PM Modi: జమ్మూకాశ్మీర్లో మోడీ ఎన్నికల ప్రచారం.. ఎప్పటినుంచంటే..!
- జమ్మూకాశ్మీర్లో మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారు
- సెప్టెంబర్ 8 నుంచి 3 చోట్ల మోడీ ప్రచార ర్యాలీలు
ప్రధాని మోడీ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు. బ్రూనై, సింగపూర్ టూర్కు వెళ్లారు. అక్కడ నుంచి రాగానే జమ్మూకాశ్మీర్లో ప్రధాని ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 8 నుంచి ఎన్నికల ప్రచారంలో మోడీ పాల్గొననున్నారు. మూడు ఎన్నికల ర్యాలీల్లో ప్రధాని పాల్గొంటారని, జమ్మూ ప్రాంతంలో రెండు చోట్ల, కశ్మీర్లో ఒక చోట బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రధాని ప్రచారం సాగిస్తారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. 370వ అధికరణ రద్దు, అనంతరం జరిగిన అభివృద్ధి, జమ్మూకశ్మీర్లో తొలిసారి ఎస్సీ, ఎస్టీ వర్గాలకు సీట్ల కోటా కల్పించడం వంటి అంశాలే ప్రచారాస్త్రాలుగా ప్రధాని పర్యటన ఉంటుందని తెలుస్తోంది.
డీలిమిటేషన్ తర్వాత 43 అసెంబ్లీ స్థానాలైన జమ్మూలో కనీసం 35 సీట్లు గెలుచుకుని, కశ్మీర్లో తగినన్ని సీట్లు దక్కించుకోవడం ద్వారా ప్రభుత్వ ఏర్పాటులో కీలక భూమిక పోషించాలని బీజేపీ పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు మూడు విడతలుగా సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ 1వ తేదీన పోలింగ్ జరుగనుండగా, అక్టోబర్ 8న ఫలితాలు వెలువడనున్నాయి.
Also Read
- Mamata Banerjee: మోడీ ‘ఝల్మురి’.. మమత ‘ఫ్రూట్స్’ కొనుగోలు.. ఫొటోలు వైరల్
- PM Modi: ఇదే నా చివరి బహిరంగ సభ.. తిరిగి ప్రమాణస్వీకారానికి వస్తా.. బెంగాల్లో మోడీ కీలక ప్రసంగం
- Rajya Sabha: బీజేపీలో ఆప్ ఎంపీల విలీనం.. రాజ్యసభ ఛైర్మన్ ఆమోదం
- Kejriwal: ఆర్ఎస్ఎస్ జడ్జ్ల ముందు హాజరుకాను.. జస్టిస్ స్వర్ణకాంతకు కేజ్రీవాల్ లేఖ
ఇక హర్యానాలో ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 5న ఇక్కడ ఓటింగ్ జరగనుంది. ఇక్కడ కూడా ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ మరోసారి అధికారం కోసం ప్రయత్నిస్తోంది. అలాగే ఇండియా కూటమి కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.
తాజావార్తలు
-
Petrol, Diesel Shortage: పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. అధికారులకు కీలక ఆదేశాలు
-
Mamata Banerjee: మోడీ ‘ఝల్మురి’.. మమత ‘ఫ్రూట్స్’ కొనుగోలు.. ఫొటోలు వైరల్
-
Raja Shivaji: రితేష్-జెనీలియా డ్రీమ్ ప్రాజెక్ట్ ‘రాజా శివాజీ’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ!
-
Infosysకు 20 ఎకరాల స్థలం కేటాయింపు.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు
-
Telangana Legislative Council: ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్, ప్రో. కోదండరాం
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!