Basavalinga Swamy Suicide: మఠాధిపతి సూసైడ్ కేసులో ట్విస్ట్.. తెరవెనుక హనీట్రాప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Honey Trap Behind Basavalinga Swamy Suicide: కర్ణాటకలో సంచలనం సృష్టించిన బసవలింగ స్వామి(45) అనే మఠాధిపతి ఆత్మహత్య కేసులో తాజాగా ఊహించని ట్విస్ట్ వెలుగు చూసింది. ఈ కేసుని సీరియస్గా తీసుకొని పోలీసులు విచారించిగా.. తెరవెనుక హనీట్రాప్ వ్యవహారం ఉందన్న విషయం బట్టబయలైంది. ఒక మహిళతో ఆయన న్యూడ్ వీడియో కాల్స్ చేశారని, మరో మహిళ ఆ దృశ్యాల్ని తన ఫోన్లో రికార్డ్ చేసిందని పోలీసులు తెలిపారు. ఆ రికార్డ్ చేసిన వీడియోలతో మఠాధిపతిని బ్లాక్మెయిల్ చేశారని చెప్పారు. ఇదే విషయాన్ని బసవలింగ స్వామి తన సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. తనని పీఠాధిపతిగా తొలగించేందుకు కొందరు కుట్ర పన్నుతున్నారని, అందులో భాగంగానే ఒక మహిళతో న్యూడ్ వీడియో కాల్స్ చేయించారని ఆ నోల్లో రాశారు. బసవలింగ స్వామి ఆత్మహత్యకు ఆ బెదిరింపులే కారణమని పోలీసులు తేల్చారు.
నాలుగు అసభ్యకర వీడియోలను రిలీజ్ చేసి.. ఒక మహిళతో పాటు మరికొందరు బసవలింగ స్వామిని వేధించారని పోలీసులు తెలిపారు. ఆ వ్యక్తులకు సంబంధించిన వివరాలు తమ వద్ద ఉన్నాయని చెప్పిన పోలీసులు.. వారి వివరాల్ని మాత్రం రివీల్ చేయలేదు. బసవలింగ స్వామి ఆత్మహత్య వెనుక.. మఠంలోని, మఠం వెలుపలి రాజకీయాలు కారణం అయ్యుండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. కొందరు పీఠాధిపతులకు రాజకీయ నాయకులతో బలమైన పరిచయాలు ఉన్నాయని.. వీరు ఇతర పీఠాధిపతులను దెబ్బతీసేలా వ్యవహరిస్తుంటారని తమ విచారణలో తేలిందని అన్నారు. అయితే.. బసవలింగ స్వామి ఆత్మహత్య వెనుక రాజకీయ కారణాలేవీ లేవని, హనీట్రాప్ చేశారన్న మాట మాత్రం వాస్తవమని వెల్లడించారు. తాము అన్ని కోణాల్లోనూ ఈ కేసుని విచారిస్తున్నామని.. అసలు కారణాలేంటో తెలుసుకునేంతవరకు వెనకడుగు వేయమని తేల్చి చెప్పారు.
Also Read
- JP Nadda - CJP Leaders: నడ్డాతో సీజేపీ నాయకుల భేటీ.. సీజేపీ డిమాండ్స్ ఇవే!
- West Bengal: సెప్టెంబర్ 1 నుంచి బెంగాల్లో కొత్త రూల్.. మాతృ భాషకు పట్టం కట్టిన సీఎం సువేందు అధికారి!
- Abhijeet Dipke: ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజీత్ దీప్కే అరెస్ట్..
- India First Dengue Vaccine: శుభవార్త.. భారత్లో తొలి డెంగ్యూ వ్యాక్సిన్కు ఆమోదం.. ఎవరికి? ఎన్ని డోసులు? పూర్తి వివరాలు
కాగా.. కంచుగల్ మఠానికి 400 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ మఠానికి 1997లో బసవలింగ స్వామి ప్రధాన పీఠాధిపతిగా నియమితులయ్యారు. అప్పటి నుంచి.. అంటే దాదాపు 25 సంవత్సరాల నుంచి ఆయన ఈ మఠానికి అధిపతిగా కొనసాగుతున్నారు. కానీ, ఇప్పుడు హనీట్రాప్లో పడి ప్రాణాలు కోల్పోయారు. అటు.. రెండు నెలల క్రితం కర్ణాటకలోనే బసవ సిద్ధలింగ స్వామి అనే మరో మఠాధిపతి కూడా సూసైడ్ చేసుకున్న సంగతి తెలిసిందే!
తాజావార్తలు
-
Nag Chaitanya: ‘ఆ రోజు నుంచే అఖిల్ నా హీరో’.. తమ్ముడిపై నాగచైతన్య ఎమోషనల్ కామెంట్స్!
-
Public Charging: రైల్వే స్టేషన్లో ఫోన్ ఛార్జింగ్ పెడుతున్నారా? జర జాగ్రత్త.. మీ బ్యాంక్ ఖాతా ఖాళీ కావచ్చు!
-
Akhil Akkineni : మూడో రోజుకి బ్రేక్ ఈవెన్ అవ్వడం చాలా చాలా రోజుల తర్వాత జరిగింది
-
Oppo New Mobile: 10,000mAh బ్యాటరీ, 50MP సెల్ఫీ కెమెరా.. లాంచ్కు ముందే లీకైన ఒప్పో A7 ప్రో మాక్స్ ఫీచర్స్ ఇవే..
-
Hamas: హమాస్కు కొత్త బాస్.. ఖలీల్ అల్-హయ్యా చేతుల్లోకి పగ్గాలు!
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!