Jama Masjid: జామా మసీద్ మెట్ల కింద ఉన్న హిందూ విగ్రహాలు స్వాధీనం చేసుకోవాలి.. కోర్టులో పిటిషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jama Masjid: ఆగ్రాలోని జామా మసీద్ మెట్ల కింద పాతిపెట్టిన విగ్రహాలను తిరిగి స్వాధీనం చేసుకోవాలని హిందూ ట్రస్ట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. శ్రీ కృష్ణ జన్మభూమి సంరక్షిత సేవా ట్రస్ట్ ఆగ్రాలోని జామా మసీదు మెట్ల క్రింద ఉన్న భగవాన్ కేశవదేవ్ విగ్రహాలను తిరిగి స్వాధీనం చేసుకోవాలని కోరుతూ.. పిటిషన్ దాఖలు చేసింది.
పిటిషన్ స్వీకరించిన సివిల్ జడ్జ్ పిటిషన్ స్వీకరించారు. ప్రతివాదులకు నోటీసుకు కూడా జారీ చేసింది. మే 31లోగా వారు స్పందించాలని కోర్టు నోటీసులు పంపింది. ఈ కేసులో షాహీ మసీదు ఆగ్రా కోటకు చెందిన ఇంతజామియా కమిటీ, ఛోటీ మసీదు దివాన్-ఎ-ఖాస్, జహనారా బేగం మసీదు ఆగ్రా కోట కార్యదర్శి, యూపీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు చైర్మన్, శ్రీకృష్ణ జన్మస్థాన్ సేవా సంస్థాన్ కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. మే 11న శ్రీ కృష్ణ జన్మభూమి సంరక్షిత సేవా ట్రస్ట్ చైర్మన్ మనోజ్ కుమార్ పాండే ఈ కేసును దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని స్వీకరించిన కోర్టు మే 31 లోగా స్పందన తెలియజేయాలని ఆదేశించింది.
Also Read
- PM Modi: వాదనలు బలంగా ఉండాలి.. శబ్దం కాదు.. వర్షాకాల సమావేశాలపై ప్రధాని కీలక వ్యాఖ్యలు
- Parliament March: ఢిల్లీలో హై అలర్ట్.. ఐదు కీలక మెట్రో స్టేషన్లు మూసివేత.. ప్రజలకు కీలక సూచనలు
- DMK MLA Markandeyan: డీఎంకే ఎమ్మెల్యే మార్కండేయన్ అరెస్ట్.. ఎందుకంటే?
- Vande Mataram Bill 2026: 'వందేమాతరం'పై.. నేడు రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టనున్న అమిత్ షా
Read Also: Tesla: భారత్ వైపు టెస్లా చూపు.. ఈ వారం ఇండియాకు టెస్లా టీం..
మధురకు చెందిన మత బోధకుడు దేవకినందన్ ఠాకూర్ ట్రస్ట్కు పోషకుడిగా ఉన్నారు. ఇటీవల ఆయన ఆగ్రాలో ‘భగవత్ కథ’ నిర్వహించారు. కేశవదేశ్ విగ్రహాలను హిందువుల చేతులతో పునరుద్ధరించాలని ఈ కార్యక్రమంలో ఆయన డిమాండ్ చేశారు. పిటిషన్ దాఖలు చేసిన మనోజ్ పాండే మాట్లాడుతూ.. మసీదు మెట్ల కింద శ్రీకృష్ణుని విగ్రహాలను పూడ్చిపెట్టినట్లు అనేక ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నాడు. మొఘల్ పాలకుడు ఔరంగజేబు హయాంలో రాసిన పుస్తకంలోని విషయాలు తన వద్ద ఉన్నాయని, వాటిని కోర్టులో హాజరు పరుస్తానని చెప్పాడు.
మెట్లను తవ్వినందుకు, వాటిని మళ్లీ యథాతథ స్థితికి తీసుకురావడనానికి అయ్యే ఖర్చులన్నింటినీ ట్రస్ట్ భరించడానికి సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నాడు. ఔరంగజేబు 1670లో కేశవదేవ్ ఆలయాన్ని ధ్వంసం చేసి ఆగ్రాలోని జామా మసీదు మెట్ల కింద కేశవదేవ్ విగ్రహాన్ని పాతిపెట్టాడని అనేక చారిత్రక నివేదికలు రుజువు చేశాయని మనోజ్ పాండే చెప్పారు. ట్రస్ట్ లీగల్ టీంలో బ్రజేంద్ర సింగ్ రావత్, వినోద్ శుక్లా, కృష్ణ రావత్, దిలీప్ దూబే, నితిన్ శర్మ, ఇతరులు ఉన్నారు.
తాజావార్తలు
-
Ananya Pande : అనన్య పాండే నడుము గగిల్లిన గుప్తా
-
Rohit Sharma: హిట్మ్యాన్ సూపర్ షోతో సీన్ రివర్స్..! ‘కథ ఇంకా ముగియలేదు’
-
Vivo X300e: వివో X300e.. 7200mAh బ్యాటరీ, Snapdragon 8 Gen 5 చిప్, 50MP ZEISS కెమెరాతో కొత్త ఫ్లాగ్షిప్
-
Team India: 200 వికెట్స్ తీసినా విలువ లేదా.. ఇక రిటైర్ అవ్వడమే బెటరా?
-
Zee5 Upcoming Movies: జీ5 మెగా లైనప్ అనౌన్స్.. వెంకటేష్, బాలయ్య, నాగచైతన్య సినిమాలతో భారీ ప్లాన్!
ట్రెండింగ్
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!
-
Rohit Sharma History: 50 ఏళ్ల లార్డ్స్ చరిత్రలో ఇదే మొదటిసారి.. తొలి బ్యాటర్గా రోహిత్ అరుదైన రికార్డు!
-
Rohit Sharma Last ODI: రోహిత్ శర్మ చివరి వన్డే ఆడేశాడా?.. కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆసక్తికర సమాధానం!
-
Shubman Gill: అప్పటివరకు పోటీలోనే ఉన్నాం.. ఆ ముగ్గురే ముంచారు.. లార్డ్స్ ఓటమిపై శుభ్మన్ గిల్ షాకింగ్ కామెంట్స్!