UP Floods: యూపీని ముంచెత్తిన భారీ వరదలు.. జనజీవనం అస్తవ్యస్తం
- యూపీని ముంచెత్తిన భారీ వరదలు
- జనజీవనం అస్తవ్యస్తం
- సోమ, మంగళవారాల్లో కూడా భారీ వర్షాలు కురిసే ఛాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్ను భారీ వరదలు ముంచెత్తాయి. ఏకధాటిగా కురిసిన భారీ వర్షాలు కారణంగా యమునా, గంగా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. నీటి మట్టం క్షణం క్షణం పెరుగుతోంది. దీంతో రాష్ట్రంలో రెండు వందలకు పైగా గ్రామాలు నీట మునిగిపోయాయి. వేలాది ఎకరాల పంట నాశనం అయింది. వరదలు కారణంగా ఫతేపూర్లోని కాన్పూర్-బందా రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.

Also Read
- Suitcase Torso Case: సూట్కేసులో మొండెం కేసులో కొత్త ట్విస్ట్.. శరీర భాగాలతో బిర్యానీ వండి..!
- Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ..
- Cargo Ship Sinks in Bay of Bengal: బంగాళాఖాతంలో ఘోర ప్రమాదం.. 24 మంది సిబ్బందితో సరుకు నౌక మునక
- Ganesh Idol Collapse: గణేష్ ఆగమనం వేడుకలో ఘోర ప్రమాదం.. 22 అడుగుల విగ్రహం కూలి ఇద్దరు మృతి
ప్రస్తుతం యమునా, గంగా నదులు ప్రమాద స్థాయిలో ప్రవహిస్తున్నాయి. ఇక యోగి ప్రభుత్వం కూడా అప్రమత్తం అయింది. సహాయ చర్యల్లో పాల్గొనాలని అధికారులకు ఆదేశించారు. ప్రతి బాధితుడికి సాయం అందాలని తెలిపారు. అలాగే తాత్కాలిక శిబిరాల్లో బాధితులకు అన్ని ఏర్పాట్లు జరిగేలా చూడాలని కోరారు. ఇక పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో అంధకారం అలుముకున్నాయి.
ఇది కూడా చదవండి: Ashwini Vaishnaw: పట్టాలెక్కనున్న తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన
వరదలు కారణంగా 402 గ్రామాలను ప్రభావితం చేశాయని.. 84,392 మంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని.. అందరికీ సహాయం అందిస్తున్నట్లు ప్రభుత్వాధికారి తెలిపారు. ఇక 2,759 జంతువులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు రిలీఫ్ కమిషనర్ భాను చంద్ర గోస్వామి వెల్లడించారు. ప్రయాగ్రాజ్లో భారీగా నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. 62 ప్రాంతాలు వరద నీటితో మునిగిపోయాయి. ఇక అంటువ్యాధులు వ్యాప్తి చెందకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య శాఖకు ప్రభుత్వాలు ఆదేశాలు ఇచ్చింది. వారణాసిలో గంగానది నీటిమట్టం 71.50 మీటర్లకు చేరింది.
ఇది కూడా చదవండి: Donlad Trump: ‘‘ ఆమె పెదాలు మెషిన్గన్లా కదులుతాయి..’’ కరోలిన్ లెవిట్పై ట్రంప్ సె*క్సీ కామెంట్స్..
ఇదిలా ఉంటే సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే అస్సాంలో రానున్న రెండు రోజులు, కేరళలో మరో ఐదు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
తాజావార్తలు
-
Suitcase Torso Case: సూట్కేసులో మొండెం కేసులో కొత్త ట్విస్ట్.. శరీర భాగాలతో బిర్యానీ వండి..!
-
Honor Turbo 5G: హానర్ టర్బో 5G విడుదల.. 8,560mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో కొత్త 5G ఫోన్
-
ToxicTheMovie : ‘టాక్సిక్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ప్రమాదం: సౌండ్ బాక్స్లు కూలి విద్యార్థులకు గాయాలు
-
Taapsee vs Kangana: ‘పెంపకం’ వ్యాఖ్యలతో మళ్లీ రాజుకున్న కంగనా-తాప్సీ వార్.. ఇన్స్టాలో ఫైర్ బ్రాండ్ కౌంటర్!
-
Onion Price Hike: కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి ధరలు.. కిలో రూ.70 వరకు విక్రయం!
ట్రెండింగ్
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!