ముంబయి ఎయిర్పోర్ట్ లో భారీగా సైనైడ్ పట్టుకున్నారు. ముంబయి కార్గో ద్వారా దుబాయ్ వెళుతున్న ఓ పార్సిల్ లో 32 కోట్ల విలువ చేసే గోల్డ్ పొటాషియం సైనైడ్ ను గుర్తించారు డీఆర్ఐ అధికారులు. కస్టమ్స్ అధికారులను బురడి కొట్టించడానికి సైనైడ్ ను కార్గో ద్వారా దుబాయ్ కు తరలించే యత్నం చేసాడు కేటుగాడు. విశ్వసనీయ సమాచారం మేరకు ముంబయి ఎయిర్పోర్ట్ కార్గో లో పార్సల్ పై నిఘా పెట్టిన డీఆర్ఐ అధికారులు… ఓ పార్సిల్ అనుమానాస్పదంగా కనిపించడంతో తనిఖీలు చేసారు. పార్సిల్ లో ప్రమాద కరమైన సైనైడ్ ను గుర్తించిన అధికారుల బృందం… కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.