Hafiz Saeed: ముంబై ఉగ్రదాడి సూత్రధారి హఫీజ్ సయాద్పై విష ప్రయోగం.. సోషల్ మీడియాలో దుమారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hafiz Saeed: 26/11 ముంబై ఉగ్రదాడుల సూత్రధారి, లష్కరే తోయిబా ఉగ్రసంస్థ చీఫ్ హఫీజ్ సయీద్పై విష ప్రయోగం జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇండియా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిగా ఉన్న అతని పరిస్థితి విషమంగా ఉందని, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. నిన్నటి నుంచి సోషల్ మీడియా వేదికగా హఫీజ్ సయీద్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఉగ్రవాదానికి నిధులు సమకూరుస్తున్నాడనే ఆరోపణల నేపథ్యంలో, అమెరికా ఒత్తిడితో పాక్ అధికారులు అతడిని జైలులో ఉంచారు. అయితే, జైలులో అతడిపై విష ప్రయోగం జరిగిందనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ వార్తలను పాకిస్తాన్ పెద్దగా పట్టించుకోవడం లేదు. అక్కడి మీడియాలో దీనిపై ఊసేలేదు. అధికారుల నుంచి ఎలాంటి అధికార ప్రకటన కూడా రాలేదు.
Read Also: Israel: ఇరాన్ దాడి చేస్తుందనే, గాజా నుంచి ఇజ్రాయిల్ దళాల ఉపసంహరణ..
Also Read
- Russian Oil: అమెరికా ఆంక్షలు ఉంటే ఎంత? ఊడితే ఎంత! రష్యా చమురు కొనుగోలుపై భారత్ 'మాస్' స్టేట్మెంట్!
- Supreme Court: రోడ్లపై వీధి కుక్కలు కనిపిస్తే అంతే! సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. పాత ఆర్డర్ మారేదే లేదని స్పష్టం
- IMD Yellow Alert: నిప్పుల కొలిమిలా ఉత్తర భారతం.. ఢిల్లీలో 45 డిగ్రీల దాకా చేరిన ఉష్ణోగ్రతలు.. ఐఎండి తీవ్ర హెచ్చరిక!
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
26/11 ముంబై ఉగ్రదాడులకు వెనక ఇతను కీలక సూత్రధారిగా ఉన్నాడు. ఈ దాడిలో 160 మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుంచి హఫీస్ సయీద్ని తమకు అప్పగించాలని భారత్ కోరుతోంది. అయితే, పాకిస్తాన్ మాత్రం సరైన ఆధారాలు లేవని, ఈ ఆధారాలు పాకిస్తాన్ చెబుతూ వస్తోంది. అయితే, ఇటీవల కాలం పాకిస్తాన్లో వరసగా భారత మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల్ని గుర్తుతెలియని వ్యక్తులు చంపేస్తున్నారు. ఈ నేపథ్యంలో హఫీస్ సయీద్ వార్త ప్రాధాన్యతను సంతరించుకుంది.
కెనడా, అమెరికాతో పాటు బ్రిటన్కి చెందిన కొన్ని పత్రికలు ఈ దాడుల వెనక భారత ఇంటెజెన్స్ వ్యవస్థ ఉందనే కథనాలను ప్రచురిస్తున్నాయి. ఇటీవల యూకేకి చెందిన ది గార్డియన్ పాకిస్తాన్లో జరుగుతున్న టార్గెటెడ్ కిల్లింగ్స్లో భారత ప్రయేయం ఉందని ఆరోపించింది. అయితే, భారత్ మాత్రం వీటిని నిరాధారమైన వార్తలుగా కొట్టిపారేసింది. పాకిస్తాన్ మాత్రమే కాకుండా కెనడాలో గతేడాది ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ని గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చారు. ఈ కేసులో భారత ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు. ఆయన వ్యాఖ్యల్ని భారత్ ఖండించింది.
తాజావార్తలు
-
CM Chandrababu: తీరం మనదే.. బోటు మనదే.. వేట కూడా మనదే.. ఎవరైనా వస్తే వేటాడుతాం.. వెంటాడుతాం..
-
Water Board Manager: జలమండలి మేనేజర్ ఇంట్లో ఏసీబీ దాడులు.. రూ.100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు!
-
Sorakaya Kadhi Recipe: నిమిషాల్లో రుచికరమైన, ఆరోగ్యకరమైన కర్రీ.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ అడుగుతారు..!
-
NTRNeel : సోషల్ మీడియాలో ఎన్టీఆర్ – నీల్ హంగామా మాములుగా లేదు
-
Russian Oil: అమెరికా ఆంక్షలు ఉంటే ఎంత? ఊడితే ఎంత! రష్యా చమురు కొనుగోలుపై భారత్ ‘మాస్’ స్టేట్మెంట్!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!