Kangana Ranaut: ఇజ్రాయిల్కి మద్దతుగా రాయబారిని కలిసిన కంగనా రనౌత్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kangana Ranaut: నటి కంగనా రనౌత్ ఇజ్రాయిల్కి మద్దతు తెలిపారు. బుధవారం ఆమె భారత్ లోని ఇజ్రాయిల్ రాయబారి నవోల్ గిలోన్ని కలిశారు. ఇద్దరు పలు విషయాలను చర్చించుకున్నారు. ఈ మీటింగ్ కి సంబంధించిన విషయాలను ఇరువురు తమ సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేశారు. ఉగ్రవాదంపై ఇజ్రాయిల్ విజయం సాధింస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
‘‘భారత్ లోని ఇజ్రాయెల్ రాయబారి శ్రీ నూర్ గిలోన్ జీతో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ రోజు ప్రపంచం మొత్తం, ముఖ్యంగా ఇజ్రాయెల్ మరియు భారతదేశం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాయి.నిన్న నేను రాహన దహనం కోసం ఢిల్లీలో ఉన్నాను. నేటి ఆధునిక రావణుడు హమాస్ లాంటి ఉగ్రవాదులు ఏరివేస్తున్న ఇజ్రాయిల్ రాయబారిని కలవాలని నిన్న అనుకున్నాను. చిన్న పిల్లలను, మహిళల్ని టార్గెట్ చేస్తున్న తీరు హృదయవిదారకంగా ఉంది. ఈ టెర్రరిజంపై ఇజ్రాయిల్ యుద్ధంలో విజయం సాధిస్తుందని నాకు పూర్తి నమ్మకం ఉంది. తనతో నా అప్ కమింగ్ సినిమా ‘తేజస్’ ఇండియా సెల్ఫ్ రిలయంట్ ఫైటర్ జెట్ తేజస్ గురించి చర్చించాను’’ అని కంగనా రనౌత్ తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
Read Also: Iran: “హిజాబ్” ఉల్లంఘన.. సినిమాల్లో నటించకుండా 12 మందిపై నిషేధం..
తనను కలిసేందుకు వచ్చని కంగనా రనౌత్ ఫోటోలను ఇజ్రాయిల్ రాయబారి నవోర్ గిలోన్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఆమె ఇజ్రాయిల్ కి మద్దతు తెలపడం, రాయబార కార్యాలయాన్ని సందర్శించడం మాకెంతో ప్రత్యేకమైందని, తనకే కాకుండా ప్రధాని నరేంద్రమోడీకి, ఉగ్రవాదంలో వ్యతిరేకంగా తిరుగులేని మద్దతు కోసం నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపానంటూ ఆయన కామెంట్స్ చేశారు.
భారతదేశంలో ఇజ్రాయిల్ డిప్యూటీ హెడ్ ఆఫ్ హిషన్, ఓహద్ నకాష్ కైనార్ కూడా కంగనా సమావేశమైన ఫోటోలను పంచుకున్నారు. ఈ భయంకర సమయంలో కొంతమంది మద్దతు ధైర్యంగా ఉంది. దానికి వేరే పదం లేదు. కంగనాలా నిజం చెప్పేందుకు ధైర్యం కావాలని ఇజ్రాయిల్, భారత్ ఒకే విలువలను, ధైర్యాన్ని పంచుకుంటాయి, జైఇజ్రాయిల్, జైహింద్ అంటూ ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేశారు.
అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్ పై విరుచుకుపడ్డారు. పిల్లలు, మహిళలతో సహా 1400 మందిని చంపేశారు. ఆ తర్వాత నుంచి ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) గాజాపై వైమానిక దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో ఉగ్రవాదులతో సహా సాధారణ ప్రజలు మొత్తంగా 5700 మంది మరణించారు.
It was lovely meeting @KanganaTeam who was in Delhi for her movie premiere & visited our embassy to extend her support to @Israel.
I expressed our heartfelt gratitude not only to her but also to PM @narendramodi ji and our Indian friends for their unwavering support in our… pic.twitter.com/SegcrOQnli
— Naor Gilon🎗️ (@NaorGilon) October 25, 2023
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!