Lok Sabha Speaker: ఇప్పట్లో లోక్సభకు రాను…. అధికార, విపక్షాల తీరుపై స్పీకర్ అసంతృప్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lok Sabha Speaker: లోక్సభలో అధికార, విపక్షాలు వ్యవహారిస్తున్న తీరుపై స్పీకర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇరు పక్షాల సభ్యులు తమ తీరును మార్చుకునే వరకు తాను లోక్సభకు రానని స్పష్టం చేశారు. మణిపూర్ అంశంపై చర్చకు సంబంధించి ఇటు విపక్షాలతోపాటు.. అటు అధికార పక్షం వ్యవహారిస్తున్న తీరుపై స్పీకర్ ఓం బిర్లా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మణిపూర్ అంశంపై దీర్ఘకాలిక చర్చ చేపట్టాలని ప్రతిపక్షాలు పట్టుపడుతున్నాయి. అలాగే చర్చకు ప్రధాని నరేంద్ర మోడీ సమాధానం ఇవ్వాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం మణిపూర్ అంశంపై స్వల్ప కాలిక చర్చ చేపడతామని.. చర్చకు హోం శాఖ మంత్రి అమిత్ సమాధానం ఇస్తారని చెబుతోంది. దీంతో పార్లమెంటు సమావేశాలు స్థంభిస్తున్నాయి. మణిపూర్ అంశంతో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముందుకు సాగడం లేదు. ఇవాళ కూడా ఆందోళనలు కొనసాగాయి. అయితే ఈ వ్యవహారాన్ని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తీవ్రంగా పరిగణించారు. ఎంపీల ప్రవర్తనలో మార్పు వచ్చేంత వరకు తాను సభలో అడుగుపెట్టబోనంటూ ప్రకటించారు.
Read also: Baby Movie: బేబీ టీంపై సంచలన ఆరోపణలు.. ఇక నోరు మూసుకుంటానంటూ డైరెక్టర్ ట్వీట్!
Also Read
- Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్గాంధీ లేఖ.. ఏముందంటే..!
- Operation Sindoor: పాకిస్తాన్ వేడుకున్నా దాడి చేశాం: మాజీ సీడీఎస్ అనిల్ చౌహాన్..
- Operation Sindoor: పాక్ అణుకేంద్రం ‘‘కిరాణా హిల్స్’’పై దాడి.. సంచలన నిజం చెప్పిన మాజీ CDS..
- Rahul Gandhi: కృతి సనన్ రక్షాబంధన్ యాడ్పై కంగనా విమర్శలు.. ఆమె ఇష్టమని రాహుల్గాంధీ మద్దతు
ఓవైపు అధికార పక్షం, మరోవైపు విపక్ష సభ్యులపైనా స్పీకర్ ఓం బిర్లా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సభ కార్యకలాపాలు జరగకుండా ఇరు పక్షాలు వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఇవాళ్టి సెషన్కు సైతం ఆయన హాజరు కాలేదు. ఎంపీలు సభ గౌరవానికి అనుగుణంగా నడుచుకున్నప్పుడే తాను తిరిగి సభలో అడుగుపెడతానంటూ ప్రకటించారాయన. ఇక మణిపూర్ నినాదాల నడమే ఇవాళ్టి లోక్సభ జరగలేదు. రేపటికి సభ వాయిదా పడింది. మణిపూర్ అంశంపై రూల్ 267 ప్రకారం సుదీర్ఘ చర్చ జరగాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి…. ప్రధాని మోడీ సమాధానం ఇవ్వాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేస్తుండగా.. రూల్ 176 ప్రకారం స్వల్పకాలిక చర్చతోనే సరిపెడతామని.. చర్చకు కూడా కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమాధానం చెబుతారని కేంద్రం చెబుతోంది. దీంతో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సక్రమంగా జరగడం లేదు.
Lok Sabha Speaker Om Birla has expressed deep displeasure with both the ruling party and the opposition over the functioning of the House. Birla told both sides that he will not come to Lok Sabha until MPs behave according to the dignity of the House. Even today, when the…
— ANI (@ANI) August 2, 2023
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!