Manipur Violence: మణిపూర్లో మరోసారి ఉద్రిక్తత.. ఇంఫాల్లో ఇళ్లకు నిప్పు..
Manipur Violence: జాతుల మధ్య ఘర్షణతో మణిపూర్ అట్టుడుకుతోంది. ముఖ్యంగా మైయిటీ, కుకీ కమ్యూనిటీల మధ్య పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. కేంద్ర హోంమంత్రి మణిపూర్ లో పర్యటించినా.. శాంతి ప్రక్రియ కోసం కమిటీలు ఏర్పాటు చేసిన పరిస్థితి అదుపులోకి రావడంతో లేదు. ఇదిలా ఉంటే గురువారం కూడా మణిపూర్ లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. రాజధాని ఇంఫాల్ లో నిరసనకారులు, భద్రత బలగాలకు మధ్య ఘర్షణ ఏర్పడింది. ఈ ఘర్షణల్లో పలు ఇళ్లకు నిప్పంటించారు. పరిస్థితిని అదుపు చేసేందుకు భద్రతాబలగాలు టియర్ గ్యాస్ ను ప్రయోగించాయి.
Read Alos: Indonesia Open: చైనీస్ తైపీకి చెందిన తాయ్ జు యింగ్ చేతిలో పీవీ సింధు పరాజయం
Also Read
- Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
- Bengal Elections: రేపు తృణమూల్ కంచుకోటలో పోలింగ్.. ఈసారి ఎవరిది పైచేయి!
- Manish Sisodia: కోర్టులో మీరుంటే విచారణకు రాను.. జస్టిస్ స్వర్ణకాంతకు మనీష్ సిసోడియా లేఖ
- Nashik TCS Case: నిదా ఖాన్ బెయిల్ పిటిషన్పై కోర్టులో ముగిసిన కీలక వాదనలు.. ఆసక్తికరంగా మారిన తీర్పు..!
మణిపూర్ ఖమెన్ లోక్ గ్రామంలో నిన్న జరిగిన ఘర్షణల్లో మహిళతో సహా 9 మంది మరణించిన తర్వాత, ఈ రోజు ఇంఫాల్ లో ఘర్షణలు తెలెత్తాయి. బుధవారం ఇంఫాల్ లోని మణిపూర్ క్యాబినెట్ లోని ఏకైక మహిళా మంత్రి అధికారిక నివాసానికి నిప్పు పెట్టారు. ఈ ఘర్షణలు జరిగినప్పుడు మంత్రి నెమ్చా కిప్ జెన్ ఇంట్లో లేరు. మే 3 నుంచి మైయిటీ, కుకీ తెగల మధ్య ఘర్షణలు తెలెత్తాయి. ఇప్పటి వరకు ఈ ఘర్షణల్లో 100కు పైగా మంది మరణించారు. వేల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులు అయ్యారు.
మణిపూర్ రాష్ట్రంలో మెజారిటీ మైయిటీ కమ్యూనిటీకి రిజర్వేషన్లు ఇచ్చే అంశాన్ని వ్యతిరేకిస్తూ..మిగతా వర్గాల ప్రజలు ‘గిరిజన సంఘీభావ’ ర్యాలీ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా హింస చెలరేగింది. అప్పుడు ప్రారంభమైన హింస ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే ఈ హింసను కొందరు తీవ్రవాదులు మరింతగా ప్రేరేపిస్తున్నారు. ముఖ్యంగా మయన్మార్ నుంచి మణిపూర్ లోకి ప్రవేశించి హింసను ప్రేరేపిస్తున్నారు.
తాజావార్తలు
-
Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
-
Ashu Reddy: హైకోర్టును ఆశ్రయించిన అషురెడ్డి ..
-
Shreyas Iyer: “నీ వల్ల కాదు అంటే తట్టుకోలేను”.. విమర్శకులకు శ్రేయస్ అయ్యర్ స్ట్రాంగ్ కౌంటర్..
-
Nigeria: నైజీరియాలో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఫుట్బాల్ మైదానంలో కాల్పులు.. 29 మంది మృతి
-
Srinivasa Mangapuram: మండుటెండలోనూ తగ్గని జయకృష్ణ..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!