Train Accident: ఉత్తరాఖండ్లో రైల్వే ట్రాక్పై హైటెన్షన్ వైర్.. తప్పిన పెను ప్రమాదం
- ఉత్తరాఖండ్లో తప్పిన పెను ప్రమాదం..
- ఖతిమా రైల్వే స్టేషన్ను సమీపంలో రైల్వే ట్రాక్ పై తెగిపడిన హైటెన్షన్ వైర్..
- హైటెన్షన్ వైర్ ను గుర్తించి రైలును ఆపేసిన డెహ్రాడూన్- తనక్పూర్ వీక్లీ ఎక్స్ప్రెస్ లోకో పైలట్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Train Accident: ఉత్తరాఖండ్లోని ఉధమ్సింగ్ నగర్ జిల్లాలో రైల్వే ట్రాక్పై 15 మీటర్ల పొడవైన హైటెన్షన్ వైర్ పడి ఉండడాన్ని డెహ్రాడూన్- తనక్పూర్ వీక్లీ ఎక్స్ప్రెస్ లోకో పైలట్లు గుర్తించి అత్యవసరంగా రైలును ఆపేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈరోజు (మంగళవారం) తెల్లవారుజామున ఖతిమా రైల్వే స్టేషన్ను సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై అప్రమత్తమైన రైల్వే అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాక్పై ఉన్న వైర్ను తొలగించడంతో రైలు ముందుకు వెళ్లింది.
Read Also: Diwali Celebration Date Controversy: దీపావళి ఏ రోజు జరుపుకోవాలి..? పంచాంగ కర్తల మధ్య వివాదం..
Also Read
- Ayodhya Ram Mandir: రూ.4కోట్లు చెక్ ఇచ్చింది.. అకౌంట్లో చూస్తే 3 రూపాయలే ఉన్నాయ్..అయోధ్య చెక్ బౌన్స్ కథ వింటే..
- GLOF Risk in India: నేపాల్ వరదల తర్వాత భారత్కు భారీ ముప్పు.. హిమాలయాల్లో 200 ‘జల బాంబులు’?
- Rahul Gandhi: రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్.. హల్ద్వానీ ‘శుద్ధీకరణ’ వివాదంలో కేసు నమోదు
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
ఇక, ఈ విషయానికి సంబంధించి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF), ఉత్తరాఖండ్ పోలీసుల సీనియర్ అధికారులు కూడా సంఘటనా స్థలాన్ని సందర్శించారు. ఈ సంఘటనపై భారతీయ న్యాయ్ సంహిత్ (BNS)లోని సంబంధిత సెక్షన్ల కింద గుర్తు తెలియని నిందితులపై కేసు కూడా నమోదు చేశారు. అయితే, ఖతిమా స్టేషన్లోని స్టేషన్ మాస్టర్ తెలిపిన వివరాల ప్రకారం.. డెహ్రాడూన్-తనక్పూర్ వీక్లీ ఎక్స్ప్రెస్ స్టేషన్ నుంచి వెళ్లిన కాసేపటికే లోకో పైలట్లు రైలును నిలిపివేసి.. తమకు సమాచారం అందించారని చెప్పుకొచ్చారు. తక్షణమే సంఘటన ప్రదేశానికి వెళ్లి ఆ హైటెన్షన్ వైర్ ను తొలగించి ట్రైన్ ముందుకు వెళ్లేలా చేశామన్నారు. అయితే, ఈ ఘటనకి సంబంధించి దర్యాప్తు కొనసాగుతుందన్నారు.
Read Also: Telangana: గురుకుల పాఠశాలలకు తాళాలు.. బయటే టీచర్లు, విద్యార్దుల నిరీక్షణ..
కాగా, ఇటీవల ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో కూడా ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. రైలు పట్టాలపై ఇనుప రాడ్లు, సిలిండర్లు, సిమెంట్ దిమ్మెలను ఉంచడం వంటి చర్యలు తరచుగా చేస్తున్నారు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో లోకో పైలట్లు అప్రమత్తతో అనేక ప్రమాదాలను నిరోధించగలిగారు. అలాగే, రైల్వే అధికారులు, ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు రైల్వే ట్రాకులపై ప్రత్యేక నిఘా పెట్టారు.
తాజావార్తలు
-
Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
-
NBK111 : బాలయ్య – గోపీచంద్ మలినేని సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ డేట్ ఫిక్స్
-
Suriya 49: ‘సూర్య 49’లో విలన్ గా అక్కినేని నాగార్జున?.. భారీ క్లాష్ రాబోతోందా?
-
Dharman : రజనీకాంత్ – రామ్ పోతినేని ‘ధర్మన్’ సంక్రాంతి రిలీజ్?
-
Xiaomi 18 Fold: షియోమి 18 ఫోల్డ్.. 6,000mAh బ్యాటరీ.. 7.6 ఇంచెస్ డిస్ప్లే, 67W ఫాస్ట్ ఛార్జింగ్
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!