Himachal Pradesh: 22 నుంచి 24 వరకు భారీ వర్షాలు..కోల్దామ్ రిజర్వాయర్లో 10 మంది గల్లంతు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Himachal Pradesh: నైరుతు రుతుపవనాలు ప్రారంభం అయినప్పటి నుంచీ హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్ భారీ వర్షాలు వరదల నుంచి కోలుకోలేదు. ఎంతో సుందరంగా, అందంగా ఉండే హిమాచల్ ప్రదేశ్ ఇప్పుడు వరదలతో సర్వనాశనం అయింది. నిత్యం పర్యాటకులతో సందడిగా ఉండే రాష్ట్రం కాస్త .. ఎవరైనా రావాలంటే భయపడుతున్న పరిస్థితి నెలకొనగా.. రాష్ట్రంలో ఉన్న ప్రజలు సైతం భారీ వర్షాలు, వరదల మూలంగా బిక్కు బిక్కుమంటూ జీవిస్తున్నారు. రాష్ట్రంలో వర్సాలు ఇంకా కొనసాగుతాయని అధికారులు చెబుతున్నారు. ఈ రోజు కూడా వర్షాల కారణంగా ఎల్లో అలర్ట్ జారీ చేయగా.. 22 నుంచి 24 వరకు భారీ వర్షాలు కురవనుండటంతో ఆరెంజ్ అలర్ట్ ను భారత వాతావరణ కేంద్రం జారీ చేసింది. ప్రస్తుతం కోల్దామ్ రిజర్వాయర్లో 10 మంది చిక్కుకున్నారని వారు సురక్షితంగా ఉన్నారా? లేరా? అని తెలుసుకోవడానికి రెస్క్యూ సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కుండపోత వర్షాలతో అతలాకుతలమైన హిమాచల్ప్రదేశ్కు మరో ముప్పు పొంచి ఉన్నది. భారీ వర్షాలతో ఛంబా, మండి జిల్లాలను ఆకస్మిక వరదలు ముంచెత్తే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. వర్షాల వల్ల కొండ చరియలు విరిపడుతాయని, నదులు, వాగుల్లో నీటిమట్టం పెరిగే అవకాశం ఉందని తెలిపింది. ఆదివారం కురిసిన భారీ వర్షాల వల్ల మనాలిలోని కోల్ దామ్ రిజర్వాయర్లో 10 మంది చిక్కుకుపోయారు. వారిలో ఐదుగురు అటవీ సిబ్బంది ఉన్నారని అధికారులు తెలిపారు.
Read also: Rinku Singh: అక్కడుంది రింకూ సింగ్.. ఐపీఎల్ అయినా, అంతర్జాతీయ క్రికెట్ అయినా బాదుడు మాత్రం సేమ్!
Also Read
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
- Congress: బంగ్లాదేశ్ ఉదాహరణతో కాంగ్రెస్కు కేంద్రం స్ట్రాంగ్ వార్నింగ్.. ప్రధాని నివాసం ముందు నిరసనపై ఫైర్
- Rahul Gandhi: రాహుల్గాంధీని ఈడ్చుకెళ్లిన పోలీసులు.. ముక్కుకు గాయం?
- Arijit Singh: గూండాల్లా విద్యార్థులపై దాడి చేస్తారా? ఢిల్లీ ఘటనపై ప్రముఖ సింగర్ ధ్వజం
కోల్దామ్ రిజర్వాయర్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. రిజర్వాయర్లో చిక్కకున్న వారిని కాపాడేందుకు చర్యలు చేపట్టామని, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, స్థానిక అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారని మండీ డిప్యూటీ కమిషనర్ అరిందమ్ చౌధరీ వెల్లడించారు. జలాశయంలో ఒక్కసారిగా నీటిమట్టం పెరగడంతో బోటులో వెళ్లిన పదిమంది కోల్ దామ్లోనే చిక్కుకుపోయారని చెప్పారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నదని తెలిపారు. రాష్ట్రంలో జూన్ 24 నుంచి కురుస్తున్న భారీ వర్షాల మూలంగా ఇప్పటి వరకు రూ.8014.61 కోట్ల మేర నష్టం వాటిళ్లినట్లు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా 2,022 ఇండ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయని.. మరో 9615 ఇండ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయని తెలిపింది. ఈ ఏడాది వర్షాకాలంలో 113 కొండ చరియలు విరిగిపడ్డాయని పేర్కొంది. వర్షాల వల్ల ఇప్పటివరకు 224 మంది ప్రాణాలు కోల్పోయారని.. మరో 117 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించారని ప్రభుత్వం ప్రకటించింది.
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!