Cash-for-Query Case: ఢిల్లీ హైకోర్టులో మహువా మొయిత్రాకి బిగ్ రిలీఫ్..
- టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాకు ఢిల్లీ హైకోర్టులో ఊరట..
- డబ్బులు తీసుకొని పార్లమెంటులో ప్రశ్నలు అడిగారనే కేసులో సీబీఐ అభియోగపత్రం దాఖలు..
- లోక్పాల్ ఇచ్చిన ఆదేశాలను నిలిపివేసి.. కేసును పునఃసమీక్షించాలని లోక్పాల్కు ఢిల్లీ హైకోర్టు సూచనలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cash-for-Query Case: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాకు ఢిల్లీ హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. ‘క్యాష్ ఫర్ క్వెరీ’ కేసులో టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై ఛార్జ్షీట్ దాఖలు చేసేందుకు సీబీఐకి అనుమతి ఇచ్చిన లోక్పాల్ ఆదేశాలను న్యాయస్థానం రద్దు చేసింది. జస్టిస్ అనిల్ క్షేతర్పాల్, జస్టిస్ హరీష్ వైద్యనాథన్ శంకర్లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేస్తూ.. లోక్పాల్ మళ్లీ ఈ అంశాన్ని పునఃపరిశీలించాలని ఆదేశించింది. లోక్పాల్ అండ్ లోకాయుక్తాస్ చట్టంలోని సెక్షన్ 20 ప్రకారం సంబంధిత నిబంధనలను అనుసరించి, నెల రోజుల్లో అనుమతి అంశంపై తాజా నిర్ణయం తీసుకోవాలని సూచించింది.
Read Also: Aindrita Ray: ఇంట్లో ఊపిరాడడం లేదు.. చెత్తకుప్పలు తగలబెట్టడంపై నటి ఆవేదన
Also Read
- Ram Temple donation theft: అయోధ్య విరాళాల చోరీ కేసు.. రేపు సిట్ ఫైనల్ రిపోర్ట్.?
- IMD Alert: దక్షిణాదిలో వడగాలులు.. ఈ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు
- Acid Attack Victims: యాసిడ్ దాడి బాధితులకు శుభవార్త.. కేంద్రం కీలక నిర్ణయం..
- Shraddha Walkar case: శ్రద్ధా వాకర్ హత్య కేసులో సంచలనం.. అఫ్తాబ్ ‘సైకో’గా తేల్చిన ఫోరెన్సిక్ పరీక్షలు..
అయితే, ఈ కేసులో వ్యాపారవేత్త దర్శన్ హిరానందానీ నుంచి నగదు, బహుమతులు తీసుకుని లోక్సభలో ప్రశ్నలు అడిగారనే ఆరోపణలు మహువా మొయిత్రాపై ఉన్నాయి. లోక్పాల్ అనుసరించిన విధానంలో స్పష్టమైన లోపాలున్నాయని మొయిత్రా తరఫు న్యాయవాది వాదించారు. సెక్షన్ 20(7) ప్రకారం అనుమతి ఇచ్చే ముందు ప్రజాసేవకుడి వ్యాఖ్యలను తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుందని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే, సీబీఐ మాత్రం లోక్పాల్ విచారణలో మొయిత్రాకు పత్రాలు సమర్పించే హక్కు లేదని, కేవలం వ్యాఖ్యలు మాత్రమే ఇవ్వవచ్చని, మౌఖిక విచారణకు కూడా హక్కు లేదని వాదించింది.
Read Also: Srisailam: మల్లన్న భక్తులకు గుడ్న్యూస్.. శ్రీశైలంలో స్పర్శ దర్శనాలపై కీలక నిర్ణయం
ఇక, ఈ వ్యవహారం తుది నిర్ణయం వచ్చే వరకు ఛార్జ్షీట్ దాఖలు చేయడం సహా ఎలాంటి తదుపరి చర్యలు చేపట్టకుండా సీబీఐని ఆపాలని ఎంపీ మొయిత్రా కోర్టును కోరింది. ఈ కేసులో భాగంగా సీబీఐ గత జూలైలో లోక్పాల్కు తన నివేదికను సమర్పించింది. లోక్పాల్ సూచనలతోనే మార్చి 21, 2024న అవినీతి నిరోధక చట్టం కింద మహువా మొయిత్రా, దర్శన్ హిరానందానీపై ఎఫ్ఐఆర్ నమోదు అయింది. అయితే, సీబీఐ ఆరోపణల ప్రకారం, లోక్సభ లాగిన్ వివరాలను హిరానందానీకి షేర్ చేసి, తన పార్లమెంటరీ హక్కులను ఉల్లంఘించి, జాతీయ భద్రతకు ముప్పు తెచ్చేలా వ్యవహరించినందుకు ప్రతిఫలంగా ఆమె లంచాలు తీసుకున్నట్లు పేర్కొంది.
తాజావార్తలు
-
Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
-
Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
-
OTR: సింగనమల వైసీపీలో సెగలు..
-
OTR: తాడేపల్లిగూడెం వైసీపీలో ముదిరిన వర్గపోరు..
-
Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!