులపై చర్యలకు ఆదేశం..
- నేర తీవ్రతను తగ్గించేలా ఎఫ్ఐఆర్ నమోదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IAS officer’s wife’s rape: ఐఏఎస్ అధికారి భార్యపై అత్యాచారంలో కేసులో పోలీసులు తీరుపై కలకత్తా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక ఐఏఎస్ అధికారి భార్యపై జరిగిన ఈ ఘటనపై ప్రాథమిక విచారణ తప్పుగా నిర్వహించినందుకు ముగ్గురు పోలీస్ ఉన్నతాధికారులపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని కోరింది. డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారికి కేసుని బదిలీ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.
జస్టిస్ రాజర్షి భరద్వాజ్ ఈ కేసుని ప్రస్తావిస్తూ.. ఈ కేసులో నిర్లక్ష్యాన్ని గుర్తించినట్లు పేర్కొన్నారు. చట్టానికి విరుద్ధంగా మగ అధికారికి కేసును కేటాయించడం, తీవ్రమైన ఆరోపణలను తేలికపాటి నిబంధనలతో భర్తీ చేశారని, ఇవే దిగువ స్థాయి కోర్టు నిందితుడికి ప్రైమరీ బెయిల్ ఇవ్వడానికి మార్గం సుగమం చేసిందని హైకోర్టు వ్యాఖ్యానించింది. అయితే, కింది కోర్టు నిందితుడికి ఇచ్చిన బెయిల్ని రద్దు చేసింది.
Also Read
- MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమార్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
Read Also: Israel: ఇజ్రాయిల్ అంతటా “హై అలర్ట్”.. హిజ్బుల్లా చీఫ్ మరణంతో మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తత..
ఈ అత్యాచారం కేసు జూలై 14-15 తేదీల్లో జరిగింది. నిందితుడు రాత్రి 11.30 గంటల ప్రాంతంలో తన ఇంట్లోకి ప్రవేశించి, తుపాకీ చూపించి అత్యాచారం చేసినట్లు బాధితురాలు పేర్కొంది. నిందితుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి కూడా చాలా సమయం తీసుకున్నారని, తీవ్రమైన నేరం అయినప్పటికీ చిన్న అభియోగాలను మోపారాని పోలీసులపై ఆరోపించారు.
తన ఫిర్యాదుని విత్ డ్రా చేసుకోవాలని నిందితుడి భార్య, కొడుకు ఒత్తిడి చేసినట్లు బాధిత మహిళ పేర్కొంది. నిందితుడు తన ఇంట్లోకి ప్రవేశించిన సీసీటీవీ ఫుటేజీని తీసుకోవడానికి పోలీసులు నిరాకరించినట్లు చెప్పింది. నిందితులపై దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ లైంగిక వేధింపుల తీవ్రతను తగ్గించిందని కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భరద్వాజ్ గుర్తించారు. దీనిపై విచారణకు ఆదేశించి, ముగ్గురు పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. మూడు రోజుల్లోగా అన్ని పత్రాలు, కేసు డైరీని డిప్యూటీ కమిషనర్కు అందజేయాలని ప్రస్తుత దర్యాప్తు అధికారిని హైకోర్టు ఆదేశించింది. విచారణని మహిళా పోలీస్ స్టేషన్ బదీలీ చేశారు.
తాజావార్తలు
-
Vastu Tips: ఇంట్లో పాత క్యాలెండర్లు ఇంకా ఉంచుతున్నారా? వాస్తు ప్రకారం ఇది మంచిదేనా?
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!