The Kerala Story: “ది కేరళ స్టోరీ” సినిమాపై స్టేకు హైకోర్టు నిరాకరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
The Kerala Story: సంచలనాలకు కేంద్రబిందువుగా మారిని ‘‘ ది కేరళ స్టోరీ ’’ సినిమాపై స్టే ఇచ్చేందుకు కేరళ హైకోర్టు శుక్రవారం నిరాకరించింది. ఈ సినిమా సెన్సార్ షిప్ రద్దు చేయాలని దాఖలైన పిటిషన్ ను ఈ రోజు విచారించింది. ఇప్పటికే ఈ సినిమాపై సుప్రీంకోర్టు కూడా స్టేకు నిరాకరించింది. సెక్యులర్ కేరళ సమాజం ఈ సినిమాను అంగీకరిస్తుందని కోర్టు వ్యాఖ్యానించింది. ఇది చరిత్రకాదు, కల్పితం అని గమనించిన ఈ సినిమా సమాజంలో మతవివాదాన్ని, సంఘర్షణను ఎలా సృష్టిస్తుందని పిటిషనర్లను ప్రశ్నించింది. సినిమా ట్రైలర్ మొత్తం సమాజానికి వ్యతిరేకంగా ఉందా..? అని అడిగింది.
సినిమా ప్రదర్శించినంత మాత్రన ఏమీ జరగదని, నవంబర్ లో సినిమా టీజర్ విడుదల చేశారని, సినిమాలో అభ్యంతరకరం ఏముంది..?అని, అల్లా ఒక్కడే దేవుడు అని చెప్పడంలో తప్పేంటని ప్రశ్నించింది. దేశ పౌరులకు నమ్మే హక్కు కల్పించబడిందని, దీంట్లో అభ్యంతరం ఏముందని హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. ఇంతకుముందు కూడా ఇలాంటి సినిమాలు చాలానే వచ్చాయని, హిందూ, క్రిస్టియన్ పూజారులఅను రిఫరెన్స్ గా సినిమాలు వచ్చాయని, వీటన్నింటిని కల్పగానే చూశారు కదా.. ఈ సినిమాలో స్పెషల్ ఏముంది..? ఈ సినిమా లౌకికవాదాన్ని ఎలా దెబ్బతీస్తుంది..? ఘర్షణకు ఎలా కారణం అవుతుంది..? అని కోర్టు వ్యాఖ్యానించింది.
Also Read
- GR Gopinath: రూపాయికే విమాన టికెట్.. సామాన్యుడి విమాన కల నిజం చేసిన వ్యక్తి కథ ఇది! ఆయన ఎవరో తెలుసా?
- Health Awareness Wedding: ఆలోచింపజేస్తున్న ఈ వధూవరుల నిర్ణయం.. ఆ టెస్ట్ తర్వాతే వివాహబంధంలోకి అడుగుపెట్టిన జంట
- Karnataka: మందుబాబులకు కర్ణాటక ప్రభుత్వం బంపర్ ఆఫర్.. భారీగా తగ్గనున్న మద్యం ధరలు!
- Greater Noida: కోటి రూపాయలతో పెళ్లి.. 14 నెలలకే విషాదాంతం! కట్నం వేధింపులకు వివాహిత బలి
Read Also: Bajrangdal protest: తెలంగాణకు తాకిన కర్ణాటక సెగ.. గాంధీ భవన్ వద్ద టెన్షన్
సినిమాపై స్టే విధించాలని వాదించిన పిటిషనర్లు.. ఈ సినిమా అమాయక ప్రజల్లో విషం నింపుతోందని, కేరళలో ‘లవ్ జీహాద్’ ఉనికిని ఏ సంస్థ కూడా గుర్తించలేదని వాదించారు. జస్టిస్ ఎన్ నగరేష్, జస్టిస్ మహ్మద్ నియాస్ సీపీలతో కూడిన డివిజన్ బెంచ్ ఈ అంశాన్ని పరిశీలించింది. సుదీప్తో సేన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. అదాశర్మ, యోగితా బిహానీ, సిద్ధి ఇద్నానీ, సోనియా బలానీ లీడ్ క్యారెక్టర్స్ చేశారు.
కేరళలో 35,000 హిందూ, క్రిస్టియన్ అమ్మాయిలు ఇస్లాంను స్వీకరించారని, ఇందులో కొంత మంది ఐసిస్ ఉగ్రసంస్థలో పనిచేయడానికి సిరియా వెళ్లారనే ఇతివృత్తంతో సినిమా రూపొందించారు. దీనిపై కేరళలోని అధికార సీపీఎంతో పాటు కాంగ్రెస్ పార్టీలు బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. సీఎం పినరయి విజయన్ ఏకంగా ఇది ‘సంఘ్ పరివార్’ ప్రచారం అని విమర్శించారు.
తాజావార్తలు
-
Ramchander Rao: బండి సంజయ్పై పార్టీ చర్యలు తీసుకుంటుందా? క్లారిటీ ఇచ్చిన బీజేపీ చీఫ్ రామచందర్రావు
-
Redmi K100: 200MP కెమెరాతో రెడ్మీ K100 చవకైన స్మార్ట్ఫోన్.. 10,000mAh బ్యాటరీ!
-
IPL 2026: ఐపీఎల్ 2026లో మజా లేదు.. ఆ సమరం ఎక్కడ అంటున్న ఫాన్స్?
-
GR Gopinath: రూపాయికే విమాన టికెట్.. సామాన్యుడి విమాన కల నిజం చేసిన వ్యక్తి కథ ఇది! ఆయన ఎవరో తెలుసా?
-
AP Heatwave Alert: ఏపీలో ఎండల తీవ్రత.. వారం రోజుల పాటు హీట్వేవ్స్ హెచ్చరిక
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..