Indian Woman: పాకిస్తాన్ వెళ్లి, మతం మార్చుకుని పెళ్లి చేసుకుంది.. ఇప్పుడు అనుభవిస్తోంది..
- ‘‘నన్ను వేధిస్తున్నారు, ఇంటికి తీసుకెళ్లండి’’..
- పాకిస్తాన్ వెళ్లి పెళ్లి చేసుకున్న భారతీయ మహిళ..
- వైరల్ అవుతున్న ఆడియో క్లిప్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Woman: గతేడాది నవంబర్ నెలలో సిక్కుల తీర్థయాత్ర కోసం పాకిస్తాన్లో తీర్థయాత్రకు వెళ్లిన ఒక మహిళ మళ్లీ భారత్ తిరిగి రాలేదు. అక్కడే ఒక పాకిస్తానీ వ్యక్తిని పెళ్లి చేసుకోవడం సంచలనంగా మారింది. భారతీయ మహిళ సారబ్జీత్ కౌర్ పాకిస్తాన్లోనే సెటిల్ అయింది. అయితే, కొన్ని రోజుల్లోనే తాను ఎలాంటి నరకంలోకి కోరి వచ్చాననే విషయం త్వరలోనే తెలిసింది. ఆమెకు చెందినదిగా భావిస్తున్న ఒక ఆడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. భారత్తోని తన మాజీ భర్తతో మాట్లాడుతున్నట్లు ఈ ఆడియోలో ఉంది.
పాకిస్తాన్లో తనను వేధిస్తున్నారని పేర్కొంటూ, తనను వెంటనే భారత్ తీసుకురావాలని ప్రాధేయపడింది. పంజాబ్లోని కపుర్తలా జిల్లాలోని అమన్పూర్ గ్రామానికి చెందిన 48 ఏళ్ల ఈ సిక్కు మహిళ, గురునానక్ జయంతికి సంబంధించిన ఉత్సవాలకు హాజరయ్యేందుకు గత ఏడాది నవంబర్లో వాఘా సరిహద్దు మీదుగా పాక్ వెళ్లింది. ఇలా పాక్ వెళ్లిన 2000 మంది సిక్కు యాత్రికుల్లో ఈమె కూడా ఒకరు. ఆ సమయంలో వెళ్లిన వారు అంతా భారత్ తిరిగి వచ్చారు, ఒక్క సారబ్జీత్ కౌర్ తప్పా. నవంబర్ 4న పాక్ వెళ్లిన ఒక రోజు తర్వాత, ఆమె లాహోర్కు సుమారు 50 కి.మీ దూరంలో ఉన్న షేఖుపురా జిల్లాకు చెందిన నాసిర్ హుస్సేన్ను వివాహం చేసుకుంది.
Also Read
- Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
- NEET Paper Leak: రూ. 10 లక్షలకు కొని, రూ. 15 లక్షలకు అమ్మకం.. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడి అరెస్ట్..
- Maharashtra: ఘోర విషాదం.. ఆలయ గోడ కూలి ఆరుగురు మృతి
- UP: భర్త కోసం టవరెక్కిన మహిళ.. గంట తర్వాత ఏం జరిగిందంటే..!
Read Also: PM Modi: తొలి వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభించిన మోడీ
నా పరిస్థితి బాగోలేదు:
ఒక క్లిప్లో కౌర్ మాట్లాడుతూ.. తన పరిస్థితి పాకిస్తాన్లో బాగోలేదని, తాను వివాహం చేసుకున్న వ్యక్తి, అతడి కుటుంబం వేధిస్తున్నారని చెప్పింది. తాను భారత్ తిరిగి రావాలనుకుంటున్నానని, తిరిగి వచ్చిన తనకు ఎలాంటి హాని కలిగించవద్దని సదరు వ్యక్తిని కోరుతోంది. ‘‘ఇక్కడ నన్ను వేధిస్తున్నారు. నా పిల్లలు లేకుండా నేను జీవించలేను. ఒకప్పుడు నేను ప్రజలకు లక్షల రూపాయలు ఇచ్చే దానిని, నేను ఒక సర్దార్ని, ఇప్పుడు నేను డబ్బు కోసం వేడుకోవాల్సి వస్తోంది’’ అని ఆడియోలో ఆవేదన వ్యక్తం చేసింది. తాను గూఢచారిగా పాక్ వెళ్లలేదని, తన అశ్లీల ఫోటోలు నాసిర్ హుస్సేన్ దగ్గర ఉన్నాయని, వాటిని తొలగించడానికి వెళ్లాలనని మహిళ చెప్పింది.
గతంలో కౌర్ తాను విడాకులు తీసుకున్నానని, హుస్సేన్ను పెళ్లి చేసుకోవాలని ఇక్కడికి వచ్చానని చెప్పింది. తన వీసా పొడగించాలని ఇస్లామాబాద్ రాయబార కార్యాలయాన్ని కోరింది. పాకిస్తాన్ జాతీయత కోసం దరఖాస్తు చేసుకుంది. నిఖా వేడుక తర్వాత తన పేరును కౌర్ నుంచి నూర్గా మార్చుకుంది.
తాజావార్తలు
-
Daily Horoscope: బుధవారం రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి ఊహించని శుభవార్తలు!
-
Pat Cummins: “ఏం పర్వాలేదు.. ప్లేఆఫ్స్కు ఇంకా ఛాన్స్ ఉందిగా”.. కెప్టెన్ కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!