Basavalinga Swamy Suicide: మఠాధిపతి సూసైడ్ కేసులో ట్విస్ట్.. తెరవెనుక హనీట్రాప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Honey Trap Behind Basavalinga Swamy Suicide: కర్ణాటకలో సంచలనం సృష్టించిన బసవలింగ స్వామి(45) అనే మఠాధిపతి ఆత్మహత్య కేసులో తాజాగా ఊహించని ట్విస్ట్ వెలుగు చూసింది. ఈ కేసుని సీరియస్గా తీసుకొని పోలీసులు విచారించిగా.. తెరవెనుక హనీట్రాప్ వ్యవహారం ఉందన్న విషయం బట్టబయలైంది. ఒక మహిళతో ఆయన న్యూడ్ వీడియో కాల్స్ చేశారని, మరో మహిళ ఆ దృశ్యాల్ని తన ఫోన్లో రికార్డ్ చేసిందని పోలీసులు తెలిపారు. ఆ రికార్డ్ చేసిన వీడియోలతో మఠాధిపతిని బ్లాక్మెయిల్ చేశారని చెప్పారు. ఇదే విషయాన్ని బసవలింగ స్వామి తన సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. తనని పీఠాధిపతిగా తొలగించేందుకు కొందరు కుట్ర పన్నుతున్నారని, అందులో భాగంగానే ఒక మహిళతో న్యూడ్ వీడియో కాల్స్ చేయించారని ఆ నోల్లో రాశారు. బసవలింగ స్వామి ఆత్మహత్యకు ఆ బెదిరింపులే కారణమని పోలీసులు తేల్చారు.
నాలుగు అసభ్యకర వీడియోలను రిలీజ్ చేసి.. ఒక మహిళతో పాటు మరికొందరు బసవలింగ స్వామిని వేధించారని పోలీసులు తెలిపారు. ఆ వ్యక్తులకు సంబంధించిన వివరాలు తమ వద్ద ఉన్నాయని చెప్పిన పోలీసులు.. వారి వివరాల్ని మాత్రం రివీల్ చేయలేదు. బసవలింగ స్వామి ఆత్మహత్య వెనుక.. మఠంలోని, మఠం వెలుపలి రాజకీయాలు కారణం అయ్యుండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. కొందరు పీఠాధిపతులకు రాజకీయ నాయకులతో బలమైన పరిచయాలు ఉన్నాయని.. వీరు ఇతర పీఠాధిపతులను దెబ్బతీసేలా వ్యవహరిస్తుంటారని తమ విచారణలో తేలిందని అన్నారు. అయితే.. బసవలింగ స్వామి ఆత్మహత్య వెనుక రాజకీయ కారణాలేవీ లేవని, హనీట్రాప్ చేశారన్న మాట మాత్రం వాస్తవమని వెల్లడించారు. తాము అన్ని కోణాల్లోనూ ఈ కేసుని విచారిస్తున్నామని.. అసలు కారణాలేంటో తెలుసుకునేంతవరకు వెనకడుగు వేయమని తేల్చి చెప్పారు.
Also Read
- Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
- BRICS Summit: బ్రిక్స్ తర్వాత ప్రపంచ నాయకులకు అస్వస్థత అంటూ తప్పుడు ప్రచారం.. తీవ్రంగా ఖండించిన భారత్
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
- Semicon India 2026: సెమీకాన్ ఇండియా 2026 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సెమీకండక్టర్ రంగంలో భారీ సంస్కరణలు
కాగా.. కంచుగల్ మఠానికి 400 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ మఠానికి 1997లో బసవలింగ స్వామి ప్రధాన పీఠాధిపతిగా నియమితులయ్యారు. అప్పటి నుంచి.. అంటే దాదాపు 25 సంవత్సరాల నుంచి ఆయన ఈ మఠానికి అధిపతిగా కొనసాగుతున్నారు. కానీ, ఇప్పుడు హనీట్రాప్లో పడి ప్రాణాలు కోల్పోయారు. అటు.. రెండు నెలల క్రితం కర్ణాటకలోనే బసవ సిద్ధలింగ స్వామి అనే మరో మఠాధిపతి కూడా సూసైడ్ చేసుకున్న సంగతి తెలిసిందే!
తాజావార్తలు
-
Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
-
Jeevanlal Lavidiya : మాజీ ఐటీ కమిషనర్కు మరో షాక్.. భార్యపైనా కేసు.!
-
BRICS Summit: బ్రిక్స్ తర్వాత ప్రపంచ నాయకులకు అస్వస్థత అంటూ తప్పుడు ప్రచారం.. తీవ్రంగా ఖండించిన భారత్
-
Sarah Shahi: బెడ్రూమ్ సీన్లలో హీరోల స్పర్శ తగలకుండా ఆ బాల్తోనే.. బోల్డ్ సీన్స్ అసలు గుట్టు విప్పిన హీరోయిన్!
-
Dharmana Krishnadasu: వర్షాలు లేక సాగు ఆలస్యం.. ఎరువులు లేక రైతుల అవస్థలు.. ధర్మాన కృష్ణదాసు ఆవేదన..
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!