Sir Ganga Ram: సర్ గంగా రామ్ ఎవరు..? పాకిస్తాన్ ఎంతో గౌరవిస్తున్న హిందువు..
- సర్ గంగా రామ్, ఇప్పటికీ పాకిస్తాన్ గౌరవిస్తున్న హిందువు..
- లాహోర్ నగర నిర్మాణంలో కీలక పాత్ర..
- గంగా రామ్ హాస్పిటల్లో వేల మందికి ప్రతీ రోజూ చికిత్స..
- లాహోర్ నగరంపై తిరుగులేని ప్రభావం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sir Ganga Ram: పాకిస్తాన్ వంటి దేశానికి మతోన్మాదం, ఉగ్రవాదమే ముఖ్యం. ముఖ్యంగా భారత్ అన్నా, హిందువులన్నా ద్వేషం. కానీ ఒక్క హిందువును మాత్రం పాకిస్తాన్ ఇప్పటికీ ఎంతో గౌరవిస్తోంది. భారత్-పాకిస్తాన్ విభజన జరిగి 77 ఏళ్లు పూర్తయినప్పటికీ పాకిస్తాన్లో ఆయన ఉనికి శాశ్వతంగా ఉంది. ఆయన మరెవరో కాదు సర్ గంగా రామ్. 1921లో లాహోర్లో ఆస్పత్రిని నిర్మించిన సివిల్ ఇంజనీర్, దాత. ఇప్పటికీ ఈ ఆస్పత్రి పాకిస్తాన్లో ప్రతీ రోజు వేల మందికి చికిత్స అందిస్తోంది. ‘‘ఆధునిక లాహోర్ రూపశిల్పి’’గా ఇప్పటికీ దాయాది దేశం ఆయనను గౌరవిస్తోంది. జూలై 10న సర్ గంగారామ్ వర్ధంతి.
Read Also: Shikhar Dhawan: అంతర్జాతీయ క్రికెట్లో నేను ఎదుర్కొన్న డేంజరస్ బౌలర్లు వాళ్లే..
Also Read
- Student Success: జేబులో రూ.1,000.. చేతిలో పాత ల్యాప్టాప్.. ఇప్పుడు రూ.3.5 కోట్ల స్కాలర్షిప్..
- Delhi Police Attack: షాకింగ్ ఘటన.. కర్రలు, ఇటుకలతో పోలీసులపై దాడి (వీడియో)
- Neha Pachisia: నేహా పచిసియా ఎవరు? ఎయిర్ హోస్టెస్ నుంచి పోలీస్ అధికారిణిగా.. ఇప్పుడు సస్పెన్షన్ ఎందుకు?
- Suitcase Torso Case: సూట్కేసులో మొండెం కేసులో కొత్త ట్విస్ట్.. శరీర భాగాలతో బిర్యానీ వండి..!
లాహోర్ అభివృద్ధిలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తుల్లో సర్ గంగా రామ్ ఒకరు. సివిల్ ఇంజనీర్గా నగర అభివృద్ధికి తోడ్పాటు అందించారు. అనేక ఎకరాలను సాగు భూమిగా మార్చడంలో కీలకంగా వ్యవహరించారు. పాకిస్తాన్లోని సాంస్కృతిక రాజధాని అయిన లాహోర్ నగర రూపశిల్పిగా ఈయనకు పేరుంది. ప్రస్తుతం లాహోర్లోని అత్యంత విలాసవంతమైన మోడల్ టౌన్ ఏరియాను కూడా ఈయనే నిర్మించారు. భవనాలతో పాటు, లాహోర్లో నీటి ప్లాంట్లను ఏర్పాటు చేశారు. పఠాన్ కోట్-అమృత్సర్ మధ్య రైల్వే ట్రాక్ను నిర్మించారు. గంగా రామ్ సామాజిక సేవ మరియు దాతృత్వానికి ఆకర్షితుడైన బ్రిటిష్ ప్రభుత్వం అతనికి ‘సర్’ బిరుదుతో సత్కరించింది.
దేశ విభజనకు ముందు 1923లో ఆయన గంగా రామ్ ట్రస్ట్ని స్థాపించారు. గంగా రామ్ ఛారిటబుల్ హాస్పిటల్కి పునాది వేశారు. సర్ గంగా రామ్ 1851 ఏప్రిల్ 13న పాకిస్తాన్లోని పంజాబ్లోని మంగ్తన్వాలా గ్రామంలో జన్మించారు. ఆ తర్వాత అమృత్సర్ వెళ్లి, అక్కడే మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత ఇంజనీరింగ్లో డిగ్రీ పొందారు. జూలై 10, 1927లో లండన్లో మరణించారు. ఆయన వారసత్వం ఇప్పటికీ లాహోర్ నగరంతో ముడిపడి ఉంది. దేశ విభజన సమయంలో ఆయన కుటుంబం ఢిల్లీకి వచ్చింది.
తాజావార్తలు
-
Bangladesh: బంగ్లాదేశ్లో ఒకే హిందూ కుటుంబానికి చెందిన నలుగురు దారుణ హత్య?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. 300 బంతులు ఆడగలనని ప్రపంచానికి చూపించాలి!
-
Toxic Mallareddy Event : టాక్సిక్ ప్రీరిలీజ్ ఈవెంట్లో నిర్లక్ష్యంగా మల్లారెడ్డి యూనివర్సిటీపై కేసు నమోదు..
-
Kareena Kapoor: మూడోసారి గర్భవతా?.. వైరల్ రూమర్స్పై కరీనా కపూర్ ఫన్నీ రియాక్షన్!
-
Ajith Kumar: యూరప్ ఎండ్యూరెన్స్ రేస్లో ప్రమాదం.. అదుపుతప్పి మరో కారును వేగంగా ఢీకొట్టిన అజిత్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!