Delhi High Alert: ఢిల్లీలో హై అలర్ట్.. 14మంది అరెస్ట్
దేశరాజధాని ఢిల్లీలో హైఅలర్ట్ కొనసాగుతోంది. ఢిల్లీ జహంగీర్ పురలో 144 సెక్షన్ అమలులో వుంది. భారీగా రంగంలోకి దిగిన కేంద్ర బలగాలు పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాయి. నిన్న హనుమాన్ శోభయాత్రలో రెండు వర్గాల మధ్య జరిగిన అల్లర్లలో పోలీసులు గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి 14 మందిని అరెస్టు చేశారు పోలీసులు. నిన్నటి ఘటనలో గాయపడ్డ 9 మంది ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసులు తెలిపారు. రాళ్ళు రువ్విన ఘటనలో పోలీసులతో పాటు పౌరులు కూడా గాయాలపాలయ్యారు.
పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే పోలీసు అధికారులతో మాట్లాడిన కేంద్ర హోంశాఖామంత్రి అమిత్ షా. సీఎం అరవింద్ కేజ్రివాల్ పరిస్థితిని ఆరా తీశారు. తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేశారు. మసీద్ వద్దకు చేరుకోగానే మొదలైన చిన్న గొదవ తరువాత పెద్దగా మారింది. ఇరువర్గాలు రాళ్ళు రువ్వుకున్నాయి. ప్రజలంతా సమన్యయం పాటించాలని,దుష్ప్రచారాలను, వదంతులను నమ్మొద్దని పోలీసులు కోరారు.
Also Read
- Mamata Banerjee: మోడీ ‘ఝల్మురి’.. మమత ‘ఫ్రూట్స్’ కొనుగోలు.. ఫొటోలు వైరల్
- PM Modi: ఇదే నా చివరి బహిరంగ సభ.. తిరిగి ప్రమాణస్వీకారానికి వస్తా.. బెంగాల్లో మోడీ కీలక ప్రసంగం
- Rajya Sabha: బీజేపీలో ఆప్ ఎంపీల విలీనం.. రాజ్యసభ ఛైర్మన్ ఆమోదం
- Kejriwal: ఆర్ఎస్ఎస్ జడ్జ్ల ముందు హాజరుకాను.. జస్టిస్ స్వర్ణకాంతకు కేజ్రీవాల్ లేఖ
Read Also: New Delhi: 25 ఏళ్ల తర్వాత మళ్లీ అదే థియేటర్లో అగ్నిప్రమాదం
మరోవైపు శాంతిభద్రతల పరిరక్షణకు అమన్కమిటీలతో ఆదివారం పోలీసు అధికారులు భేటీ అయ్యారు. ప్రజలను శాంతియుతంగా ఉండాలంటూ విజ్ఞప్తి చేయాలని కమిటీ సభ్యులను పోలీసులు కోరారు. కమిటీ సభ్యులు పోలీసులకు అందుబాటులో ఉండాలని..ఏ ప్రాంతంలోనైనా, ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు అమన్కమిటీలను కోరారు.
ఇదిలా వుంటే యూపీ, ఉత్తరాఖండ్లో కూడా శనివారం ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాల పోలీసులు అప్రమత్తమయ్యారు. శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
తాజావార్తలు
-
Mamata Banerjee: మోడీ ‘ఝల్మురి’.. మమత ‘ఫ్రూట్స్’ కొనుగోలు.. ఫొటోలు వైరల్
-
రితేష్-జెనీలియా డ్రీమ్ ప్రాజెక్ట్ ‘రాజా శివాజీ’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ!
-
Infosysకు 20 ఎకరాల స్థలం కేటాయింపు.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు
-
Telangana Legislative Council: ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్, ప్రో. కోదండరాం
-
Faria Abdullah: అతని కోసమే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!