Allahabad High Court: కేంద్రం ఆవును రక్షిత జాతీయ జంతువుగా ప్రకటిస్తుందని ఆశిద్దాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Allahabad High Court: కేంద్రం ఆవును రక్షిత జాతీయ జంతువుగా కేంద్ర ప్రకటిస్తుందని, గోవధను నిషేధిస్తుందని అలహాబాద్ హైకోర్టు ఆశాభావం వ్యక్తం చేసింది. హిందూ మతంలో ఆవుకు చాలా ప్రాముఖ్యత ఉందని కోర్టు విశ్వసిస్తోందని పేర్కొంది. మనం లౌకిక దేశంలో జీవిస్తున్నామని, అన్ని మతాలను గౌరవించాలని, హిందూ మతంలో ఆవును దైవంగాీ భావిస్తారని, కాబట్టి ఆవును రక్షించాలి, పూజించాలని జస్టిస్ షమీమ్ అహ్మద్ ఫిబ్రవరి 14న వ్యాఖ్యానించారు.
ఉత్తరప్రదేశ్ గోహత్య నిరోధక చట్టం, 1955 కింద ఒక వ్యక్తిపై క్రిమినల్ ప్రొసీడింగ్లను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను అలహాబాద్ హైకోర్టు తోసిపుచ్చింది. బారాబంకి నివాసి మహ్మద్ అబ్దుల్ ఖలీక్, పోలీసులు ఎటువంటి ఆధారాలు లేకుండా తనపై కేసు పెట్టారని, అందువల్ల అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో తనపై పెండింగ్లో ఉన్న విచారణలను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. అతని విజ్ఞప్తిని తోసిపుచ్చిన ధర్మాసనం, పిటిషనర్ పై రికార్డులో ఉన్న వాస్తవాల ప్రకారమే కేసు పెట్టబడిందని పేర్కొంది.
Also Read
- Vande Mataram Bill: వందేమాతరానికి అవమానం జరిగితే 3 ఏళ్ల జైలు శిక్ష.. కేంద్రం సరికొత్త బిల్లు!
- Marriage Bureau: 9 ఏళ్లుగా వధువు దొరకలేదు.. మ్యారేజ్ బ్యూరోకు కోర్టు ఫైన్..
- EPFO: ‘విశ్వాస్’ పథకాన్ని ప్రారంభించిన ఈపీఎఫ్వో.. ఎవరి కోసమంటే..!
- Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
Read Also: Law Minister Kiren Rijiju: న్యాయవ్యవస్థ ప్రజా విమర్శలకు దూరంగా ఉండాలి..
ఉత్తర్వులు జారీ చేస్తున్న సమయంలో కోర్టు ఆవు గొప్పతనం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆవు వివిధ దేవీదేవతలో సంబంధం ఉందని, ముఖ్యంగా శివుడు(నంది), ఇంధ్రుడు(కామధేనువు), శ్రీకృష్ణుడు వంటి దేవుళ్లతో సంబంధం ఉందని కోర్టు వ్యాఖ్యానించింది. పురాణాల ప్రకారం క్షీరసముద్రం చిలికే సమయంలో ఆవు ఉద్భవించిందని, ఆవు పాలు నాలుగు పురుషార్థాలు( ధర్మం, అర్థం, కామం, మోక్షం) ప్రతీక అని, ఆవు కొమ్ములు దేవతలను, ఆవు ముఖం సూర్యచంద్రులను సూచిస్తాయని పేర్కొంది.
ఆవును పూజించడం వేదకాలం నుంచి ఉందని జస్టిస్ అహ్మద్ అన్నారు. ఆవును ఋగ్వేదంలో “వధించలేనిది”గా పేర్కొన్నారని కోర్టు వ్యాఖ్యానించింది. ఆవును వధించడం మహాభారతంలో కూడా నిషేధించబడిందని అన్నారు. పంచగవ్య( పాలు, పెరుగు, వెన్న, మూత్రం, పేడ)లను ఆవు ఇస్తుందని, అహింసకు గోవు ప్రతీకగా మారిందని కోర్టు పేర్కొంది. బ్రహ్మ గురువులను, గోవులను ఒకే సమయంలో సృష్టించారని పురాణాలు చెబుతున్నాయి. ఎవరైనా ఆవును చంపినా, చంపడానికి అనుమతి ఇచ్చినా శరీరంపై వెంట్రుకలు ఉన్నన్ని ఏళ్లు నరకంలో కుళ్లిపోతారని భావిస్తారని కోర్టు తెలిపింది.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?