Katchatheevu: కచ్చతీవు వివాదంపై స్పందించిన శ్రీలంక.. ఏం చెప్పిందంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Katchatheevu: ప్రస్తుతం దేశంలో ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలో కచ్చతీవు దీవుల అంశం చర్చనీయాంశంగా మారింది. 1970లలో అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం భారత్కి చెందిన హిందూ మహాసముద్రంలోని కచ్చతీవు ద్వీపాన్ని శ్రీలంకకు అప్పగించిందని ప్రధాని నరేంద్రమోడీతో పాటు బీజేపీ ఆరోపిస్తోంది. ఈ పరిణామాలు తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. ఆ సమయంలో తమిళనాడు ముఖ్యమంత్రిగా డీఎంకే నేత కరుణానిధి ఉన్నారు. తాజాగా జరగబోతున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్, డీఎంకే పార్టీలు మిత్రపక్షాలుగా పోటీచేస్తున్నాయి. వ్యూహాత్మక ప్రాంతంలో ఉన్న ఈ దీవుల్ని శ్రీలంకకు అప్పగించడంతో తరుచుగా తమిళనాడు మత్స్యకారులను ఆ దేశ నేవీ అరెస్ట్ చేయడంతో పాటు బోట్లను జప్తు చేస్తోంది.
ఇదిలా ఉంటే ఈ వివాదంపై బుధవారం శ్రీలంక విదేశాంగ మంత్రి బుధవారం స్పందించారు. ఈ ద్వీపానికి సంబంధించిన సమస్య పరిష్కారమైందని, ఎలాంటి వివాదం లేదని లంక మంత్రి అలీ సబ్రీ అన్నారు. ‘‘దీనిపై ఎలాంటి వివాదం లేదని, అయితే ద్వీపం అప్పగింతలో ఎవరు బాధ్యులతనే అంతర్గత రాజకీయ చర్చలు జరుగుతున్నాయి’’ అని అంతే తప్పా కచ్చతీవుపై ఎవరూ మాట్లాడటం లేదని ఆయన చెప్పారు. ఈ సమస్య 50 ఏళ్ల క్రితమే పరిష్కారమైందని, దానిని మళ్లీ తెరవాల్సిన అవసరం లేదని అన్నారు.
Also Read
శ్రీలంక మంత్రివర్గం కచ్చతీవుపై ఇప్పటి వరకు చర్చించలేదని శ్రీలంక అని క్యాబినెట్ అధికార ప్రతినిధి మరియు సమాచార మంత్రి బందుల గుణవర్ధన బుధవారం మీడియాతో అన్నారు. కచ్చతీవు వివాదంపై శ్రీలంక మీడియా, సోషల్ మీడియాలో తీవ్ర స్పందన కనిపించినప్పటికీ, ప్రభుత్వ పరంగా పెద్దగా స్పందన లేదు. విదేశాంగ మంత్రి అలీ సబ్రీ స్పందనే కచ్చతీవుపై శ్రీలంక అధికార స్పందన అవుతుంది. భారతదేశంలో బీజేపీ, డీఎంకే-కాంగ్రెస్ కూటమి మధ్య కచ్చతీవు వివాదాస్పద అంశంగా మారిందని అక్కడి మీడియా నివేదించింది.
స్నేహపూర్వక పొరుగు వారి ప్రమాకరమైన, అనవసరమైన రెచ్చగొట్టే వాదన తీవ్ర పరిణామాలకు దారి తీస్తుందని అక్కడి ‘ది డైలీ ఫైనాన్షియల్ టైమ్స్’ ఎడిటోరియల్ కాలమ్ పేర్కొంది. కొలంబోకు చెందిన డైలీ మిర్రర్ తన సంపాదకీయంలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ని లక్ష్యంగా చేసుకుంది. తమిళనాడు ఓట్లను పొందడానికి మతపరమైన భావాలను రెచ్చగొట్టడానికి ప్రధాని(పీఎంమోడీ)తో చేతులు కలిపారని డైలీ మిర్రర్ వ్యాఖ్యానించింది. తమిళ వర్గానికి చెందిన శ్రీలంక మంత్రి జీవన్ తొండమాన్ మాట్లాడుతూ.. కచ్చతీవు శ్రీలంక అధికార పరిధిలోకి వస్తుందని అన్నారు. భారత్ విదేశాంగ విధానం శ్రీలంకతో ఆరోగ్యకరంగా ఉందని అన్నారు.
తాజావార్తలు
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!