West Bengal: బెంగాల్ సీఎంకు ఐదేళ్ల బాలుడి లేఖ- మా అమ్మను ఇంటికి దగ్గరగా బదిలీ చేయండని విజ్ఞప్తి..
- పశ్చిమ బెంగాల్ సీఎం మమతా హృదయాన్ని కదిలించేలా ఐదేళ్ల బాలుడు లేఖ..
- ఉద్యోగం కోసం మా అమ్మ మాకు 600 కిలోమీటర్ల దూరంలో ఉందని వెల్లడి..
- మమతా దిదున్ దయచేసి మా అమ్మను ఇంటికి దగ్గర స్కూల్ కి బదిలీ చేయండి: బాలుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
West Bengal: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హృదయాన్ని కదిలించేలా ఐదేళ్ల బాలుడు రాసిన లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే, అసన్సోల్కు చెందిన ఐదేళ్ల బాలుడు అయితిజ్ఞా దాస్, తన తల్లి స్వాగతా పెయిన్ను తమ ఇంటికి దగ్గరగా ఉండేలా బదిలీ చేయాలని ఆ లేఖలో విజ్ఞప్తి చేశాడు. కాగా, స్వాగతా పెయిన్ 2021లో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం సంపాదించింది. కుటుంబానికి దాదాపు 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉత్తర దినాజ్పూర్ జిల్లాలో టీచర్ గా విధులు నిర్వహిస్తుంది. జాబ్ మూలంగా ఆమె ఎక్కువ కాలం కుటుంబానికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Read Also: Gurukul School: గురుకుల పాఠశాలలో 16 మంది విద్యార్థులకు అస్వస్థత.. కారణం అదే
Also Read
- Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
- Putin: విదేశాల ఒత్తిడికి భారత్ ఎన్నడూ లొంగలేదు.. ట్రంప్కు పుతిన్ స్ట్రాంగ్ మెసేజ్..
- India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
- TGPSC New Notification: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మరో నోటిఫికేషన్ విడుదల చేసిన TGPSC..
అయితే, ఈ విషయంలో బాలుడు అయితిజ్ఞా లేటర్ రాస్తూ.. మమతా బెనర్జీని “ప్రియమైన మమతా దిదున్” అని సంబోధిస్తూ, “మా ఇల్లు అసన్సోల్లో ఉంది.. నా అమ్మ ఉత్తర దినాజ్పూర్లో ఉపాధ్యాయురాలుగా పని చేస్తుంది కాబట్టి మా నుండి దూరంగా ఉంటోంది.. చాలా రోజుల తర్వాత మాత్రమే ఇంటికి వస్తుంది.. నేను మా నాన్న, తాతతో ఇక్కడ ఉంటున్నాను.. అమ్మ లేకుండా జీవించడం నాకు చాలా బాధగా ఉంది.. నేను ఆమెను చాలా ప్రేమిస్తున్నాను.. దయచేసి మా అమ్మను ఇంటికి దగ్గరగా పంపించండి.. ఇకపై మా నుంచి దూరం ఉండేలా చేయకండి అని పేర్కొన్నాడు.
Read Also: Bigg Boss 9 : ఆ అల్లరి పిల్ల వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. హౌస్లో మజా డబుల్ అవుతుందా?
ఇక, స్వాగతా పెయిన్ మాట్లాడుతూ.. తన బదిలీ కోసం అనేక కార్యాలయాలకు లేఖలు రాసినా ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదని తెలిపారు. 2021లో నియమితులైన సుమారు 16,500 మంది ప్రాథమిక ఉపాధ్యాయులు ఇలాగే తమ ఇళ్లకు దూరంగా పదవుల్లో కొనసాగుతున్నారు.. వారందరూ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారని తెలిపింది. అలాగే, తన కొడుకు అయితిజ్ఞా అభ్యర్థన మమతా దిదున్ వింటే, ఆమెకు మళ్లీ లేఖ రాసి ధన్యవాదాలు చెబుతామని పేర్కొన్నారు. కాగా, ఈ లేఖ కేవలం ఐదేళ్ల బాలుడి కుటుంబానికే కాదు, ఇలాగే ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేలాది మంది ఉపాధ్యాయులకు కూడా ఊరట లభించవచ్చని ఆ చిన్నారి కుటుంబ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు ఆకస్మిక ధన లాభాలు.!
-
Redmi Turbo 5: రెడ్మీ టర్బో 5 వచ్చేస్తోంది.. 7560mAh బ్యాటరీ, మీడియాటెక్ ప్రాసెసర్, డ్యూయల్ కెమెరా
-
Vaibhav Sooryavanshi: టీమిండియాలోకి 15 ఏళ్ల వండర్ కిడ్.. వైభవ్ ఎంట్రీతో జట్టులో బలి అయ్యేది ఎవరు?
-
ISS Air Leak: అంతరిక్షంలో ఆందోళన.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గాలి లీక్ కలకలం
-
Eng vs NZ: మొదటి రోజు 16, రెండో రోజు 17 వికెట్లు.. బ్యాటర్స్కు ముచ్చెమటలు పట్టిస్తున్న బౌలర్లు.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!