I2U2: నేడు తొలి సమావేశం.. పాల్గొననున్న ప్రధాని మోదీ
భారత్, ఇజ్రాయిల్, యూఎస్ఏ, యూఏఈ దేశాల కూటమి ఐ2యూ2 తొలి సమావేశం ఈ రోజు జరగనుంది. ప్రధాని మోదీతో పాటు ఇజ్రాయెల్ ప్రధాని యార్ లపిడ్, యూఏఈ అధ్యక్షుడు మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, యూఎస్ఏ అధ్యక్షుడు జో బైడెన్లు వర్చువల్ గా సమావేశం కానున్నారు. ఈ నాలుగు దేశాల్లో మౌళిక సదుపాయాలను ఆదునీకరించడంతో పాటు ఆరు రంగాల్లో ఉమ్మడి పెట్టుబడులు ప్రోత్సహించే విధంగా ప్రధాన చర్చ జరగనుంది.
ఐ2యూ2 కూటమిని పశ్చిమాసియా దేశాల క్వాడ్ గా కూడా పిలుస్తారు. నీరు, అంతరిక్షం, శక్తి, రవానా, ఆరోగ్యం, ఆహారం భద్రత వంటి ఆరు రంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహించడం ఐ2యూ2 ప్రధాన లక్ష్యం. ఐ2యూ2 ఏర్పడిన తర్వాత జరుగుతున్న తొలి సమావేశం ఇదే. అక్టోబర్ 18,2021లో విదేశాంగ మంత్రుల సమావేశంలో ఐ2యూ2 కూటమి ఏర్పడింది. ఇండియా, ఇజ్రాయిల్ దేశాల మొదటి ఆంగ్ల అక్షరాలు ‘ఐ’, యూఎస్ఏ, యూఏఈ దేశాల మొదటి అక్షరాలు ‘యూ’లతో ఐ2యూ2 కూటమి పేరును పెట్టారు.
Also Read
- Rs 397 Crore Transformer Scam: ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలులో రూ.397 కోట్ల స్కామ్.. సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశాలు..
- JMI VC Mazhar Asif: "భారతీయులందరిది మహాదేవుడి డిఎన్ఏ!".. ముస్లిం వైస్ ఛాన్సలర్ ఆసిఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- PM Modi: ప్రధాని మోడీ వారణాసి పర్యటన.. కాశీ విశ్వనాథ ఆలయంలో ప్రత్యేక పూజలు
- West Bengal Assembly Elections 2026: బెంగాల్ 2వ దశ పోలింగ్లో EVM గందరగోళం.. హౌరాలో హింసాత్మక ఘటనలు
Read Also: COVID 19: కోవిడ్ కల్లోలం.. 20 వేలను దాటిన కేసుల సంఖ్య
పరిశ్రమల్లో మౌళిక సదుపాయాలు, తక్కువ కార్బన్ ఉద్గాలకు సంబంధించి అభివృద్ధి మార్గాలను అన్వేషించడం, ప్రజారోగ్యాన్ని మెరుగుపడచడం, గ్రీన్ టెక్నాలజీని ప్రోత్సహిచడంలో ప్రైవేటు రంగ మూలధనం, నైపుణ్యాలను సమీకరించాలనే ఉద్దేశంపై ఈ కూటమి ఏర్పడింది. ఉమ్మడి ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టడంపై ఈ రోజు జరుగుతున్న సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. తొలిసారి జరుగుతున్న ఈ సమావేశంపై అంతా ఆసక్తి నెలకొంది. ఈ రోజు మధ్యాహ్నం 4 గంటలకు వర్చువల్ గా నాలుగు దేశాల అధినేతల మధ్య వర్చువల్ సమావేశం జరగనుంది.
తాజావార్తలు
-
Ramya Krishna : రేపు పెళ్లి అనంగా.. రాత్రి 2 వరకు ఎన్టీఆర్ తోనే ఉన్న..!
-
Donald Trump: ట్రంప్ను రోస్ట్ చేసిన కింగ్ చార్లెస్.. మేము లేకపోతే మీరు ఫ్రెంచ్ మాట్లాడేవారంటూ ఎగతాళి
-
KTR: కేసీఆర్ అప్పుడే చిలుకకు చెప్పినట్టు చెప్పారు.. కల్వకుర్తి సభను గుర్తు చేసిన కేటీఆర్..
-
Uttam Kumar Reddy: ప్రాణహిత-చేవెళ్లపై వెనక్కి తగ్గేదే లేదు! తుమ్మిడిహట్టి ప్రతిపాదనలపై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన
-
Malla Reddy: పార్టీ మార్పుపై మాజీ మంత్రి మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో