Hafiz Saeed: ముంబై ఉగ్రదాడి సూత్రధారి హఫీజ్ సయాద్పై విష ప్రయోగం.. సోషల్ మీడియాలో దుమారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hafiz Saeed: 26/11 ముంబై ఉగ్రదాడుల సూత్రధారి, లష్కరే తోయిబా ఉగ్రసంస్థ చీఫ్ హఫీజ్ సయీద్పై విష ప్రయోగం జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇండియా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిగా ఉన్న అతని పరిస్థితి విషమంగా ఉందని, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. నిన్నటి నుంచి సోషల్ మీడియా వేదికగా హఫీజ్ సయీద్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఉగ్రవాదానికి నిధులు సమకూరుస్తున్నాడనే ఆరోపణల నేపథ్యంలో, అమెరికా ఒత్తిడితో పాక్ అధికారులు అతడిని జైలులో ఉంచారు. అయితే, జైలులో అతడిపై విష ప్రయోగం జరిగిందనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ వార్తలను పాకిస్తాన్ పెద్దగా పట్టించుకోవడం లేదు. అక్కడి మీడియాలో దీనిపై ఊసేలేదు. అధికారుల నుంచి ఎలాంటి అధికార ప్రకటన కూడా రాలేదు.
Read Also: Israel: ఇరాన్ దాడి చేస్తుందనే, గాజా నుంచి ఇజ్రాయిల్ దళాల ఉపసంహరణ..
Also Read
- PM Modi: ‘జో ఖేలేగా, వో ఖిలేగా’.. కామన్వెల్త్ పతక విజేతలతో మోడీ భేటీ, వీడియో వైరల్
- Delimitation Bill 2026: పార్లమెంట్లో డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. డీఎంకే 22 మంది ఎంపీలే కీలకం, ఎన్డీఏకు పరీక్ష
- Uttar Pradesh: ‘‘నా అల్లుడు 25 పెళ్లిళ్లు చేసుకున్నాడు’’.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
- Jharkhand Protest: JPSC పరీక్ష రద్దుకు జార్ఖండ్ ప్రభుత్వం సిద్ధం.. CBI దర్యాప్తుపై విద్యార్థుల పట్టు
26/11 ముంబై ఉగ్రదాడులకు వెనక ఇతను కీలక సూత్రధారిగా ఉన్నాడు. ఈ దాడిలో 160 మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుంచి హఫీస్ సయీద్ని తమకు అప్పగించాలని భారత్ కోరుతోంది. అయితే, పాకిస్తాన్ మాత్రం సరైన ఆధారాలు లేవని, ఈ ఆధారాలు పాకిస్తాన్ చెబుతూ వస్తోంది. అయితే, ఇటీవల కాలం పాకిస్తాన్లో వరసగా భారత మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల్ని గుర్తుతెలియని వ్యక్తులు చంపేస్తున్నారు. ఈ నేపథ్యంలో హఫీస్ సయీద్ వార్త ప్రాధాన్యతను సంతరించుకుంది.
కెనడా, అమెరికాతో పాటు బ్రిటన్కి చెందిన కొన్ని పత్రికలు ఈ దాడుల వెనక భారత ఇంటెజెన్స్ వ్యవస్థ ఉందనే కథనాలను ప్రచురిస్తున్నాయి. ఇటీవల యూకేకి చెందిన ది గార్డియన్ పాకిస్తాన్లో జరుగుతున్న టార్గెటెడ్ కిల్లింగ్స్లో భారత ప్రయేయం ఉందని ఆరోపించింది. అయితే, భారత్ మాత్రం వీటిని నిరాధారమైన వార్తలుగా కొట్టిపారేసింది. పాకిస్తాన్ మాత్రమే కాకుండా కెనడాలో గతేడాది ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ని గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చారు. ఈ కేసులో భారత ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు. ఆయన వ్యాఖ్యల్ని భారత్ ఖండించింది.
తాజావార్తలు
-
Lenovo Lecoo P900A: లెనోవో నుంచి కొత్త బడ్జెట్ టాబ్లెట్.. 8GB RAM, 5000mAh బ్యాటరీ, 4G సపోర్ట్
-
Mohsen Rezaee: ఇరాన్ టాప్ సెక్యూరిటీ బాడీకి మాజీ IRGC చీఫ్.. మొహ్సెన్ రెజాయీ నియామకం ఎందుకంత కీలకం?
-
Main Wapas Aaunga OTT: ఓటీటీలో నంబర్ వన్గా దూసుకెళ్తున్న పాకిస్తానీ లవ్ స్టోరీ.. ఐయండిబిలో 8.2 రేటింగ్
-
AP Local Body Elections: ఏపీలో ఎన్నికల సందడి.. పంచాయతీరాజ్ శాఖ క్లారిటీ
-
SpiderMan Brand New Day : అవతార్-2 రికార్డు బద్దలు.. ఇండియా నం:1 గ్రాసర్గా ‘బ్రాండ్ న్యూ డే’
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!