Maharastra: మహారాష్ట్రలో హృదయవిదారకమైన ఘటన.. బైక్పై మృతదేహం తరలింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharastra: అంతరిక్షంలోకి రాకెట్ను ప్రయోగించే సాంకేతికత అభివృద్ధి చెందినా.. ఇంకా దేశంలోని కొన్ని గ్రామాలకు కనీస సౌకర్యాలు కల్పించబడలేదు. అటువంటి వాటిలో ప్రభుత్వ ఆసుపత్రుల దగ్గర అంబులెన్స్ ల ఏర్పాటు కూడా కొన్ని ప్రాంతాల్లో చేయలేదు. ఇలా ఆసుపత్రి వద్ద అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో బైక్పై మృతదేహాన్ని తీసుకెళ్లాల్సి వచ్చింది. మహారాష్ట్రలో ఈ హృదయవిదారకమైన ఘటన చోటు చేసుకుంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన వ్యక్తి మృతదేహాన్ని తమ గ్రామానికి తీసుకెళ్లడానికి అంబులెన్స్లు అందుబాటులో లేకపోవడంతో వేరే గత్యంతరం లేక మృతదేహాన్ని బైక్పై తమ గ్రామానికి తీసుకెళ్లారు. ఈ వృదయ విదాకరమైన ఘటన మహరాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలోని భామ్రాగఢ్లో చోటు చేసుకుంది.
Read also: Income Tax Notice: లక్ష మందికి ఆదాయపు పన్ను శాఖ నోటీసులు.. కారణం ఇదే
Also Read
- Siya Goyal: సియా గోయల్ కుటుంబానికి FDA షాక్.. రూ.8 లక్షల విలువైన వస్తువుల స్వాధీనం
- PM Modi: ఘనంగా ప్రారంభమైన పూరీ జగన్నాథ రథయాత్ర.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు..
- King Cobra Rescue: అమ్మబాబోయ్.. 10 అడుగుల రాచనాగుని చుట్టుకుని బయటకు వచ్చిన మహిళ (వీడియో)
- BMC Taj Mahal Palace Hotel: 26/11 తర్వాత రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు.. తాజ్ హోటల్కు రూ. 22 కోట్ల నోటీసు జారీ
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా లో ఓ షాకింగ్ ఘటన జరిగింది. గడ్చిరోలి జిల్లాలోని భామ్రాగఢ్లో అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో యువకుడి మృతదేహాన్ని ద్విచక్రవాహనంలో కట్టి స్వగ్రామానికి తరలించాల్సి వచ్చింది. గణేష్ తెల్మి అనే యువకుడు క్షయ వ్యాధితో బాధపడుతున్నాడు. కొద్ది రోజుల క్రితం అతనికి ఆరోగ్యం క్షీణించడంతో అతన్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అతను చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతడి మృతదేహాన్ని ఆస్పత్రి నుంచి గ్రామానికి తీసుకెళ్లేందుకు కుటుంబసభ్యులు ఎంతగానో వెతికినా అంబులెన్స్ అంబులెన్స్ అందుబాటులో లేదు. దీంతో ఇక చేసేదేమి లేక మృతి చెందిన యువకుడి కుటుంబానికి చెందిన యువకుడు ఒక బైక్పై మృతదేహాన్ని తమ స్వగ్రామానికి తీసుకెళ్లారు. మరణించిన యువకుడి మృతదేహాన్ని ఒక మంచపై కట్టి.. ఆ మంచాన్ని పడిపోకుండా ఉండేలాగా తన బైక్కు వెనకాల కట్టాడు. అలా మృతదేహం ఉన్న మంచాన్ని బైక్కు కట్టుకని తమ స్వగ్రామానికి తరలించారు. ఎంతో టెక్నాలజీ పెరుగుతున్న ఈ తరుణంలో ఇప్పటికీ కూడా ఆసుప్రతుల దగ్గర అంబులెన్స్ లు అందుబాటులో లేకుండా పోవడం అత్యంత దారుణం. ప్రభుత్వ ఆసుప్రతుల్లో చికిత్స పొందుతూ మరణించే పేద, నిరుపేదలను మృతదేహాలను తమ స్వగ్రామాలకు తరలించడం పెద్ద సమస్యగా మారుతోంది. ఈ సమస్యను పరిష్కరించడం కోసం దేశంలోని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా పార్థీవ దేహాన్ని తరలించడం కోసం ప్రత్యేకంగా అంబులెన్స్ లను ఏర్పాటు చేస్తున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మరణించిన పేదల మృతదేహాల తరలింపుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత పార్థీవ దేహాల తరలింపు అంబులెన్స్ లను ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్తోపాటు మరికొన్ని రాష్ట్రాల్లోనూ ఇటువంటి పథకం అమలు జరుగుతోంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ ఇటువంటివి అమలు జరిగితే బాగుంటుందని పేదలు కోరుకుంటున్నారు.
తాజావార్తలు
-
El Nino: 150ఏళ్లలో తొలిసారి.. మహా విధ్వంసం తప్పదు! భయపెడుతున్న సైంటిస్టుల అంచనా
-
Star Daughters Debut : కొడుకుల టాస్క్ ఫినీష్.. ఇప్పుడు కూతుళ్ల వంతు
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
Leonardo DiCaprio: ఒక్క టిప్తో వెయిటర్ జీవితాన్ని మార్చిన ‘టైటానిక్’ హీరో… కన్నీళ్ళు పెట్టించిన ఉదారత
-
Vivo T5 Lite: వివో T5 లైట్ 44W 5G ఫోన్ రిలీజ్.. 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, MediaTek Dimensity 6300 ప్రాసెసర్
ట్రెండింగ్
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!