Maharastra: మహారాష్ట్రలో హృదయవిదారకమైన ఘటన.. బైక్పై మృతదేహం తరలింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharastra: అంతరిక్షంలోకి రాకెట్ను ప్రయోగించే సాంకేతికత అభివృద్ధి చెందినా.. ఇంకా దేశంలోని కొన్ని గ్రామాలకు కనీస సౌకర్యాలు కల్పించబడలేదు. అటువంటి వాటిలో ప్రభుత్వ ఆసుపత్రుల దగ్గర అంబులెన్స్ ల ఏర్పాటు కూడా కొన్ని ప్రాంతాల్లో చేయలేదు. ఇలా ఆసుపత్రి వద్ద అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో బైక్పై మృతదేహాన్ని తీసుకెళ్లాల్సి వచ్చింది. మహారాష్ట్రలో ఈ హృదయవిదారకమైన ఘటన చోటు చేసుకుంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన వ్యక్తి మృతదేహాన్ని తమ గ్రామానికి తీసుకెళ్లడానికి అంబులెన్స్లు అందుబాటులో లేకపోవడంతో వేరే గత్యంతరం లేక మృతదేహాన్ని బైక్పై తమ గ్రామానికి తీసుకెళ్లారు. ఈ వృదయ విదాకరమైన ఘటన మహరాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలోని భామ్రాగఢ్లో చోటు చేసుకుంది.
Read also: Income Tax Notice: లక్ష మందికి ఆదాయపు పన్ను శాఖ నోటీసులు.. కారణం ఇదే
Also Read
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా లో ఓ షాకింగ్ ఘటన జరిగింది. గడ్చిరోలి జిల్లాలోని భామ్రాగఢ్లో అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో యువకుడి మృతదేహాన్ని ద్విచక్రవాహనంలో కట్టి స్వగ్రామానికి తరలించాల్సి వచ్చింది. గణేష్ తెల్మి అనే యువకుడు క్షయ వ్యాధితో బాధపడుతున్నాడు. కొద్ది రోజుల క్రితం అతనికి ఆరోగ్యం క్షీణించడంతో అతన్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అతను చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతడి మృతదేహాన్ని ఆస్పత్రి నుంచి గ్రామానికి తీసుకెళ్లేందుకు కుటుంబసభ్యులు ఎంతగానో వెతికినా అంబులెన్స్ అంబులెన్స్ అందుబాటులో లేదు. దీంతో ఇక చేసేదేమి లేక మృతి చెందిన యువకుడి కుటుంబానికి చెందిన యువకుడు ఒక బైక్పై మృతదేహాన్ని తమ స్వగ్రామానికి తీసుకెళ్లారు. మరణించిన యువకుడి మృతదేహాన్ని ఒక మంచపై కట్టి.. ఆ మంచాన్ని పడిపోకుండా ఉండేలాగా తన బైక్కు వెనకాల కట్టాడు. అలా మృతదేహం ఉన్న మంచాన్ని బైక్కు కట్టుకని తమ స్వగ్రామానికి తరలించారు. ఎంతో టెక్నాలజీ పెరుగుతున్న ఈ తరుణంలో ఇప్పటికీ కూడా ఆసుప్రతుల దగ్గర అంబులెన్స్ లు అందుబాటులో లేకుండా పోవడం అత్యంత దారుణం. ప్రభుత్వ ఆసుప్రతుల్లో చికిత్స పొందుతూ మరణించే పేద, నిరుపేదలను మృతదేహాలను తమ స్వగ్రామాలకు తరలించడం పెద్ద సమస్యగా మారుతోంది. ఈ సమస్యను పరిష్కరించడం కోసం దేశంలోని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా పార్థీవ దేహాన్ని తరలించడం కోసం ప్రత్యేకంగా అంబులెన్స్ లను ఏర్పాటు చేస్తున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మరణించిన పేదల మృతదేహాల తరలింపుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత పార్థీవ దేహాల తరలింపు అంబులెన్స్ లను ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్తోపాటు మరికొన్ని రాష్ట్రాల్లోనూ ఇటువంటి పథకం అమలు జరుగుతోంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ ఇటువంటివి అమలు జరిగితే బాగుంటుందని పేదలు కోరుకుంటున్నారు.
తాజావార్తలు
-
Saunf Sharbat : సోంపు-బెల్లం షర్బత్ తాగితే మండుటెండలో కూడా చల్లగా ఉండచ్చు.! ఎలా చేసుకోవాలో తెలుసా ?
-
Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
-
‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
-
IPL Final 2026: ఐపీఎల్ ఫైనల్ ఎఫెక్ట్.. అహ్మదాబాద్లో విమాన టికెట్లు, హోటల్ ధరలకు రెక్కలు.. గది అద్దె రూ.36 వేలు!
-
Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..