IAS officer’s wife’s rape: “ఐఏఎస్ అధికారి భార్యపై అత్యాచారం”.. పోలీసులపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశం..
- ఐఏఎస్ అధికారి భార్యపై అత్యాచారం..
- కేసు విచారణలో పోలీసుల నిర్లక్ష్యంపై హైకోర్ట్ ఫైర్..
- ముగ్గురు అధికారులపై చర్యలకు ఆదేశం..
- నేర తీవ్రతను తగ్గించేలా ఎఫ్ఐఆర్ నమోదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IAS officer’s wife’s rape: ఐఏఎస్ అధికారి భార్యపై అత్యాచారంలో కేసులో పోలీసులు తీరుపై కలకత్తా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక ఐఏఎస్ అధికారి భార్యపై జరిగిన ఈ ఘటనపై ప్రాథమిక విచారణ తప్పుగా నిర్వహించినందుకు ముగ్గురు పోలీస్ ఉన్నతాధికారులపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని కోరింది. డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారికి కేసుని బదిలీ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.
జస్టిస్ రాజర్షి భరద్వాజ్ ఈ కేసుని ప్రస్తావిస్తూ.. ఈ కేసులో నిర్లక్ష్యాన్ని గుర్తించినట్లు పేర్కొన్నారు. చట్టానికి విరుద్ధంగా మగ అధికారికి కేసును కేటాయించడం, తీవ్రమైన ఆరోపణలను తేలికపాటి నిబంధనలతో భర్తీ చేశారని, ఇవే దిగువ స్థాయి కోర్టు నిందితుడికి ప్రైమరీ బెయిల్ ఇవ్వడానికి మార్గం సుగమం చేసిందని హైకోర్టు వ్యాఖ్యానించింది. అయితే, కింది కోర్టు నిందితుడికి ఇచ్చిన బెయిల్ని రద్దు చేసింది.
Also Read
- Chhattisgarh Congress: ఛత్తీస్గఢ్లోని కాంగ్రెస్ ఆఫీస్లో వింతైన ఘటన.. నల్లాలు దొంగిలించి.. నేలపై 'లవ్ యూ' నోట్!
- Bhojshala Case: "భోజ్శాల ఆలయం కాదు".. హైకోర్టు తీర్పుపై కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు..
- Bangladesh: ‘‘గంగా నది’’పైనే భారత సంబంధాలు ఆధారపడుతాయి..
- VD Satheesan Oath Ceremony: రేపే కేరళంలో కొలువుదీరనున్న కొత్త సర్కార్.. ఛీప్ గెస్ట్లు వీరే!
Read Also: Israel: ఇజ్రాయిల్ అంతటా “హై అలర్ట్”.. హిజ్బుల్లా చీఫ్ మరణంతో మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తత..
ఈ అత్యాచారం కేసు జూలై 14-15 తేదీల్లో జరిగింది. నిందితుడు రాత్రి 11.30 గంటల ప్రాంతంలో తన ఇంట్లోకి ప్రవేశించి, తుపాకీ చూపించి అత్యాచారం చేసినట్లు బాధితురాలు పేర్కొంది. నిందితుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి కూడా చాలా సమయం తీసుకున్నారని, తీవ్రమైన నేరం అయినప్పటికీ చిన్న అభియోగాలను మోపారాని పోలీసులపై ఆరోపించారు.
తన ఫిర్యాదుని విత్ డ్రా చేసుకోవాలని నిందితుడి భార్య, కొడుకు ఒత్తిడి చేసినట్లు బాధిత మహిళ పేర్కొంది. నిందితుడు తన ఇంట్లోకి ప్రవేశించిన సీసీటీవీ ఫుటేజీని తీసుకోవడానికి పోలీసులు నిరాకరించినట్లు చెప్పింది. నిందితులపై దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ లైంగిక వేధింపుల తీవ్రతను తగ్గించిందని కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భరద్వాజ్ గుర్తించారు. దీనిపై విచారణకు ఆదేశించి, ముగ్గురు పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. మూడు రోజుల్లోగా అన్ని పత్రాలు, కేసు డైరీని డిప్యూటీ కమిషనర్కు అందజేయాలని ప్రస్తుత దర్యాప్తు అధికారిని హైకోర్టు ఆదేశించింది. విచారణని మహిళా పోలీస్ స్టేషన్ బదీలీ చేశారు.
తాజావార్తలు
-
PBKS Vs RCB: కోహ్లీ, వెంకటేశ్ అయ్యర్ వీర విహారం.. భారీ స్కోర్ సాధించిన ఆర్సీబీ..
-
Taiwan: ‘‘మేము చైనా బానిసలం కాదు’’.. ట్రంప్ ప్రకటనపై తైవాన్ ఆగ్రహం..
-
Satish Kilaru: ఒకటి కాదు ఏకంగా మూడు గాయాలు.. ‘పెద్ది’ షూటింగ్లో చరణ్కు ఏమైందో చెప్పిన నిర్మాత!
-
Fire Accident : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో అగ్నిప్రమాదం..!
-
Chiru Bobby 2 :మెగాస్టార్ కొత్త లుక్.. బాబీతో క్రేజీ మూవీ ముహూర్తం ఫిక్స్.!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..