Sir Ganga Ram: సర్ గంగా రామ్ ఎవరు..? పాకిస్తాన్ ఎంతో గౌరవిస్తున్న హిందువు..
- సర్ గంగా రామ్, ఇప్పటికీ పాకిస్తాన్ గౌరవిస్తున్న హిందువు..
- లాహోర్ నగర నిర్మాణంలో కీలక పాత్ర..
- గంగా రామ్ హాస్పిటల్లో వేల మందికి ప్రతీ రోజూ చికిత్స..
- లాహోర్ నగరంపై తిరుగులేని ప్రభావం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sir Ganga Ram: పాకిస్తాన్ వంటి దేశానికి మతోన్మాదం, ఉగ్రవాదమే ముఖ్యం. ముఖ్యంగా భారత్ అన్నా, హిందువులన్నా ద్వేషం. కానీ ఒక్క హిందువును మాత్రం పాకిస్తాన్ ఇప్పటికీ ఎంతో గౌరవిస్తోంది. భారత్-పాకిస్తాన్ విభజన జరిగి 77 ఏళ్లు పూర్తయినప్పటికీ పాకిస్తాన్లో ఆయన ఉనికి శాశ్వతంగా ఉంది. ఆయన మరెవరో కాదు సర్ గంగా రామ్. 1921లో లాహోర్లో ఆస్పత్రిని నిర్మించిన సివిల్ ఇంజనీర్, దాత. ఇప్పటికీ ఈ ఆస్పత్రి పాకిస్తాన్లో ప్రతీ రోజు వేల మందికి చికిత్స అందిస్తోంది. ‘‘ఆధునిక లాహోర్ రూపశిల్పి’’గా ఇప్పటికీ దాయాది దేశం ఆయనను గౌరవిస్తోంది. జూలై 10న సర్ గంగారామ్ వర్ధంతి.
Read Also: Shikhar Dhawan: అంతర్జాతీయ క్రికెట్లో నేను ఎదుర్కొన్న డేంజరస్ బౌలర్లు వాళ్లే..
Also Read
- E20 పెట్రోల్పై కేంద్రం క్లారిటీ.. ఇథనాల్ కలపడం వెనుక అసలు ఉద్దేశం ఇదే.. ఎన్ని లక్షల కోట్లు ఆదా అంటే..?
- Siddaramaiah: మంత్రుల ప్రమాణస్వీరానికి సిద్ధరామయ్య డుమ్మా! మళ్లీ విభేదాలా?
- Madhya Pradesh: ప్రచారంలో నరోత్తమ్ మిశ్రా కన్నీళ్లు.. దతియాలో కాంగ్రెస్ విజయానికి కారణం ఏంటి..?
- Prashant Kishor: బీహారీయులు సామ్రాట్ చౌదరి నాయకత్వాన్ని తిరస్కరించారు.. గెలుపు తర్వాత ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు
లాహోర్ అభివృద్ధిలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తుల్లో సర్ గంగా రామ్ ఒకరు. సివిల్ ఇంజనీర్గా నగర అభివృద్ధికి తోడ్పాటు అందించారు. అనేక ఎకరాలను సాగు భూమిగా మార్చడంలో కీలకంగా వ్యవహరించారు. పాకిస్తాన్లోని సాంస్కృతిక రాజధాని అయిన లాహోర్ నగర రూపశిల్పిగా ఈయనకు పేరుంది. ప్రస్తుతం లాహోర్లోని అత్యంత విలాసవంతమైన మోడల్ టౌన్ ఏరియాను కూడా ఈయనే నిర్మించారు. భవనాలతో పాటు, లాహోర్లో నీటి ప్లాంట్లను ఏర్పాటు చేశారు. పఠాన్ కోట్-అమృత్సర్ మధ్య రైల్వే ట్రాక్ను నిర్మించారు. గంగా రామ్ సామాజిక సేవ మరియు దాతృత్వానికి ఆకర్షితుడైన బ్రిటిష్ ప్రభుత్వం అతనికి ‘సర్’ బిరుదుతో సత్కరించింది.
దేశ విభజనకు ముందు 1923లో ఆయన గంగా రామ్ ట్రస్ట్ని స్థాపించారు. గంగా రామ్ ఛారిటబుల్ హాస్పిటల్కి పునాది వేశారు. సర్ గంగా రామ్ 1851 ఏప్రిల్ 13న పాకిస్తాన్లోని పంజాబ్లోని మంగ్తన్వాలా గ్రామంలో జన్మించారు. ఆ తర్వాత అమృత్సర్ వెళ్లి, అక్కడే మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత ఇంజనీరింగ్లో డిగ్రీ పొందారు. జూలై 10, 1927లో లండన్లో మరణించారు. ఆయన వారసత్వం ఇప్పటికీ లాహోర్ నగరంతో ముడిపడి ఉంది. దేశ విభజన సమయంలో ఆయన కుటుంబం ఢిల్లీకి వచ్చింది.
తాజావార్తలు
-
Off The Record: వైసీపీ DSC పోరాటం.. కూటమి ప్రభుత్వానికి కొత్త టెన్షన్..!!
-
Hyderabad Rains : హైదరాబాద్ను ముంచెత్తిన వర్షం.. ట్రాఫిక్ టోటల్ జామ్..!
-
Trump-Iran: ‘పూర్తి లొంగుబాటు లేదా ఒప్పందం’.. ఇరాన్కు ట్రంప్ మరోసారి అల్టిమేటం
-
Bhatti Vikramarka : ప్రజా ప్రభుత్వంలో సింగరేణికి కొత్త ఊపిరి
-
Off The Record: ఆక్వా రైతుల తిరుగుబాటు.. కూటమికి భారీ షాక్..!!
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఉల్లి-ఆలూ తాజాగా ఉండాలంటే.? ఈ చిన్న జాగ్రత్తలు పాటించండి.!
-
Rainy Season Tips : వర్షాల్లో ఉప్పు, పంచదార గట్టిపడుతున్నాయా? ఈ కిచెన్ ట్రిక్స్తో ఈజీ సొల్యూషన్!
-
Asha Chocolate : 90స్ కిడ్స్ ఫేవరెట్ ‘ఆశ చాక్లెట్’ మాయమైందెందుకు? అసలు కారణం ఇదే.!
-
Kitchen Hacks : ఈ సింపుల్ చిట్కాతో.. కరివేపాకు పాడవకుండా నెలరోజులు ఫ్రెష్గా ఉంటుంది..!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వానపాముల బెడదా..? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా చెక్ పెట్టండి.!