West Bengal: బెంగాల్ సీఎంకు ఐదేళ్ల బాలుడి లేఖ- మా అమ్మను ఇంటికి దగ్గరగా బదిలీ చేయండని విజ్ఞప్తి..
- పశ్చిమ బెంగాల్ సీఎం మమతా హృదయాన్ని కదిలించేలా ఐదేళ్ల బాలుడు లేఖ..
- ఉద్యోగం కోసం మా అమ్మ మాకు 600 కిలోమీటర్ల దూరంలో ఉందని వెల్లడి..
- మమతా దిదున్ దయచేసి మా అమ్మను ఇంటికి దగ్గర స్కూల్ కి బదిలీ చేయండి: బాలుడు
West Bengal: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హృదయాన్ని కదిలించేలా ఐదేళ్ల బాలుడు రాసిన లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే, అసన్సోల్కు చెందిన ఐదేళ్ల బాలుడు అయితిజ్ఞా దాస్, తన తల్లి స్వాగతా పెయిన్ను తమ ఇంటికి దగ్గరగా ఉండేలా బదిలీ చేయాలని ఆ లేఖలో విజ్ఞప్తి చేశాడు. కాగా, స్వాగతా పెయిన్ 2021లో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం సంపాదించింది. కుటుంబానికి దాదాపు 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉత్తర దినాజ్పూర్ జిల్లాలో టీచర్ గా విధులు నిర్వహిస్తుంది. జాబ్ మూలంగా ఆమె ఎక్కువ కాలం కుటుంబానికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Read Also: Gurukul School: గురుకుల పాఠశాలలో 16 మంది విద్యార్థులకు అస్వస్థత.. కారణం అదే
Also Read
అయితే, ఈ విషయంలో బాలుడు అయితిజ్ఞా లేటర్ రాస్తూ.. మమతా బెనర్జీని “ప్రియమైన మమతా దిదున్” అని సంబోధిస్తూ, “మా ఇల్లు అసన్సోల్లో ఉంది.. నా అమ్మ ఉత్తర దినాజ్పూర్లో ఉపాధ్యాయురాలుగా పని చేస్తుంది కాబట్టి మా నుండి దూరంగా ఉంటోంది.. చాలా రోజుల తర్వాత మాత్రమే ఇంటికి వస్తుంది.. నేను మా నాన్న, తాతతో ఇక్కడ ఉంటున్నాను.. అమ్మ లేకుండా జీవించడం నాకు చాలా బాధగా ఉంది.. నేను ఆమెను చాలా ప్రేమిస్తున్నాను.. దయచేసి మా అమ్మను ఇంటికి దగ్గరగా పంపించండి.. ఇకపై మా నుంచి దూరం ఉండేలా చేయకండి అని పేర్కొన్నాడు.
Read Also: Bigg Boss 9 : ఆ అల్లరి పిల్ల వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. హౌస్లో మజా డబుల్ అవుతుందా?
ఇక, స్వాగతా పెయిన్ మాట్లాడుతూ.. తన బదిలీ కోసం అనేక కార్యాలయాలకు లేఖలు రాసినా ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదని తెలిపారు. 2021లో నియమితులైన సుమారు 16,500 మంది ప్రాథమిక ఉపాధ్యాయులు ఇలాగే తమ ఇళ్లకు దూరంగా పదవుల్లో కొనసాగుతున్నారు.. వారందరూ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారని తెలిపింది. అలాగే, తన కొడుకు అయితిజ్ఞా అభ్యర్థన మమతా దిదున్ వింటే, ఆమెకు మళ్లీ లేఖ రాసి ధన్యవాదాలు చెబుతామని పేర్కొన్నారు. కాగా, ఈ లేఖ కేవలం ఐదేళ్ల బాలుడి కుటుంబానికే కాదు, ఇలాగే ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేలాది మంది ఉపాధ్యాయులకు కూడా ఊరట లభించవచ్చని ఆ చిన్నారి కుటుంబ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
-
Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో